SKY: సూర్యకు ‘టెస్టు’ సమయం ఆసన్నమైందన్న గంభీర్.. సోషల్ మీడియాలో స్పందన
వన్డేలు, టీ20ల్లో రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) టెస్టుల్లోకి అరంగేట్రం చేయాల్సి ఉంది. ఇదే విషయాన్ని గౌతమ్ గంభీర్ (Gautham gambhir) సోషల్ మీడియా వేదికగా చెప్పాడు. అయితే నెటిజన్ల నుంచి ఊహించని రీతిలో వ్యతిరేకత రావడం గమనార్హం.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ఫార్మాట్లో అదరగొట్టేస్తున్న సూర్యకుమార్ యాదవ్ ప్రతిభను అందరు ప్రశంసిస్తుంటే.. టీమ్ఇండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ మాత్రం టెస్టుల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని సూచించాడు. శ్రీలంకపై మూడో టీ20 మ్యాచ్లో సెంచరీతో చెలరేగిన సూర్య కుమార్కు అభినందనలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వస్తున్నాయి. సూర్యకుమార్ను ప్రశంసిస్తూనే గంభీర్ చేసిన సూచనకు అభిమానులు ఫిదా అయ్యారు.
‘‘అద్భుతమైన ఇన్నింగ్స్. టెస్టు క్రికెట్లోకి తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని గంభీర్ ట్వీట్ చేశాడు. దీంతో సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందనలు వచ్చాయి. అలా కొన్ని స్పందనలు..
‘‘గౌతీ.. మీ దగ్గర నుంచి ఉత్తమమైన విషయం ఆశించాం. కానీ అలా జరగలేదు. ఎందుకు అతడినే జట్టులోకి తీసుకోవాలి? మరి రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణించే వారి సంగతేంటి? ఉదాహరణకు సర్ఫరాజ్.. ఒకవేళ మీరు చెప్పినట్లు సూర్యకుమార్ను తీసుకోవాలనుకుంటే సరైన నిర్ణయం కాదు. ఎందుకంటే వైట్బాల్ (వన్డేలు, టీ20లు) క్రికెట్లో ఫామ్ ఆధారంగా పూర్తి విభిన్నమైన ఫార్మాట్కు తీసుకోవాలని చెప్పడం సరైంది కాదు’’
‘‘అవును. సుదీర్ఘ ఫార్మాట్లో ఎలా రాణిస్తాడనేది చూడాలి. తప్పకుండా స్టీవ్ స్మిత్ కంటే ఉత్తమ బ్యాటర్గా మారతాడు’’
‘‘తప్పకుండా టెస్టుల్లోకి సూర్య రావాలి. సుదీర్ఘ ఫార్మాట్లో వీరేంద్ర సెహ్వాగ్ దూకుడైన బ్యాటింగ్ శైలిని మిస్ అయ్యాం. ఇప్పుడు సూర్య వస్తే మాత్రం టెస్టులు కూడా అద్భుతమైన ఎంటర్టైన్మెంట్గా మారతాయి. మూడు ఫార్మాట్లలో అతడిని చూడటం బాగుంటుంది’’
‘‘ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవాలి? టీ20ల్లో అద్భుతంగా ఆడితే టెస్టుల్లోకి ఎంపిక చేస్తారా..? ఇక సర్ఫరాజ్ వంటి క్రికెటర్లు రంజీల్లో రాణించడం ఎందుకు? అందరూ అన్ని ఫార్మాట్లకు అవసరం లేదు. అతడిని టీ20 స్పెషలిస్ట్గానే ఆడనివ్వండి’’
‘‘ఇది సరైన నిర్ణయం కాదు. సూర్య మీద అనవసరంగా ఒత్తిడి తీసుకొచ్చి అతడి ఆటను నాశనం చేయొద్దు. టీ20ల తర్వాత వన్డేలపై దృష్టిసారించాలి. ఎందుకంటే వన్డే ప్రపంచకప్ లక్ష్యం కావాలి’’
‘‘మీరు ఎందుకు సర్ఫరాజ్ ఖాన్, విహారి వంటి వారి గురించి మాట్లాడరు. ప్లీజ్ అతడిని టెస్టుల్లోకి, అలాగే వన్డేల్లోకి తీసుకోరావాలని కోరుకోవద్దు’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!