ENG vs BAN: కొండంత లక్ష్యం.. సగం వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్
ప్రపంచకప్ టోర్నీ ఆరంభ పోరులో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన ఇంగ్లాండ్.. బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో భారీ విజయంపై కన్నేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ధర్మశాల: ప్రపంచకప్ టోర్నీ ఆరంభ పోరులో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన ఇంగ్లాండ్.. బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో భారీ విజయంపై కన్నేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ భారీ లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ తడబడుతోంది. 27 ఓవర్లు పూర్తి అయ్యేసరికి 5 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. టాపార్డర్లో లిట్టన్ దాస్ (76; 66 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లు) ఒక్కడే పోరాడాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. ప్రస్తుతం ముష్ఫీకర్ రహీమ్ (45*) అర్ధ శతకానికి చేరువ కాగా.. తౌహీద్ హృదయ్ (8*) క్రీజులో ఉన్నాడు.
ఇంగ్లాండ్ పేసర్ రీస్ టాప్లీ ఇన్నింగ్స్ రెండో ఓవర్లో తాంజిద్ హసన్ (1), నజ్ముల్ హొస్సేన్ శాంటో (0)లను వరుస బంతుల్లో పెవిలియన్కు పంపి బంగ్లాకు గట్టి షాక్ ఇచ్చాడు. టాప్లీ కొద్దిసేపటికి షకీబ్ అల్ హసన్ (1)ని కూడా ఔట్ చేయడంతో బంగ్లాదేశ్ 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. మెహదీ హసన్ మిరాజ్ (8)ని క్రిస్ వోక్స్ వెనక్కి పంపాడు. దీంతో 49/4 స్కోరుతో బంగ్లా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ముష్పీకర్ రహీమ్, లిట్టన్ దాస్ నిలకడగా ఆడి ఐదో వికెట్కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. క్రిస్వోక్స్ బౌలింగ్లో దాస్.. వికెట్ కీపర్ బట్లర్కు క్యాచ్ ఇవ్వడంతో బంగ్లా ఐదో వికెట్ కోల్పోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!