IND vs ENG: భారత్ ‘B’ జట్టు చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోవడం బాగుంది: ఆసీస్ మాజీ కెప్టెన్
ఇంగ్లాండ్పై (IND vs ENG) ఐదు టెస్టుల సిరీస్ను ఇప్పటికే కైవసం చేసుకున్న టీమ్ఇండియా.. చివరి మ్యాచ్లోనూ విజయం దిశగా సాగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్ జట్టు ఓడిపోవడాన్ని ఎంతో ఇష్టపడతానని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ టిమ్ పైన్ వ్యాఖ్యానించాడు. భారత్తో జరుగుతున్న (IND vs ENG) ఐదు టెస్టుల సిరీస్లో ఇంగ్లిష్ జట్టు ఇప్పటికే 3-1 తేడాతో వెనుకబడిన సంగతి తెలిసిందే. సిరీస్ను కోల్పోయిన ఇంగ్లాండ్ చివరి టెస్టులోనూ పోరాడుతోంది. ఈ క్రమంలో ఆసీస్ మాజీ సారథి కీలక వ్యాఖ్యలు నెట్టింట వైరల్గా మారాయి. అదే సమయంలో ఇంగ్లాండ్తో బరిలోకి దిగిన భారత్ జట్టును ‘B’ టీమ్గా అభివర్ణించడం గమనార్హం. సైమన్ కటిచ్తో కలిసి ఓ చర్చా కార్యక్రమంలో టిమ్ పాల్గొన్నాడు.
‘‘ఇంగ్లాండ్ జట్టు భారత పర్యటనలో ‘B’ జట్టుతో తలపడుతోంది. ఈ మాట అనడానికి కారణం ఉంది. ప్రస్తుతం ఉన్న జట్టులో విరాట్ కోహ్లీ లేడు. షమీ లేడు. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, పుజారా, రహానె లేరు. బుమ్రా, రవీంద్ర జడేజా మధ్యలో విశ్రాంతి తీసుకున్నారు. అత్యంత బలమైన జట్టు బరిలోకి దిగలేదు. అయితే, భారత్లో అద్భుతమైన క్రికెటర్లకు కొదవలేదని నిరూపితమైంది. భవిష్యత్తులో స్టార్లుగా ఎదిగే సత్తా ఉన్న ప్లేయర్లు వెలుగులోకి వచ్చారు. యశస్వి జైస్వాల్ జట్టును ముందుండి నడిపించడం అభినందనీయం. ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ కూడా అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. కాబట్టి, భారత జట్టు ఇప్పుడు కూడా పటిష్ఠంగానే ఉంది’’ అని సైమన్ కటిచ్ వ్యాఖ్యానించాడు.
గతంలో ఆసీస్కూ పరాభవం తప్పలేదు..
‘‘2018-19 సీజన్లో ఆసీస్కూ భారత్ చేతిలో ఓటమి ఎదురైంది. అప్పుడు కూడా టీమ్ఇండియా స్టార్ ప్లేయర్లు లేకుండానే బరిలోకి దిగింది. మా సొంతగడ్డపై భారత్ ‘B’ జట్టు చేతిలో మేం ఓడాం. ఇప్పుడు కూడా ఇంగ్లాండ్ పరిస్థితి ఇలానే ఉంది. కొంతమంది పెద్ద ప్లేయర్లు లేని భారత్ అద్భుతంగా ఆడుతోంది. ఇంగ్లాండ్ ఇలా ఓడిపోవడాన్ని చూడటం నాకెంతో ఇష్టం. దీనిపై తప్పుబట్టొద్దు. ఇప్పటికీ ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఆటపరంగా అభిమానులను అలరిస్తోంది’’ అని పైన్ తెలిపాడు.
ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్లో 259 పరుగుల ఆధిక్యం సాధించింది. మొదటి ఇన్నింగ్స్లో టీమ్ఇండియా 477 పరుగులకు ఆలౌటైంది. షోయబ్ బషీర్ 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. రెండు వికెట్లు తీసిన అండర్సన్ 700 వికెట్ల క్లబ్లో చేరాడు. అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకే కుప్పకూలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్