ODI WC 2023: ఈ కప్పుపైనే కళ్లన్నీ!
ప్రపంచంలోనే మేటి జట్లు తలపడేది ఈ కప్పు కోసమే! మైదానంలో యుద్ధానికి దిగేది ఈ కప్పును ముద్దాడటం కోసమే! ఒక్కసారైన విశ్వ విజేతగా నిలవాలనే లక్ష్యంతో కొన్ని..
క్రికెట్ ప్రపంచకప్మరో 14 రోజుల్లో
రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రదర్శనకు ఉంచిన ప్రపంచకప్ ట్రోఫీ
ఈనాడు - హైదరాబాద్ : ప్రపంచంలోనే మేటి జట్లు తలపడేది ఈ కప్పు కోసమే! మైదానంలో యుద్ధానికి దిగేది ఈ కప్పును ముద్దాడటం కోసమే! ఒక్కసారైన విశ్వ విజేతగా నిలవాలనే లక్ష్యంతో కొన్ని.. ట్రోఫీని మరోసారి దక్కించుకోవాలనే పట్టుదలతో మరికొన్ని.. ప్రపంచ క్రికెట్లో ఆధిపత్యాన్ని కొనసాగించాలనే సంకల్పంతో ఇంకొన్ని జట్లు.. ఇలా అందరి కళ్లు ఈ కప్పును సొంతం చేసుకోవడం మీదే! ఏ జట్టు చేతుల్లో ఒదిగిపోతుందోనని అభిమానులూ దృష్టి పెట్టేది ఈ కప్పు మీదే! మరో పక్షం రోజుల్లోపే ఈ కప్పు పోరు ప్రారంభం కానుంది. భారత్ వేదికగా వచ్చే నెల 5న వన్డే ప్రపంచకప్ ఆరంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో విజేతగా నిలిచే జట్టుకు అందించే కప్పు బుధవారం హైదరాబాద్కు చేరుకుంది. ప్రపంచకప్కు ముందు నిర్వహిస్తున్న ఈ ట్రోఫీ పర్యటనలో భాగంగా ప్రత్యేకంగా రామోజీ ఫిల్మ్సిటీలో ఈ కప్పును ప్రదర్శించారు.. గురువారం నగరంలోని చార్మినార్, ఉప్పల్ క్రికెట్ మైదానంలో దీన్ని ప్రదర్శించనున్నారు.
అలా మొదలైంది..
- ఇప్పుడున్న ట్రోఫీని 1999 ప్రపంచకప్ నుంచి విజేతలకు అందిస్తున్నారు. ఛాంపియన్ జట్టుకు మొదట ఈ ట్రోఫీని ప్రదానం చేసి.. అనంతరం దీని నమూనాను అందజేస్తారు. నిజమైన ట్రోఫీ కింది భాగంలో విజేత జట్ల పేర్లను రాస్తారు.
- ప్రస్తుత ట్రోఫీని లండన్లోని గరార్డ్ అండ్ కో అనే ఆభరణాల సంస్థ తయారుచేసింది. దీని తయారీలో బంగారం, వెండి వాడారు. ఇది 60 సెంటీమీటర్ల ఎత్తు ఉంటుంది. దీని బరువు 11 కిలోలు. ఏ కోణం నుంచి చూసినా ఒకేలా కనిపించేలా తీర్చిదిద్దడం దీని ప్రత్యేకత.
- మూడు వైపులా పొడుగ్గా ఉండే వెండి స్టంప్స్, బెయిల్స్ మీద బంతి (బంగారు గ్లోబ్) పొదిగి ఉన్నట్లు ఈ కప్పుంది. క్రికెట్లోని బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లను ఈ మూడు స్టంప్స్ సూచిస్తాయి.
- 1999 ప్రపంచకప్ ముందు నాలుగు రకాల ట్రోఫీలను మార్చారు. ఇంగ్లాండ్లో జరిగిన తొలి మూడు (1975, 1979, 1983) ప్రపంచకప్ల్లోనూ ఒకే రకమైన ట్రోఫీని అందించారు. స్పాన్సర్షిప్ కారణంగా ప్రుడెన్షియల్ కప్గా వ్యవహరించిన ఇది చూడ్డానికి వింబుల్డన్ పురుషుల ట్రోఫీలాగా ఉండేది.
- తొలిసారి ఇంగ్లాండ్ వెలుపల 1987లో ప్రపంచకప్ నిర్వహించారు. ఈ రిలయన్స్ ప్రపంచకప్కు భారత్, పాకిస్థాన్ ఉమ్మడిగా ఆతిథ్యమిచ్చాయి. అప్పుడు డైమండ్లు పొదిగి, బంగారు పూతతో ఉన్న కప్పును విజేత ఆస్ట్రేలియాకు అందజేశారు. అప్పుడే దీని విలువ దాదాపు రూ.6 లక్షలు.
- 1992 బెన్సన్ అండ్ హెడ్జెస్ ప్రపంచకప్ కోసం అందించిన ట్రోఫీ ఈ కప్పు చరిత్రలోనే అందమైందిగా పేరు తెచ్చుకుంది. వాటర్ఫోర్ట్ క్రిస్టల్ ట్రోఫీని విజేత పాకిస్థాన్ సొంతం చేసుకుంది. ఇక 1996లో భారత్, పాకిస్థాన్, శ్రీలంక కలిసి ఆతిథ్యమిచ్చిన ప్రపంచకప్ కోసం మరోసారి లోహంతో కూడిన కప్పునే తయారు చేశారు. ఇది ఎక్కువగా అలంకరించిన కప్పుగా నిలిచిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.