Kuldeep: కుల్దీప్ ‘2.0’.. ఏం చేశావని రవిశాస్త్రి నన్ను అడిగారు: సునీల్ జోషి
జట్టులో అవకాశం వస్తే నిరూపించుకోవడానికి భారత ఆటగాళ్లు (Team India) నిరంతరం ఎదురుచూస్తుంటారు. తాజాగా విండీస్ పర్యటనలోని (WI vs IND) వన్డే సిరీస్లో కుల్దీప్ యాదవ్ అదరగొట్టేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: చాలా రోజుల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చిన కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) వెస్టిండీస్ పర్యటనలో తన సత్తా చాటాడు. వన్డే సిరీస్లో (WI vs IND) మూడు మ్యాచుల్లో ఏడు వికెట్లు పడగొట్టాడు. అలాగే తాజాగా ప్రారంభమైన ఐదు టీ20ల సిరీస్ తొలి మ్యాచ్లోనూ ఒక వికెట్ తీశాడు. గత కొంతకాలంగా వికెట్లను పడగొట్టడంలో విఫలమైన కుల్దీప్ ఇప్పుడు సరికొత్తగా తన అస్త్రాలను సిద్ధం చేసుకుని మరీ బరిలోకి దిగాడు. కుల్దీప్ 2.0 ప్రదర్శన వెనుక మాజీ సెలెక్టర్, భారత మాజీ ఆఫ్స్పిన్నర్ సునీల్ జోషి కృషి ఎంతో ఉంది. జట్టులో నుంచి కుల్దీప్ను పక్కకు తప్పించినప్పుడు సునీల్ జోషినే సెలెక్టర్గా ఉండటం గమనార్హం. అయితే, అతడి సూచనలతో కుల్దీప్ తన బౌలింగ్ను మెరుగుపర్చుకున్నాడు.
ఒకే ఇన్నింగ్స్లో 1000 పరుగులు చేసినా.. ఇషాన్ రెండో ఆప్షనే
‘‘కుల్దీప్ జట్టులో స్థానం కోల్పోయినప్పుడు నేను సెలెక్టర్గా ఉన్నా. అతడి బౌలింగ్ను మెరుగుపర్చేందుకు కోచింగ్ స్టాఫ్ కూడా ముందుకు రాలేదు. దీంతో నేను అతడి బౌలింగ్లో మార్పులు చేస్తే బాగుంటుందని సూచించా. ఆ తర్వాత జట్టులోకి వచ్చినప్పుడు అతడు తన సత్తా ఏంటో చాటాడు. ఒక్కసారిగా అందరూ అతడి గురించి మాట్లాడుతున్నారు. ఇదే విషయంపై భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అడిగాడు. కుల్దీప్ మెరుగుకావడానికి ఏం చేశావు? అని ప్రశ్నించాడు. అయితే, నేనేమీ ప్రత్యేకంగా ఏం చేయలేదు. ఒక బౌలింగ్ కోచ్గా ఏం చేస్తారో... నేను కూడా కుల్దీప్ విషయంలో చేశా. ఇప్పుడు కుల్దీప్ 2.0 బౌలింగ్ను గమనిస్తే మీకో విషయం తెలుస్తుంది. అతడి ముంజేయి లక్ష్యంగా చేసుకుని ఉంటుంది. అతడి రనప్లోనూ కాస్త మార్పులు చోటుచేసుకున్నాయి. గాలిలో బంతిని వేగంగా విసురుతున్నాడు’’ అని సునీల్ జోషి వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పూరన్ దంచెన్
ఆఖర్లోనూ భంగపాటే. పేలవ ప్రదర్శనతో పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి ఇండియిన్స్ సీజన్ను ఓటమితో ముగించింది. వాంఖడెలో మొదట తడబడుతూ సాగిన లఖ్నవూకు 200పైగా స్కోరు సాధించే అవకాశం కల్పించి.. ఆ తర్వాత ఛేదనలో మెరుపు ఆరంభం లభించినా తేలిపోయి ఓటమి కొనితెచ్చుకుంది. -
వానా వానా వద్దప్పా!
అసలు జరుగుతుందో లేదో తెలియదు.. కానీ కచ్చితంగా మ్యాచ్ పూర్తవ్వాలని కోరుకుంటున్న అభిమానులు ఎందరో..? జరిగేది ఫైనల్ కాదు.. కానీ అంతకంటే ఎక్కువ ఆసక్తి నెలకొంది ఆ సమరంపై..! -
సెమీస్లో సాత్విక్ జోడీ
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. -
అప్పటి నుంచే ఆ ఆలోచన
అఫ్గానిస్థాన్తో ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్ అనంతరం తొలిసారి రిటైర్మెంట్ ఆలోచన వచ్చిందని, తుది నిర్ణయం తీసుకోవడానికి ఓ నెల సమయం పట్టిందని భారత స్టార్ సునీల్ ఛెత్రి చెప్పాడు. -
ఆర్జనలో రొనాల్డో నం.1
ఫోర్బ్స్ అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. -
మను బాకర్ జోరు
ఒలింపిక్ సెలెక్షన్ ట్రయల్స్లో భారత అగ్రశ్రేణి షూటర్ మను బాకర్ జోరు కొనసాగుతోంది. -
పర్వీన్పై నిషేధం.. చేజారిన ఒలింపిక్ బెర్తు
బాక్సింగ్లో భారత్ ఓ ఒలింపిక్ బెర్తు కోల్పోయింది. -
నా రికార్డులు ప్రస్తుతానికి భద్రమే
తన రికార్డులకు ప్రస్తుతానికి వచ్చిన ముప్పేమి లేదని జమైకా దిగ్గజం ఉసేన్ బోల్ట్ అన్నాడు. -
ట్రయల్స్ వద్దు.. పారిస్కు పంపండి
సెలెక్షన్ ట్రయల్స్లో పాల్గొనాలంటూ తమపై ఒత్తిడి తేవొద్దంటూ పారిస్ ఒలింపిక్ కోటా బెర్తులు సంపాదించిన క్రీడాకారిణులు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు విజ్ఞప్తి చేశారు. -
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
ఐపీఎల్ 2024లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ 18 పరుగుల తేడాతో గెలిచింది. -
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
చెన్నైతో మ్యాచ్ బెంగళూరుకు అత్యంత కీలకం. కానీ, వర్షం పడుతుందనే ఆందోళన ఆ జట్టును వెంటాడుతోంది. ఒకవేళ వర్షం తగ్గితే మాత్రం మ్యాచ్ నిర్వహణకు ఎక్కువ సమయం పట్టుకపోవచ్చు.