Cricket News: సీఎస్కేకు కొత్త స్పాన్సర్.. బుమ్రాపై స్టెయిన్ ప్రశంసలు
చెన్నై సూపర్ కింగ్స్కు కొత్త స్పాన్సర్ వచ్చేసింది.. ఇంతకీ ఎవరా స్పాన్సర్? టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రాపై స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఇలాంటి క్రికెట్ వార్తల సమాహారం.. మీకోసం
ఇంటర్నెట్ డెస్క్: చెన్నై సూపర్ కింగ్స్కు కొత్త స్పాన్సర్ వచ్చేసింది.. టీమ్ఇండియా ఫాస్ట్ బౌలర్పై దక్షిణాఫ్రికా మాజీ పేసర్ ప్రశంసల వర్షం.. జో రూట్కు బజ్బాల్ క్రికెట్ అవసరం లేదన్న ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్.. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం..
కొత్త స్పాన్సర్తో నంబర్ ‘7’ జెర్సీ..
మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2024 ఎడిషన్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్కు కొత్త స్పాన్సర్ వచ్చింది. ఎతిహాద్ ఎయిర్వేస్తో సీఎస్కే యాజమాన్యం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ మేరకు సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ ‘7’వ నంబర్ జెర్సీని ఫ్రాంచైజీ విడుదల చేసింది. ధోనీ ఇప్పటికే తన ప్రాక్టీస్ను ప్రారంభించాడు. గతేడాది సీజన్ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. ఐదుసార్లు సీఎస్కేను ఛాంపియన్గా నిలిపిన ధోనీ.. ముంబయి మాజీ కెప్టెన్ రోహిత్తో సమంగా నిలిచాడు.
యార్కర్లతో బుమ్రా అదరగొట్టాడు: డేల్ స్టెయిన్
ఇంగ్లాండ్తో తొలి రెండు టెస్టుల్లో తన పేస్తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన జస్ప్రీత్ బుమ్రాపై దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు డేల్ స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘‘టెస్టుల్లో యార్కర్లతో వికెట్లను తీయగల సత్తా ఉన్నవారు చాలా తక్కువ. అందులో బుమ్రా ముందుంటాడు. ట్రెంట్ బౌల్ట్, మిచెల్ స్టార్క్ ఇలా వికెట్లను తీస్తుంటారు. బుమ్రా వారందరి కంటే భిన్నం. పిచ్ పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ వికెట్లను రాబట్టడం అద్భుతం. ప్రస్తుతం భారత పేస్ దళం బలంగా ఉంది. ఇదే సమయంలో వారిపై వర్క్లోడ్ ఎక్కువగా లేకుండా చూడాల్సిన బాధ్యత బీసీసీఐదే. బుమ్రాను మాత్రం కొనసాగించాలి. అతడిని పక్కన పెడితే భారత్కు నష్టమే’’ అని స్టెయిన్ పేర్కొన్నాడు. విశాఖ వేదికగా జరిగిన రెండో టెస్టులో పిచ్ నుంచి పెద్దగా సహకారం లేకపోయినా 9 వికెట్లు తీసి భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అతడే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
బజ్బాల్ క్రికెట్ రూట్కు అవసరం లేదు: మైకెల్ వాన్
భారత్తో టెస్టు సిరీస్లో ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ బ్యాటర్గా పెద్దగా ప్రభావం చూపించలేదు. పర్యటక జట్టు ‘బజ్బాల్’ క్రికెట్ విధానాన్ని జో రూట్ అందుకోలేకపోతున్నాడనే విమర్శలు వచ్చాయి. మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ మాత్రం రూట్ను వెనుకేసుకొచ్చాడు. ‘‘ఇంగ్లాండ్ ఆటగాళ్లు తొలి బంతి నుంచే ఐదో గేర్లో బ్యాటింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు దానికి సరిగ్గా సరిపోతున్నారు. జో రూట్ మాత్రం ఆ బజ్బాల్ క్రికెట్ను మరిచిపోవాలి. అతడి సహజ ఆటతీరును ప్రదర్శిస్తూనే టెస్టుల్లో 10 వేల పరుగులు చేశాడు. అందుకే, రూట్కు బజ్బాల్ క్రికెట్ అవసరం లేదు. ఇప్పటికైనా జట్టు మేనేజ్మెంట్లో ఎవరో ఒకరు రూట్ను తన ఆటను ఆడాలని చెప్పాలి’’ అని మైకెల్ వాన్ వ్యాఖ్యానించాడు. తొలి రెండు టెస్టుల్లోని నాలుగు ఇన్నింగ్స్ల్లో కలిపి రూట్ కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!