ODI WC 2023: ఈ కప్పుపైనే కళ్లన్నీ!
ప్రపంచంలోనే మేటి జట్లు తలపడేది ఈ కప్పు కోసమే! మైదానంలో యుద్ధానికి దిగేది ఈ కప్పును ముద్దాడటం కోసమే! ఒక్కసారైన విశ్వ విజేతగా నిలవాలనే లక్ష్యంతో కొన్ని..
క్రికెట్ ప్రపంచకప్మరో 14 రోజుల్లో
రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రదర్శనకు ఉంచిన ప్రపంచకప్ ట్రోఫీ
ఈనాడు - హైదరాబాద్ : ప్రపంచంలోనే మేటి జట్లు తలపడేది ఈ కప్పు కోసమే! మైదానంలో యుద్ధానికి దిగేది ఈ కప్పును ముద్దాడటం కోసమే! ఒక్కసారైన విశ్వ విజేతగా నిలవాలనే లక్ష్యంతో కొన్ని.. ట్రోఫీని మరోసారి దక్కించుకోవాలనే పట్టుదలతో మరికొన్ని.. ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యాన్ని కొనసాగించాలనే సంకల్పంతో ఇంకొన్ని జట్లు.. ఇలా అందరి కళ్లు ఈ కప్పును సొంతం చేసుకోవడం మీదే! ఏ జట్టు చేతుల్లో ఒదిగిపోతుందోనని అభిమానులూ దృష్టి పెట్టేది ఈ కప్పు మీదే! మరో పక్షం రోజుల్లోపే ఈ కప్పు పోరు ప్రారంభం కానుంది. భారత్ వేదికగా వచ్చే నెల 5న వన్డే ప్రపంచకప్ ఆరంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో విజేతగా నిలిచే జట్టుకు అందించే కప్పు బుధవారం హైదరాబాద్కు చేరుకుంది. ప్రపంచకప్కు ముందు నిర్వహిస్తున్న ఈ ట్రోఫీ పర్యటనలో భాగంగా ప్రత్యేకంగా రామోజీ ఫిల్మ్సిటీలో ఈ కప్పును ప్రదర్శించారు.. గురువారం నగరంలోని చార్మినార్, ఉప్పల్ క్రికెట్ మైదానంలో దీన్ని ప్రదర్శించనున్నారు.
అలా మొదలైంది..
- ఇప్పుడున్న ట్రోఫీని 1999 ప్రపంచకప్ నుంచి విజేతలకు అందిస్తున్నారు. ఛాంపియన్ జట్టుకు మొదట ఈ ట్రోఫీని ప్రదానం చేసి.. అనంతరం దీని నమూనాను అందజేస్తారు. నిజమైన ట్రోఫీ కింది భాగంలో విజేత జట్ల పేర్లను రాస్తారు.
- ప్రస్తుత ట్రోఫీని లండన్లోని గరార్డ్ అండ్ కో అనే ఆభరణాల సంస్థ తయారుచేసింది. దీని తయారీలో బంగారం, వెండి వాడారు. ఇది 60 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది. దీని బరువు 11 కిలోలు. ఏ కోణం నుంచి చూసినా ఒకేలా కనిపించేలా తీర్చిదిద్దడం దీని ప్రత్యేకత.
- మూడు వైపులా పొడుగ్గా ఉండే వెండి స్టంప్స్, బెయిల్స్ మీద బంతి (బంగారు గ్లోబ్) పొదిగి ఉన్నట్లు ఈ కప్పుంది. క్రికెట్లోని బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లను ఈ మూడు స్టంప్స్ సూచిస్తాయి.
- 1999 ప్రపంచకప్ ముందు నాలుగు రకాల ట్రోఫీలను మార్చారు. ఇంగ్లాండ్లో జరిగిన తొలి మూడు (1975, 1979, 1983) ప్రపంచకప్ల్లోనూ ఒకే రకమైన ట్రోఫీని అందించారు. స్పాన్సర్షిప్ కారణంగా ప్రుడెన్షియల్ కప్గా వ్యవహరించిన ఇది చూడ్డానికి వింబుల్డన్ పురుషుల ట్రోఫీలాగా ఉండేది.
- తొలిసారి ఇంగ్లాండ్ వెలుపల 1987లో ప్రపంచకప్ నిర్వహించారు. ఈ రిలయన్స్ ప్రపంచకప్కు భారత్, పాకిస్థాన్ ఉమ్మడిగా ఆతిథ్యమిచ్చాయి. అప్పుడు డైమండ్లు పొదిగి, బంగారు పూతతో ఉన్న కప్పును విజేత ఆస్ట్రేలియాకు అందజేశారు. అప్పుడే దీని విలువ దాదాపు రూ.6 లక్షలు.
- 1992 బెన్సన్ అండ్ హెడ్జెస్ ప్రపంచకప్ కోసం అందించిన ట్రోఫీ ఈ కప్పు చరిత్రలోనే అందమైందిగా పేరు తెచ్చుకుంది. వాటర్ఫోర్ట్ క్రిస్టల్ ట్రోఫీని విజేత పాకిస్థాన్ సొంతం చేసుకుంది. ఇక 1996లో భారత్, పాకిస్థాన్, శ్రీలంక కలిసి ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్ కోసం మరోసారి లోహంతో కూడిన కప్పునే తయారు చేశారు. ఇది ఎక్కువగా అలంకరించిన కప్పుగా నిలిచిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా నాలుగో టీ20.. స్టేడియంకు ‘కరెంట్’ కష్టాలు..!
IND vs AUS: భారత్-ఆసీస్ నాలుగో టీ20 మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వనున్న రాయ్పుర్ మైదానానికి కరెంట్ సమస్యలు నెలకొన్నాయి. ఇక్కడ కొన్నేళ్లుగా విద్యుత్ సరఫరా లేదట. దీంతో మ్యాచ్ నిర్వహణకు జనరేటర్లే ఆధారంగా మారాయి. -
Ravichandran Ashwin: నేనెప్పటికీ విరాట్ కోహ్లీ కాలేను: అశ్విన్
Ravichandran Ashwin: తాను ఎంత కష్టపడినా ఫిట్నెస్ విషయంలో విరాట్ కోహ్లీ (Virat ) స్థాయిని అందుకోలేనని అంటున్నాడు సీనియర్ స్పిన్నర్ అశ్విన్. ఓ క్రీడాఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు తన కెరీర్ గురించిన విషయాలను పంచుకున్నాడు. -
Irfan Pathan: ఉమ్రాన్ విషయంలో నా అంచనాలు తప్పాయి: ఇర్ఫాన్ పఠాన్
దక్షిణాఫ్రికా పిచ్లపై ఆడేందుకు భారత యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్కు అవకాశం ఇవ్వకపోవడంపై మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. -
Ravichandran Ashwin: ఆ రోజు కోహ్లి, రోహిత్ ఏడ్చారు
ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన తర్వాత విరాట్ కోహ్లి, రోహిత్శర్మ డ్రెస్సింగ్రూమ్లో ఏడ్చారని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు. -
Team India: బౌలర్లు పుంజుకునేనా!
పొట్టి సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉన్న భారత్ కీలక సమరానికి సిద్ధమైంది. శుక్రవారం జరిగే నాలుగో టీ20లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. తొలి రెండు టీ20ల్లో భారత్ నెగ్గగా.. మూడో మ్యాచ్లో నెగ్గడం ద్వారా సిరీస్ ఆశలను ఆసీస్ సజీవంగా ఉంచుకుంది. -
రోహిత్ పరిస్థితేంటి!
నిరుడు టీ20 ప్రపంచకప్ తర్వాతి నుంచి టీ20లకు దూరంగా ఉంటోన్న రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా పర్యటనలోనూ పరిమిత ఓవర్ల క్రికెట్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. -
India vs South Africa: దక్షిణాఫ్రికాకు ముగ్గురి సారథ్యంలో..
దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్ఇండియా సిద్ధం. అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మూడు ఫార్మాట్లకు జట్లను ప్రకటించింది. టీ20ల్లో సూర్యకుమార్, వన్డేల్లో కేఎల్ రాహుల్ భారత్కు నాయకత్వం వహించనున్నారు. -
టీ20 ప్రపంచకప్కు ఉగాండా
ఉగాండా..! క్రికెట్లో ఈ పేరు అసలు ఎప్పుడూ వినిపించదు. పెద్ద టోర్నీల్లో ఆ జట్టు ఎప్పుడూ ఆడలేదు. కానీ ఇప్పుడా జట్టు మెగా టోర్నీలో అదృష్టం పరీక్షించుకోనుంది. పెద్ద జట్లతో పోటీకి సై అంటోంది. -
భారత్కు 8 పతకాలు ఖాయం
ఐబీఏ ప్రపంచ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు అదిరే ప్రదర్శన చేశారు. ఆర్మేనియాలో జరుగుతున్న ఈ టోర్నీలో సెమీఫైనల్లో అడుగుపెట్టడం ద్వారా ఎనిమిది మంది పతకాలు ఖాయం చేసుకున్నారు. -
క్వార్టర్స్లో ప్రియాన్షు
సయ్యద్ మోదీ అంతర్జా తీయ బ్యాడ్మింటన్ టోర్నీలో ప్రియాన్షు రజావత్ క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టాడు. గురువారం పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ప్రియాన్షు 21-18, 11-6 (రిటైర్డ్)తో సతీశ్ కుమార్పై విజయం సాధించాడు. -
నజ్ముల్ అజేయ శతకం
కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (104 బ్యాటింగ్; 193 బంతుల్లో 10×4) అజేయ శతకంతో సత్తాచాటడంతో న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ పుంజుకుంది. -
స్టోక్స్ మోకాలికి శస్త్ర చికిత్స
ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మోకాలికి విజయవంతంగా శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో భారత్తో ఆరంభమయ్యే టెస్టు సిరీస్కు సిద్ధం కావాలనే పట్టుదలతో ఉన్న ఈ 32 ఏళ్ల ఆల్రౌండర్.. తాజాగా వన్డే ప్రపంచకప్లో బ్యాటర్గా మాత్రమే ఆడాడు. -
తెలంగాణకు రజతం
సీనియర్ జాతీయ ఆర్చరీ ఛాంపియన్షిప్లో తెలంగాణ జట్టు రజత పతకం సాధించింది. మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో తెలంగాణ ద్వితీయ స్థానంలో నిలిచింది.


తాజా వార్తలు (Latest News)
-
Dhootha web series review: నాగచైతన్య ఫస్ట్ వెబ్సిరీస్ ‘దూత’.. ఎలా ఉంది?
-
CM Kcr: ఎగ్జిట్ పోల్స్తో పరేషాన్ కావొద్దు.. మళ్లీ భారాసదే విజయం: సీఎం కేసీఆర్
-
Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. 20,250 ఎగువన రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ
-
Biden: పన్నూ హత్యకు కుట్ర..భారత్కు ఏకంగా సీఐఏ చీఫ్ను పంపిన బైడెన్!
-
కాంగ్రెస్కు అచ్చేదిన్.. ఇది కూటమి విజయం: ఎగ్జిట్ పోల్స్పై సంజయ్ రౌత్
-
KRMB: సాగర్ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి: ఏపీ ప్రభుత్వానికి కేఆర్ఎంబీ లేఖ