IPL 2021: చెన్నైకి మద్దతిచ్చిన వార్నర్.. పోస్ట్ డిలీట్.. ఎందుకిలా చేశాడు?
మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2021 ప్రారంభం కానుంది. ఎలాగైనా టైటిల్ కైవసం చేసుకోవాలని చెన్నై సూపర్కింగ్స్ , కోల్కతా నైట్రైడర్స్ రెండూ టీమ్స్ తుదిపోరుకు పోరుకు సిద్ధం కానున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2021 ఫైనల్లో గెలిచి నాలుగోసారి టైటిల్ గెలవాలని చెన్నై సూపర్ కింగ్స్, రెండోసారి ధోనీసేనకు షాకివ్వాలని కోల్కతా నైట్ రైడర్స్ పట్టుదలగా ఉన్నాయి. మరోవైపు అభిమానులు సైతం తుదిపోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ మ్యాచ్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై గతేడాది పేలవ ఆటతీరుతో ప్లేఆఫ్స్ చేరకుండా ఇంటిముఖం పట్టగా ఈసారి ఫైనల్కు చేరడంతో అభిమానులు గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే సన్రైజర్స్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తాజాగా ఇన్స్టాగ్రామ్లో ఓ ఆసక్తికర పోస్టు చేసి.. వెంటనే దాన్ని డిలీట్ చేశాడు. అందులో వార్నర్ తన కుమార్తెను భుజాలపై ఎత్తుకొని ఎల్లో జెర్సీ ధరించి చెన్నైకి మద్దతు తెలుపుతున్నట్లు తెలిపాడు. అయితే, వెంటనే దాన్ని తొలగించడం గమనార్హం. కాసేపటికే మరోపోస్టు పెట్టిన అతడు.. ‘ఇందాక నేను చేసిన పోస్టుతో చాలా మంది నిరుత్సాహపడ్డారు. వాళ్లందరికీ క్షమాపణలు. అందుకే అది డిలీట్ చేశాను. ఆ ఫొటోకి ఒరిజనల్ ఇదే’ అంటూ సన్రైజర్స్ జెర్సీలో తన కూతురుతో ఉన్న ఫొటోను పంచుకున్నాడు. అలాగే ఈరోజు ఫైనల్ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందో కామెంట్స్లో చెప్పాలని వార్నర్ తన అభిమానుల్ని కోరాడు. ఏదేమైనా ఈ ఆస్ట్రేలియా ఆటగాడు చెన్నైకి మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రి పెద్దిరెడ్డి వీర విధేయులపై వేటు
-
నారు పోశావా.. నీరు పెట్టావా.. మా భూములపై నీ పెత్తనం ఏంటీ?
-
ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు
-
దక్షిణ చైనా సముద్రంలోకి భారత యుద్ధనౌకలు
-
తోటి పిటిషనర్గా హనుమాన్ పేరు.. కక్షిదారుకు రూ.లక్ష జరిమానా
-
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి చుక్ చుక్