Chess: ఇది బంగారు తరం
భారత చెస్లో ఇప్పుడు సువర్ణాధ్యాయం నడుస్తోందని దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ అన్నాడు. యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద చెస్ ప్రపంచకప్లో కార్ల్సన్తో ఫైనల్ ఆడుతున్న నేపథ్యంలో ఆనంద్ ఈ వ్యాఖ్యలు చేశాడు. దేశంలో ఇటీవల కాలంలో అనేకమంది గ్రాండ్మాస్టర్లుగా ఎదిగిన సంగతి తెలిసిందే.
చెన్నై: భారత చెస్లో ఇప్పుడు సువర్ణాధ్యాయం నడుస్తోందని దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ అన్నాడు. యువ గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద చెస్ ప్రపంచకప్లో కార్ల్సన్తో ఫైనల్ ఆడుతున్న నేపథ్యంలో ఆనంద్ ఈ వ్యాఖ్యలు చేశాడు. దేశంలో ఇటీవల కాలంలో అనేకమంది గ్రాండ్మాస్టర్లుగా ఎదిగిన సంగతి తెలిసిందే. వాళ్లలో చాలా మందికి 2,700పై ఎలో రేటింగ్ ఉండడం గొప్ప విషయమని ఆనంద్ అన్నాడు. ‘‘వాళ్లది బంగారు తరం. వాళ్లంతా 2,700పై ఎలో రేటింగ్తో ఉన్నారు. వయసు 20 లోపే. ఇది అంత తేలికైన విషయం కాదు. ఇది చాలా ప్రత్యేకమైంది. వచ్చే పదేళ్లు ఈ యువ క్రీడాకారులు అత్యున్నత స్థితిలో ఉంటారు. అందుకే వారిది బంగారు తరం అంటున్నా’’ అని చెప్పాడు.
అమన్ప్రీత్కు స్వర్ణం
ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్
బాకు: ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారుల ఉత్తమ ప్రదర్శన కొనసాగుతోంది. పురుషుల 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ విభాగంలో అమన్ప్రీత్ సింగ్ బుధవారం స్వర్ణం సాధించాడు. అతను ఫైనల్లో 577 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. లీ గన్యోక్ (కొరియా-574), కెవిన్ చాపన్ (ఫ్రాన్స్-573) వరుసగా రజతం, కాంస్యం గెలిచారు. మహిళల 25 మీటర్ల స్టాండర్డ్ విభాగంలో తియానా (538), యాషిత షోకీన్ (536), కృతిక శర్మ (527) విడి విడిగా పతకాలు సాధించలేకపోయినా.. ఉమ్మడి స్కోరుతో కాంస్యం గెలి చారు. ఈ టోర్నీలో ఇప్పటిదాకా భారత్ అయిదు స్వర్ణాలు, నాలుగు కాంస్యాలు సాధించింది.
భారత మహిళలకు మూడో స్థానం
డసెల్డార్ఫ్ (జర్మనీ): నాలుగు దేశాల జూనియర్ హాకీ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు మూడో స్థానం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్లో 6-2తో ఇంగ్లాండ్ను మట్టికరిపించింది. భారత్ తరఫున అన్ను (26వ, 43వ) రెండు గోల్స్ కొట్టగా.. నీలమ్ (25వ), తొప్పో (35వ), హినా బానో (38వ), ముంతాజ్ ఖాన్ (40వ) తలో గోల్ చేశారు. ఇంగ్లాండ్ జట్టులో క్లాడియా స్వెయిన్ (16వ), చార్లోట్ బింగమ్ (54వ) చెరో గోల్ సాధించారు. మ్యాచ్లో ఇంగ్లాండే మొదట ఆధిక్యంలోకి వెళ్లినా.. ఆ తర్వాత భారత్ అదరగొట్టింది.
ఇంగ్లాండ్, నెదర్లాండ్స్లతో భారత్ ఢీ
ప్రపంచకప్ వార్మప్ షెడ్యూల్ ఖరారు
దుబాయ్: వన్డే ప్రపంచకప్ ముంగిట టీమ్ఇండియా ఆడే వార్మప్ మ్యాచ్ల షెడ్యూల్ ఖరా రైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్తో పాటు పసికూన నెదర్లాండ్స్ను రోహిత్ సేన ఢీకొనబోతోంది. సెప్టెంబరు 30న గువాహటిలోని బర్సపర స్టేడియంలో ఇంగ్లాండ్తో తలపడబోతున్న భారత్.. అక్టోబరు 3న తిరువనంతపురంలో నెదర్లాండ్స్తో మ్యాచ్ ఆడుతుంది. వార్మప్ మ్యాచ్లకు గువాహటి, తిరువనంతపురంతో పాటు హైదరాబాద్ వేదికలుగా ఖరారైన సంగతి తెలిసిందే. ప్రపంచకప్లో భారత్ ఆడే మ్యాచ్ను దక్కించుకోలేపోయిన హైదరాబాద్కు వార్మప్లోనూ రోహిత్ సేనకు ఆతిథ్యమిచ్చే అవకాశం లభించలేదు. సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 3 వరకు వార్మప్ మ్యాచ్లు జరుగుతాయి. టోర్నీలో తలపడే పది జట్లూ రెండు చొప్పున మ్యాచ్లు ఆడతాయి. అక్టోబరు 5న ఇంగ్లాండ్-న్యూజిలాండ్ పోరుతో ప్రపంచకప్ ఆరంభమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
చెన్నై జట్టుకు గాయాలు ఇబ్బందిగా మారాయి. యువ పేసర్ పతిరన గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. -
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వని కారణంగా రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) సస్పెన్షన్ వేటు వేసింది. -
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
ఐపీఎల్ 17వ సీజన్లో సిరాజ్ తొలిసారి అత్యుత్తమ బౌలింగ్తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
క్రికెట్ అభిమానులను అలరించడానికి ప్రతి దేశం ఓ లీగ్ను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే భారత్లో ఐపీఎల్, పాక్లో పీఎస్ఎల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది ఈ రెండు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉంది. -
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. -
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న