మహా పోరు.. మజా ఫుల్లు
భారత గడ్డపై చేదు అనుభవాలను చెరిపివేస్తూ సిరీస్ విజయంతో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలన్న పట్టుదల ఆస్ట్రేలియాది. ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మరో సిరీస్ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ బెర్తు సాధించాలన్న పంతం భారత్ది.
భారత గడ్డపై చేదు అనుభవాలను చెరిపివేస్తూ సిరీస్ విజయంతో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలన్న పట్టుదల ఆస్ట్రేలియాది. ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మరో సిరీస్ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ బెర్తు సాధించాలన్న పంతం భారత్ది.
ఇరు జట్లూ మంచి ఫామ్లో ఉన్నాయి. రెండింటి బలాబలాలు సమం. ఇటూ అటూ స్టార్లకు కొదవ లేదు. గురువారం మొదలయ్యే బోర్డర్-గావస్కర్ ట్రోఫీ నాలుగు టెస్టుల సిరీస్ను చూసేందుకు కారణాలు చాలానే ఉన్నాయి.
ఈనాడు క్రీడావిభాగం
ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఎప్పుడూ తమ చిరకాల ప్రత్యర్థి ఇంగ్లాండ్తో తలపడే యాషెస్నే అత్యుత్తమ సిరీస్గా పరిగణిస్తుంటారు. తమ వరకు దాన్నిమించి సిరీస్ లేదంటారు. ఆ విజయాన్ని గొప్పగా భావిస్తారు. కానీ ఇప్పుడు వారి స్వరం మారుతోంది. భారత్లో ఆడబోయే టెస్టు సిరీస్ను యాషెస్తో సమానం అని కొందరంటుంటే.. ఇందులో విజయం సాధిస్తే యాషెస్ను మించిన విజయం అవుతుందని కొందరంటున్నారు. ఈ సిరీస్ ప్రాధాన్యమేంటో చెప్పడానికి ఇంతకంటే రుజువు కావాలా? వరుసగా రెండు పర్యాయాలు తమ గడ్డపై టీమ్ఇండియా సిరీస్లు సాధించి చరిత్ర సృష్టించగా.. ఆసీస్ మాత్రం 2004 తర్వాత భారత్లో సిరీస్ విజయం దక్కని అసంతృప్తితో ఉంది. రెండో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్లో నిలకడగా విజయాలు సాధిస్తూ పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆ జట్టు.. భారత్లో సిరీస్ సాధించడాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ఆస్ట్రేలియాకు దాని గడ్డపై పరాభవం మిగిల్చిన భారత్.. ఇప్పుడు సూపర్ ఫామ్తో తమ దేశానికి వచ్చిన ఆ జట్టును ఇక్కడా దెబ్బ కొట్టి ఆధిపత్యాన్ని చాటాలని భారత్ చూస్తోంది.
తేల్చేది వీళ్లే..
ఈ సిరీస్లో స్పిన్నర్లదే అత్యంత కీలక పాత్ర అని, సిరీస్ ఫలితాన్ని నిర్ణయించేది వాళ్లే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు జట్లలో నలుగురు చొప్పున స్పిన్నర్లు జట్టులో ఉండడం విశేషం. ఇరు జట్లూ తుది జట్లలో కనీసం ఇద్దరు స్పిన్నర్లను దించడం ఖాయం. భారత్ ముగ్గురిని ఆడించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. ఎన్నో ఏళ్లుగా ప్రపంచ మేటి స్పిన్నర్లలో ఒకడిగా కొనసాగుతున్న అశ్విన్.. ఆస్ట్రేలియా తరఫున నిలకడగా రాణిస్తున్న లైయన్ మధ్య పోరు ఆసక్తి రేకెత్తించేదే. వీరిలో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరం. భారత జట్టులో ఇంకా కుల్దీప్, జడేజా, అక్షర్ లాంటి నాణ్యమైన స్పిన్నర్లున్నారు. వీరికి భారత పిచ్లు కొట్టిన పిండే. వీరిలో ఎవరు తుది జట్టులో ఉన్నా పిచ్ కొంచెం సహకరిస్తే కంగారూలకు ఇబ్బంది కలిగించడం ఖాయం. ఆస్ట్రేలియా జట్టులో అగార్, స్వెప్సన్, మర్ఫీల రూపంలో మరో ముగ్గురు స్పిన్నర్లున్నారు. వీరు ప్రతిభావంతులే అయినా.. భారత పిచ్లపై ఆడిన అనుభవం లేదు. మరి వాళ్లు ఎంతమేర సత్తా చాటుతారో చూడాలి.
