Virat - Dravid: విరాట్ ఘనత వెనుక కష్టం ఎవరికీ తెలియదు: ద్రవిడ్
వెస్టిండీస్తో టెస్టు (WI vs IND) సిరీస్లో భాగంగా రెండో మ్యాచ్ ఇవాళ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పలు విషయాలపై స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్తో భారత్ (WI vs IND) 100వ టెస్టు.. విరాట్ కోహ్లీ 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఒకేసారి కలిసి రావడం విశేషం. ఇప్పటికే రెండు టెస్టుల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ట్రినిడాడ్ వేదికగా జరగనున్న రెండో టెస్టులోనూ ఘనవిజయం సాధించాలనే లక్ష్యంతో టీమ్ఇండియా (Team India) బరిలోకి దిగనుంది. ఈ క్రమంలో భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కీలక విషయాలపై మాట్లాడుతూ..
ఎందరికో ఆదర్శం..
‘‘విరాట్ కోహ్లీ (Virat Kohli) ఇప్పుడున్న చాలా మంది యువ క్రికెటర్లకు ఆదర్శం. చరిత్ర పుటల్లో అతడి రికార్డులు, గణాంకాలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇంతటి ఘనత సాధించడానికి కోహ్లీ పడిన శ్రమ, కష్టం ఎవరికీ తెలియదు. ఆ శ్రమే అతడిని 500 మ్యాచ్లు ఆడేలా చేసింది. ఇప్పటికీ యువకులతో పోటీపడేలా ఉన్న అతడి ఫిట్నెస్ స్థాయి అమోఘం. ఈ స్థాయికి చేరుకొనేందుకు ఎన్నో త్యాగాలు చేశాడు. విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రయాణం చూస్తేనే ఉన్నా. గత 18 నెలల్లో అనేక ఇబ్బందులను ఎదుర్కొని మరీ నిలదొక్కుకున్నాడు. వ్యక్తిగతంగా చాలా విషయాలను అతడి నుంచి నేర్చుకున్నా’’
జట్టులో మార్పులు సహజం.. సీనియర్ల పాత్ర చాలా కీలకం
కుర్రాళ్లు సూపర్..
‘‘మన దేశవాళీ క్రికెట్ గొప్పతనం గురించి చెప్పాలి. దాని వల్లే అంతర్జాతీయ క్రికెట్లోకి ప్రతిభావంతులు వస్తున్నారు. విండీస్తో తొలి టెస్టులో యశస్వి జైస్వాల్ అదరగొట్టాడు. శుభ్మన్ గిల్ కూడా గత ఆరేడు నెలలుగా మెరుగ్గా ఆడుతున్నాడు. ఇషాన్ కిషన్కు బ్యాటింగ్లో పెద్దగా అవకాశాలు రాకపోయినా.. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. కుర్రాళ్లు ఒక్కసారి గాడిన పడితే ఆటోమేటిక్గా పరుగులు సాధిస్తారు’’
వందో టెస్టు..
‘‘వెస్టిండీస్తో భారత్ వందో టెస్టు మ్యాచ్ ఆడనుండటం ఆనందంగా ఉంది. ఇరుదేశాల్లోనూ క్రికెట్కు విపరీతమైన ఆదరణ ఉంది. విండీస్ దిగ్గజ క్రికెటర్లను చూస్తూ నేను పెరిగా. కొంతమంది సూపర్స్టార్ ఆటగాళ్లు ఈ వంద టెస్టుల్లో అద్భుతమైన క్రికెట్ ఆడారు. విండీస్-భారత్ క్రికెట్కు ఇదొక ప్రత్యేక సందర్భం. అయితే, ఈ మ్యాచ్లోనూ విజయమే లక్ష్యంగా ఆడతాం. 1983లో విండీస్ను భారత్ ఓడించిన తర్వాత దేశవాళీ క్రికెట్లో పెను మార్పులొచ్చాయి. భారత క్రికెట్కు అదొక మైలురాయి. అప్పుడు నేను పదేళ్ల పిల్లాడిని’’
ఆసియా కప్ షెడ్యూల్పై..
‘‘వన్డే ప్రపంచకప్ మెగా టోర్నీకి ముందు ఆసియా కప్ రానుంది. ఇప్పటికే షెడ్యూల్ను ప్రకటించారు. మంచి సన్నద్ధత లభించినట్లు అవుతుంది. తొలి మ్యాచ్లో పాకిస్థాన్తోనే (IND vs PAK) తలపడనున్నాం. ఆ తర్వాత నేపాల్తో ఆడాలి. సూపర్-4లో పాకిస్థాన్తో మళ్లీ తలపడే అవకాశం ఉంటుంది. ఫైనల్కు వస్తే మూడోసారి కూడా ఆడొచ్చు. ఇలా ఒకే టోర్నీలో మూడుసార్లు పాక్తో తలపడే అవకాశం వస్తే అద్భుతమనే చెప్పాలి. ఇక మా కుర్రాళ్లు కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు’’ అని పేర్కొన్నారు. ద్రవిడ్ మాట్లాడిన ఈ వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
జగనాసురుడి భూదందా... జనం ఆస్తులు గోవిందా..!
-
ఏ ఒత్తిడీ మమ్మల్ని ఆపలేదు.. ఒంటరిగా వెళ్లడానికైనా సిద్ధం: నెతన్యాహు
-
‘కాళేశ్వరం’ విచారణలో ఇక నోటీసులు!
-
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
-
కుమారుడిపై మరుగుతున్న నూనె పోసి హతమార్చిన తల్లి, పెద్దమ్మ
-
జనం ఆస్తులతో.. జగనన్న భూమంతర్..!