MSD - Rohit Sharma: ఎంఎస్ ధోనీ వల్లే.. అక్కడ రోహిత్ సక్సెస్: గౌతమ్ గంభీర్
రోహిత్ శర్మ (Rohit Sharma) విజయవంతమైన బ్యాటర్గా, కెప్టెన్గా మారడంలో ఎంఎస్ ధోనీదే కీలక పాత్ర అని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: కెరీర్ ఆరంభంలో మిడిలార్డర్లో ఆడిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కొన్ని సంవత్సరాలకే ఓపెనర్గా మారాడు. తాజాగా వన్డేల్లో 10వేలకుపైగా పరుగులు చేసిన జాబితాలోకి చేరిన రోహిత్.. గతంలోనే ఓపెనర్గా వస్తూ అత్యంత వేగంగా 8వేలకుపైగా పరుగులు చేసిన బ్యాటర్గా అవతరించాడు. రోహిత్ 2007లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టినప్పటికీ.. జట్టులో స్థానం సంపాదించడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. అయితే, అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) చొరవతో రోహిత్ ఓపెనర్గా మారిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదని మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (Gautham Gambhir) వ్యాఖ్యానించాడు. రోహిత్ను ఓపెనర్గా ధోనీ ప్రమోట్ చేసి మద్దతుగా నిలవడంతోనే అతడి కెరీర్ ఉన్నత స్థాయికి వెళ్లిందని పేర్కొన్నాడు.
‘‘వన్డేల్లో పదివేలకుపైగా పరుగులు చేయడమంటే సులువేం కాదు. కెరీర్లో ఎత్తుపల్లాలను అనుభవించి ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ప్రస్తుతం రోహిత్ కెప్టెన్గా యువ క్రికెటర్లకు మద్దతుగా ఉండటం చూస్తున్నాం. ఇప్పుడు రోహిత్ శర్మ ఇలా ఉండటానికి ప్రధాన కారణం మాత్రం ఎంఎస్ ధోనీ. ఎందుకంటే ధోనీ కెప్టెన్గా ఉన్నప్పుడు యువ క్రికెటర్లకు మద్దతు ఇచ్చేవాడు. మరీ ముఖ్యంగా రోహిత్ తన కెరీర్ ఆరంభంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అలాంటి సమయంలో ఎంఎస్ ధోనీ అండగా నిలిచి అవకాశాలు ఇచ్చాడు. ఇప్పుడు రోహిత్ కూడా తన జూనియర్ల విషయంలోనూ అలానే ఉండాలి.
రోహిత్ను తొలిసారి దేశవాళీ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా కలిశా. మా జట్టుకు ప్రత్యర్థిగా బరిలోకి దిగాడు. మేం 350 పరుగుల వరకు చేశాం. రోహిత్ శర్మ ఐదో స్థానంలో వచ్చి 130 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. అప్పుడే నేను వసీమ్ జాఫర్ను ఎవరు అతడు? అని అడిగా. అప్పటి నుంచే ఇతడిలో ఏదో ప్రత్యేకత ఉందనిపించింది’’ అని గంభీర్ తెలిపాడు. భారత్ తరఫున పది వేల పరుగుల క్లబ్లో చేరిన ఆరో బ్యాటర్ రోహిత్ శర్మ కావడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.