నువ్వానేనా?
భారత్-ఆస్ట్రేలియా సిరీస్ అమితాసక్తిని రేకెత్తిస్తుండడానికి ఇరు జట్ల బలాబలాలు సమానంగా కనిపిస్తూ, మ్యాచ్లు హోరాహోరీగా సాగేలా కనిపిస్తుండడం కూడా ఓ కారణమే. రెండు జట్లకూ అత్యుత్తమ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. వారు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. కెప్టెన్ రోహిత్తో పాటు కోహ్లి, పుజారా, కేఎల్ రాహుల్ లాంటి స్టార్ బ్యాటర్లు భారత జట్టులో ఉన్నారు. కోహ్లి ఒకప్పటి స్థాయి ఫామ్లో లేకపోయినా.. ఇటీవల అతడి ప్రదర్శన ఆశాజనకంగానే ఉంది. తనలోని మేటి బ్యాటర్ను అతను మళ్లీ ఈ ప్రతిష్టాత్మక సిరీస్లో బయటికి తీస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. పుజారా కూడా ఈ సిరీస్లో ముఖ్య పాత్ర పోషిస్తాడని ఆశిస్తున్నారు. రోహిత్కు బ్యాటర్గానే కాక కెప్టెన్గా ఈ సిరీస్ కీలకం. రాహుల్ కూడా తన స్థాయిని, సత్తాను చాటాల్సి ఉంది. ఆస్ట్రేలియా విషయానికొస్తే.. స్టీవ్ స్మిత్ ఆ జట్టుకు అతి పెద్ద బలం. టాంపరింగ్ కుంభకోణం వల్ల మధ్యలో కెరీర్ కొంత దెబ్బ తిన్నా.. ఇటీవల తన పతాక స్థాయిని అందుకుని పాత స్మిత్ను గుర్తుకు తెస్తున్నాడతను. భారత్లో అతడికి గొప్ప రికార్డుంది. అనుభవజ్ఞుడు వార్నర్కు ఈ సిరీస్ ఎంతో కీలకం. చరమాంకంలో ఉన్న అతను.. భారత్పై సత్తా చాటి కెరీర్కు ఘనమైన ముగింపునివ్వాలనుకుంటున్నాడు. భీకర ఫామ్లో ఉన్న ఖవాజా, మేటి బ్యాటర్గా ఎదుగుతున్న లబుషేన్ భారత పర్యటనలో బలమైన ముద్ర వేయాలనుకుంటున్నారు. స్పిన్నర్లను ఆడడం కఠిన సవాలుగా మారబోయే ఈ సిరీస్లో ఇరు జట్లలోని స్టార్లలో ఎవరు మేటిగా నిలుస్తారన్నది ఆసక్తికరం.
వారికి చెలగాటం..
2021-23 డబ్ల్యూటీసీ సైకిల్లో ఆస్ట్రేలియాది తిరుగులేని ఆధిపత్యం. ఆ జట్టు 75.56 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. భారత్ 58.93 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. భారత్తో సిరీస్లో ఓడినా ఆ జట్టు ఫైనల్ బెర్తుకు వచ్చిన ముప్పేమీ లేనట్లే! కానీ భారత్ మాత్రం ఈ సిరీస్ గెలిస్తేనే ఫైనల్ చేరుతుంది. కాబట్టి ఈ సిరీస్ ఆసీస్కు చెలగాటం, భారత్కు ప్రాణ సంకటం అన్నట్లే. డబ్ల్యూటీసీ ఫైనల్ ముంగిట జరిగే చివరి సిరీస్ కావడంతో దీనిపై మిగతా జట్ల భవితవ్యం కూడా ఆధారపడి ఉంది. కాబట్టి క్రికెట్ ప్రపంచమంతా ఈ సిరీస్ను ప్రత్యేక ఆసక్తితో చూస్తుందనడంలో సందేహం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
T20 jersey: టీ20 ప్రపంచకప్ టోర్నీకి టీమ్ఇండియా జెర్సీల ధరను అడిడాస్ ప్రకటించింది. -
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్య జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. పాక్లో టీమ్ఇండియా పర్యటిస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
టీమ్ఇండియా బ్యాటర్ శివమ్ దూబె (Shivam Dube)పై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చే టీ20 ప్రపంచకప్లో పవర్ఫుల్ హిట్టింగ్తో అలరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తివంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు