Kohli : ‘‘కోహ్లీ ఆ చీకటి ప్రదేశంలో ఉన్నాడు..’’
బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సరైన ఫామ్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ టీ20 సీజన్లో తన
వరుసగా రెండోసారి విరాట్ గోల్డెన్ డక్పై పీటర్సన్
ముంబయి : బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సరైన ఫామ్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ టీ20 సీజన్లో తన పేలవ ప్రదర్శనతో అటు అభిమానులను.. ఇటు జట్టు యాజమాన్యాన్ని పూర్తిగా నిరాశ పరుస్తున్నాడు. నిన్న హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగిన తీరు అతడి ఆటతీరుకు నిదర్శనం. ఈ సీజన్లో ఇలా వెనుదిరగడం ఇది వరుసగా రెండోసారి కావడం గమనార్హం. దీంతో విరాట్ బ్యాటింగ్పై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ కోహ్లీ ఫామ్పై స్పందించాడు. అతడు చీకటి ప్రదేశంలో ఉన్నాడంటూ వ్యాఖ్యానించాడు. ‘‘ప్రస్తుతం కోహ్లీ ఏ స్థితిలో ఉన్నాడో.. గతంలో నా కెరీర్లో రెండుసార్లు నేను కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాను. ఇది మంచిది కాదు. అతడు చీకటి ప్రదేశంలో ఉన్నాడు. ముఖ్యంగా.. అందరి దృష్టి అతడిపైనే ఉన్నప్పుడు.. అది పూర్తిగా ఒంటరి ప్రదేశం. ఇది త్వరగా ముగుస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆట కోసం అతడు పరుగులు సాధించాల్సి ఉంది’’ అని పీటర్సన్ పేర్కొన్నాడు.
ఇక భారత మాజీ సారథి సునిల్ గావస్కర్ కూడా కోహ్లీ ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘ఎవరైనా కొన్ని బంతులు కూడా ఎదుర్కోకుండా ఔట్ అయితే వారి బ్యాటింగ్ గురించి చెప్పడం కష్టం. కనీసం డజన్ బంతులైనా ఆడితే.. ఫుట్వర్క్ ఎలా ఉంది.. లైన్లోనే ఆడుతున్నాడా.. ఈ సాంకేతికతో ఆడితే బాగుంటుంది.. అని చెప్పొచ్చు’ అని గావస్కర్ వివరించాడు.
నిన్న హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో జన్సన్ బౌలింగ్లో సెకండ్ స్లిప్లో చిక్కి కోహ్లీ వెనుదిరిగాడు. అంతకుముందు మ్యాచ్లో కూడా ఇలాగే పరుగులేమీ చేయకుండా ఔటైన విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్లో 8 మ్యాచ్లు ఆడిన కోహ్లీ.. కేవలం 119 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఏడాదే టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో విరాట్ ఆటతీరుపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భళి భళిరా బెంగళూరు
ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. -
నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: కోహ్లి
తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. తన ప్రదర్శనే ప్రామాణికమని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా.. అతడి స్ట్రైక్రేట్పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించాడు. -
రోహిత్ దారెటు?
ముంబయి ఇండియన్స్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా! వచ్చే సీజన్కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్ బౌచర్ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది. -
25న న్యూయార్క్కు భారత క్రికెటర్లు
సహాయ సిబ్బందితో పాటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ కోసం ఈ నెల 25న న్యూయార్క్ బయల్దేరనున్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ (మే 26) తర్వాత వెళ్తారు. -
నా బ్యాటింగ్ అంత గొప్పగా లేదు: రోహిత్
ప్రస్తుత ఐపీఎల్లో తన బ్యాటింగ్ ఆశించిన ప్రమాణాల మేర లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. -
రెండో స్థానంలో అర్జున్
తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం నాలుగో రౌండ్లో మాన్యుయెల్ పెట్రోసియన్ (ఆర్మేనియా)పై అతడు నెగ్గాడు. -
సిఫ్త్కౌర్, నీరజ్ గెలుపు
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్-4లో సిఫ్త్కౌర్, నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీపొజిషన్స్ తుది పోరులో సిఫ్త్ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. -
పర్వీన్ స్థానంలో జైస్మిన్
బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య ఆరంభించింది. -
తుదిపోరుకు సాత్విక్ ద్వయం
థాయ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీ అదిరే ప్రదర్శన చేస్తోంది. దూకుడైన ఆటతో ఈ భారత జంట ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ ద్వయం 21-11, 21-12తో లూ మింగ్-తాంగ్ కైయ్ వీయ్ (చైనీస్ తైపీ) జోడీని చిత్తు చేసింది. -
నిఖత్ పసిడి పంచ్
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణా అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్ను కొనసాగిస్తూ స్వర్ణం కైవసం చేసుకుంది. శనివారం 52 కేజీల తుదిపోరులో ఆమె 5-0తో ఉర్క్బయెవా (కజకిస్థాన్)ను చిత్తు చేసింది. -
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. 218 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన చెన్నై 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితం అయింది.