ఆ అయిదుగురిని దుబాయి తరలించనున్న సీఎస్‌కే యాజమాన్యం.!

భారత్‌ ఇంగ్లాండ్‌ జట్ల మధ్య శుక్రవారం నుంచి జరగాల్సిన చివరి టెస్టు మ్యాచ్‌ రద్దు కావడంతో.. ఆయా జట్లలో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) ఆటగాళ్లను ప్రత్యేక విమానంలో దుబాయి తరలించాలని సీఎస్‌కే..

Published : 11 Sep 2021 02:23 IST

దుబాయి : భారత్‌ ఇంగ్లాండ్‌ జట్ల మధ్య శుక్రవారం నుంచి జరగాల్సిన చివరి టెస్టు మ్యాచ్‌ రద్దు కావడంతో.. ఆయా జట్లలో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) ఆటగాళ్లను ప్రత్యేక విమానంలో దుబాయి తరలించాలని సీఎస్‌కే యాజమాన్యం భావిస్తోంది. భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా, ఛెతేశ్వర్‌ పుజారా, శార్దూల్‌ ఠాకూర్‌లతో పాటు ఇంగ్లాండ్‌ ఆటగాళ్లు మొయిన్‌ అలీ, సామ్‌ కరన్‌  ఐపీఎల్‌లో సీఎస్‌కే తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. 

‘ఛార్టెర్డ్‌ ఫ్లైట్‌లో ఆటగాళ్లను తరలించడం సాధ్యం కాదు. అందుకే, కమర్షియల్‌ ఫ్లైట్‌లో టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నాం. వారు ఇక్కడికి చేరుకున్న వెంటనే.. ఆరు రోజులు క్వారంటెయిన్‌లో ఉంచుతాం’ అని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్‌ పేర్కొన్నారు. 

చివరి టెస్టు మ్యాచ్‌కు ముందు రోజు టీమిండియా అసిస్టెంట్‌ ఫిజియో యోగేశ్‌ పర్మార్‌ కరోనా బారిన పడినప్పటి నుంచి.. ఆటగాళ్లంతా తమకు కేటాయించిన హోటల్‌ గదుల్లోనే ఉంటున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని