IPL - 2022 : చెన్నై సూపర్‌ కింగ్స్ కొత్త జెర్సీ చూశారా.?

త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్-2022 సీజన్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్ (సీఎస్కే) జట్టు కొత్త జెర్సీని ఆవిష్కరించింది. చెన్నై కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోని, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్ కొత్త జెర్సీని ధరించి ఉన్న..

Published : 23 Mar 2022 17:42 IST

ఇంటర్నెట్ డెస్క్ : త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్-2022 సీజన్‌ కోసం చెన్నై సూపర్‌ కింగ్స్ (సీఎస్కే) జట్టు కొత్త జెర్సీని ఆవిష్కరించింది. చెన్నై కెప్టెన్‌ మహేంద్ర సింగ్ ధోని, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, యువ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్ కొత్త జెర్సీని ధరించి ఉన్న ఓ వీడియోను చెన్నై యాజమాన్యం ట్విటర్‌లో పంచుకుంది. భారత సాయుధ దళాలకు గుర్తుగా గతేడాది చెన్నై యాజమాన్యం జెర్సీపై ఆర్మీ దుస్తుల రంగును ముద్రించింది. అలాగే, ఈసారి కొత్తగా.. చెన్నై జట్టు సాధించిన నాలుగు టైటిళ్లకు గుర్తుగా ఫ్రాంచైజీ లోగోపై నాలుగు నక్షత్రాలను ముద్రించారు. దాంతో పాటు సీఎస్కే ప్రధాన స్పాన్సర్‌ ‘టీవీఎస్‌ యూరోగ్రిప్‌’ లోగోను కూడా జెర్సీపై ఉంచారు. 2010, 2011, 2018,2021 సీజన్‌లో చెన్నై జట్టు ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 

‘విశ్వసనీయమైన, విజయవంతమైన వారసత్వమున్న ‘టీవీఎస్‌ యూరోగ్రిప్‌’ బ్రాండ్‌ లోగోను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు జెర్సీపై ముద్రించినందుకు చాలా గర్వంగా ఉంది. భారత సైనికులకు గౌరవ సూచకంగా గతేడాది ఆర్మీ దుస్తుల రంగును ముద్రించాం. ప్రస్తుతం కాలర్‌ వెనుక భాగంలో కూడా ఆర్మీ సింబల్‌ను ముద్రించాం. అది పసుపు రంగులో బాగా కలిసిపోయింది. మా కెప్టెన్ ధోని కూడా ఆర్మీలో భాగంగా ఉన్నాడు’ అని సీఎస్కే సీఈవో కేఎస్ విశ్వనాథన్‌ పేర్కొన్నాడు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని