CSK vs PBKS: పంజాబ్కే చిక్కింది
చెన్నై స్కోరు 200.. ఛేదన ఆరంభంలో ప్రభ్సిమ్రన్ మెరిసినా ఇన్నింగ్స్ సగం అయ్యేసరికి ఒత్తిడి పంజాబ్పైనే!
ఉత్కంఠ పోరులో చెన్నై ఓటమి
మెరిసిన లివింగ్స్టోన్, ప్రభ్సిమ్రన్
కాన్వే శ్రమ వృథా
చెన్నై స్కోరు 200.. ఛేదన ఆరంభంలో ప్రభ్సిమ్రన్ మెరిసినా ఇన్నింగ్స్ సగం అయ్యేసరికి ఒత్తిడి పంజాబ్పైనే! ఈ స్థితిలో చెలరేగిన లివింగ్స్టోన్, కరన్, జితేశ్ పంజాబ్కు విజయాన్నందించారు. ఒకరుపోతే ఇంకొకరు అన్నట్లుగా చెలరేగి చెన్నైకు ఓటమి మిగిల్చారు. ఆఖర్లో సికందర్ రజా ఉత్కంఠను అధిగమించి పంజాబ్ను గెలిపించాడు. సీఎస్కేకు ఇది వరుసగా రెండో ఓటమి. గత అయిదు మ్యాచ్ల్లో పంజాబ్కిది మూడో విజయం.
ఐపీఎల్-16లో పంజాబ్కు అదిరే విజయం. పట్టుదలగా ఆడిన ఆ జట్టు ఉత్కంఠ పోరులో చెన్నైపై విజయాన్ని అందుకుంది. ఆదివారం 4 వికెట్ల తేడాతో సీఎస్కేపై నెగ్గింది. మొదట ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డెవాన్ కాన్వే (92 నాటౌట్; 52 బంతుల్లో 16×4, 1×6) సత్తా చాటడంతో చెన్నై 200/4 స్కోరు చేసింది. ఛేదనలో ప్రభ్సిమ్రన్ (42; 24 బంతుల్లో 4×4, 2×6), లివింగ్స్టోన్ (40; 24 బంతుల్లో 1×4, 4×6) మెరుపులతో లక్ష్యాన్ని పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి అందుకుంది. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్పాండే (3/49), జడేజా (2/32) రాణించినా జట్టును గెలిపించలేకపోయారు.
పంజాబ్ మెరుపుదాడి: ఆరంభంలో ప్రభ్సిమ్రన్ సింగ్ మెరుపులు.. మధ్యలో లివింగ్స్టోన్, కరన్ దూకుడు..! ఆఖర్లో సికందర్ రజా తెలివైన బ్యాటింగ్.. వెరసి పంజాబ్ విజయం! ఇది కింగ్స్ ఛేదన సాగిన తీరు. భారీ ఛేదనలో పంజాబ్ది ఆరంభం నుంచి ఎదురుదాడే! శిఖర్ ధావన్ (28) అండతో చెలరేగిన ఓపెనర్ ప్రభ్సిమ్రన్ జట్టుకు మెరుపు ఆరంభాన్నిచ్చాడు. దేశ్పాండే బౌలింగ్లో ఓ ఫ్లిక్ సిక్స్తో మొదలైన అతడి జోరు ఆ తర్వాత మరింత పెరిగింది. ధావన్ కూడా కొన్ని షాట్లు ఆడడంతో పవర్ ప్లే ఆఖరికి పంజాబ్ 62/1తో మెరుగ్గా కనిపించింది. కానీ కుదురుకున్న ప్రభ్సిమ్రన్, అథర్వ (13)ను ఔట్ చేసిన జడేజా.. ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో కింగ్స్కు సమీకరణం (30 బంతుల్లో 72) క్లిష్టంగా మారింది. ఈ స్థితిలో సిక్స్లతో చెలరేగిన లివింగ్స్టోన్, కరన్ (29; 20 బంతుల్లో 1×4, 1×6) పంజాబ్లో ఆశలు రేపారు. అయితే స్వల్ప తేడాతో వీళ్లిద్దరూ ఔట్ కావడంతో మళ్లీ మ్యాచ్ సీఎస్కే వైపు మొగ్గింది. ఈ స్థితిలో దూకుడుగా ఆడిన జితేశ్ శర్మ (21; 10 బంతుల్లో 2×4, 1×6) జట్టును విజయపథంలో నడిపించాడు. పతిరన వేసిన ఆఖరి ఓవర్లో పంజాబ్కు 9 పరుగులు అవసరం కాగా.. తొలి మూడు బంతుల్లో 2 పరుగులే రావడంతో ఉత్కంఠ నెలకొంది. 4, 5 బంతులకు సికందర్ రజా (13 నాటౌట్) రెండేసి పరుగులు చేయడంతో మ్యాచ్ సూపర్ ఓవర్కు మళ్లుతుందా అనిపించింది. కానీ ఆఖరి బంతికి 3 పరుగులు చేయాల్సి ఉండగా.. స్క్వేర్ లెగ్ వైపు షాట్ కొట్టి మూడు పరుగులు చేసిన రజా.. పంజాబ్కు విజయాన్ని అందించాడు.
కాన్వే ఒక్కడే..: అంతకుముందు చెన్నై ఇన్నింగ్స్లో కాన్వే ఆటే హైలైట్. మొదట రుతురాజ్ గైక్వాడ్ (37; 31 బంతుల్లో 4×4, 1×6)తో ఇన్నింగ్స్కు పునాది వేసిన ఈ లెఫ్ట్హ్యాండర్.. ఆ తర్వాత శివమ్ దూబె (28; 17 బంతుల్లో 1×4, 2×6) అండతో భారీ స్కోరుకు బాటలు వేశాడు. ఎక్కువ గ్రౌండ్ షాట్లే ఆడిన కాన్వే.. బౌండరీలతోనే స్కోరు పెంచాడు. రుతురాజ్ కూడా కుదురుగా బ్యాటింగ్ చేశాడు. వికెట్ పడకున్నా 9 ఓవర్లకు చెన్నై చేసింది 77 పరుగులే. అయితే రుతురాజ్ ఔటై.. దూబె క్రీజులోకి వచ్చాక ఇన్నింగ్స్కు ఊపొచ్చింది. రబాడ, రజా బౌలింగ్లో ఈ లెఫ్ట్ హ్యాండర్ రెండు సిక్స్లు బాది స్కోరుబోర్డుకు వేగాన్ని అందించాడు. కానీ దూబెతో పాటు మొయిన్ అలీ (10) ఔట్ కావడంతో చెన్నైకు ఎదురుదెబ్బ తగిలింది. 17 ఓవర్లకు ఆ జట్టు స్కోరు 169/3. కానీ దూకుడుగా ఆడిన కాన్వే స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. ఆఖరి ఓవర్లో చివరి రెండు బంతులకు ధోని (13 నాటౌట్; 4 బంతుల్లో 2×6) సిక్స్లు బాదడంతో చెన్నై 200 మార్కు అందుకుంది. చివరి రెండు ఓవర్లలో ఎక్కువగా స్ట్రెక్ రాకపోవడంతో కాన్వే సెంచరీ చేయలేకపోయాడు.
చెన్నై ఇన్నింగ్స్: రుతురాజ్ (స్టంప్డ్) జితేశ్ (బి) రజా 37; కాన్వే నాటౌట్ 92; దూబె (సి) షారుక్ (బి) అర్ష్దీప్ 28; మొయిన్ (స్టంప్డ్) జితేశ్ (బి) రాహుల్ చాహర్ 10; జడేజా (సి) లివింగ్స్టోన్ (బి) కరన్ 12; ధోని నాటౌట్ 13; ఎక్స్ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 200; వికెట్ల పతనం: 1-86, 2-130, 3-158, 4-185; బౌలింగ్: అర్ష్దీప్ 4-0-37-1; రబాడ 4-0-34-0; కరన్ 4-0-46-1; రాహుల్ చాహర్ 4-0-35-1; సికందర్ 3-0-31-1; లివింగ్స్టోన్ 1-0-16-0
పంజాబ్ ఇన్నింగ్స్: ప్రభ్సిమ్రన్ (స్టంప్ట్) ధోని (బి) జడేజా 42; ధావన్ (సి) పతిరన (బి) తుషార్ 28; అథర్వ (సి) అండ్ (బి) జడేజా 13; లివింగ్స్టోన్ (సి) రుతురాజ్ (బి) తుషార్ 40; కరన్ (బి) పతిరన 29; జితేశ్ (సి) రషీద్ (బి) తుషార్ 21; షారుక్ నాటౌట్ 2; రజా నాటౌట్ 13; ఎక్స్ట్రాలు 13 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 201; వికెట్ల పతనం: 1-50, 2-81, 3-94, 4-151, 5-170, 6-186; బౌలింగ్: ఆకాశ్ సింగ్ 3-0-35-0; తుషార్ దేశ్పాండే 4-0-49-3; తీక్షణ 4-0-36-0; జడేజా 4-0-32-2; మొయిన్ 1-0-10-0; పతిరన 4-0-32-1
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం