Cheteshwar Pujara: విండీస్ టూర్లో దక్కని చోటు.. ట్విటర్లో ఎమోషనల్ పోస్ట్ పెట్టిన పుజారా
వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు ఎంపిక చేయకపోవడంపై ఛెతేశ్వర్ పుజారా (Cheteshwar Pujara) ఎమోషనల్ అయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: టెస్టుల్లో స్టార్ బ్యాటర్గా పేరొందిన ఛెతేశ్వర్ పుజారాకు టీమ్ఇండియా సెలెక్టర్లు షాకిచ్చారు. త్వరలో వెస్టిండీస్తో జరిగే రెండు టెస్టుల సిరీస్కు అతడిని ఎంపిక చేయలేదు. పుజారా కొన్నేళ్లుగా నిలకడగా రాణించలేకపోతున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ విఫలమయ్యాడు. రెండు ఇన్నింగ్స్ల్లో వరుసగా 14, 27 పరుగులే చేశాడు. పుజారాను జట్టు నుంచి తప్పించడాన్ని పలువురు మాజీలు తప్పుబట్టారు. వెస్టిండీస్తో టెస్టు సిరీస్కు ఎంపిక చేయకపోవడంపై ఛెతేశ్వర్ పుజారా ఎమోషనల్ అయ్యాడు. క్రికెట్ అంటే తనకెంతో ఇష్టమని తెలియజేస్తూ మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ ‘‘🏏 ❤️’’ ఎమోజీలను పోస్ట్ చేశాడు.
బుమ్రా విషయంలో తొందరొద్దు: రవిశాస్త్రి
వెన్ను నొప్పితో గతేడాది సెప్టెంబర్ నుంచి ఆటకు దూరంగా ఉన్న టీమ్ఇండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆగస్టులో ఐర్లాండ్ పర్యటనలో జట్టుతో చేరతాడని వార్తలొస్తున్నాయి. ఈ ఏడాది జరిగే కీలకమైన ఆసియా కప్, వన్డే ప్రపంచకప్లకు బుమ్రాను సిద్ధం చేయడం కోసం ఐర్లాండ్ సిరీస్లో ఆడించాలని టీమ్ఇండియా మేనేజ్మెంట్ భావిస్తోందని సమాచారం. ఈ నేపథ్యంలో బుమ్రాను ఆడించే విషయంలో హడావుడి నిర్ణయాలు తీసుకోవద్దని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి బీసీసీఐకి సూచించాడు. అతడి విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకుంటే టీమ్ఇండియా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించాడు. పాకిస్థాన్ ప్రధాన పేసర్ షాహీన్ అఫ్రిది విషయంలో పీసీబీ ఇలానే తొందరపడిందని, దీంతో అతడు నాలుగు నెలలపాటు జాతీయ జట్టుకు దూరమయ్యాడని రవిశాస్త్రి గుర్తు చేశాడు. బుమ్రాను ఎక్కువ మ్యాచ్ల్లో ఆడిస్తే భారత్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొవాల్సి వస్తుందని చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!