Cheteshwar Pujara: రంజీ ట్రోఫీలో పుజారా డబుల్ సెంచరీ.. టీమ్ఇండియాలోకి రీ ఎంట్రీ?
టీమ్ఇండియా వెటరన్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. ఝార్ఖండ్తో జరుగుతున్న మ్యాచ్లో డబుల్ సెంచరీ బాదాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా (Team India) టెస్టు స్పెషలిస్టు, వెటరన్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) గతేడాది ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో పుజారా నిరాశపరిచాడు. కీలకమైన మ్యాచ్లో విఫలమవడంతో తర్వాత వెస్టిండీస్, సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లకు అతడిని పక్కన పెట్టారు. తిరిగి ఎలాగైనా జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న ఈ సౌరాష్ట్ర ఆటగాడు రంజీ ట్రోఫీలో అదరగొడుతున్నాడు. ఝార్ఖండ్తో జరుగుతున్న ఎలైట్ గ్రూప్ ఏ మ్యాచ్లో పుజారా (243*; 356 బంతుల్లో 30 ఫోర్లు) డబుల్ సెంచరీ బాది అజేయంగా నిలిచాడు. ప్రేరక్ మన్కడ్ (104*; 176 బంతుల్లో) సెంచరీ చేశాడు. 406/4 స్కోరుతో మూడో రోజు, ఆదివారం ఆటను ప్రారంభించిన సౌరాష్ట్ర.. 578/4 వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసి 436 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో ఝార్ఖండ్ 142కే ఆలౌటైంది.
సెలక్టర్లు ఏం చేస్తారో?
జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది. ఇంగ్లాండ్ ఇప్పటికే తమ జట్టును ప్రకటింది. అగార్కర్ సారథ్యంలోని సెలక్షన్ కమిటీ త్వరలోనే భారత జట్టును ప్రకటించనుంది. ఝార్ఖండ్పై డబుల్ సెంచరీ బాదిన పుజారా సెలక్టర్లకు రేసులో తాను కూడా ఉన్నానని చెప్పకనే చెప్పాడు. అతడిని జట్టులోకి తీసుకోవడంపై సెలక్షన్ కమిటీలో కచ్చితంగా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు దూరంగా ఉన్న వెటరన్ ఆటగాడు అజింక్య రహానెను కూడా ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు ఎంపిక చేస్తారని వార్తలొస్తున్నాయి. మరి వీరిద్దరికి అవకాశం కల్పిస్తారా? లేదా భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని కొత్త ఆటగాళ్లను కొనసాగిస్తారా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!