Pujara - Rizwan: ఒకే జట్టులో భారత్‌-పాక్‌ కీలక బ్యాట్స్‌మెన్‌.. ఫొటో వైరల్

భారత టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్‌ పుజారా, పాకిస్థాన్‌ టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ ప్రస్తుతం ఒకే జట్టులో ఆడుతున్నారు. వీరిద్దరూ ఇంగ్లాండ్‌లోని ససెక్స్‌ కౌంటీ క్రికెట్‌...

Published : 15 Apr 2022 01:24 IST

(Photo: Sussex Cricket Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్‌ పుజారా, పాకిస్థాన్‌ టాప్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ ప్రస్తుతం ఒకే జట్టులో ఆడుతున్నారు. వీరిద్దరూ ఇంగ్లాండ్‌లోని ససెక్స్‌ కౌంటీ క్రికెట్‌ క్లబ్‌లో గురువారం అరంగేట్రం చేశారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరూ కలిసి దిగిన ఫొటోను ఆ జట్టు ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. దీంతో అది ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఆ ఫొటో చూసిన ఇరు దేశాల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌-పాక్‌ జట్లు త్వరలోనే ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడాలని కామెంట్ల రూపంలో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ ఫొటోకు సరదా కామెంట్లు కూడా పెడుతున్నారు. 





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని