IPL 2024 Auction: వేలంలో పంజాబ్ కింగ్స్ పొరపాటు.. అన్క్యాప్డ్ ప్లేయర్కు ఛాన్స్!
ఐపీఎల్ వేలం (IPL 2024 Auction) ద్వారా చాలా మంది యువ ఆటగాళ్లకు మెగా టోర్నీలో పాల్గొనే అవకాశం దక్కింది. అయితే, ఓ ప్లేయర్కు మాత్రం అనుకోకుండా అదృష్టం వరించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ వేలంలో (IPL 2024) కొందరికి కాసుల వర్షం కురిసింది. మరికొందరికేమో అనుకున్నంత రాలేదు. కానీ, ఓ ఆటగాడు మాత్రం అనూహ్యంగా బిడ్ను దక్కించుకోవడం విశేషం. పంజాబ్ కింగ్స్ (Punjab Kings) చేసిన పొరపాటుకు అతడికి వరంగా మారిపోయింది. ఇంతకీ అసలేం జరిగింది? ఆ ఆటగాడు ఎవరంటే?
వేలం చివరి దశకు చేరుకున్న వేళ.. అన్క్యాప్డ్ ప్లేయర్ల బిడ్డింగ్ వేగంగా సాగింది. ఈ క్రమంలో శశాంక్ సింగ్ అనే ఆటగాడి పేరును రూ. 20 లక్షల కనీస ధరతో ఆక్షనీర్ మల్లికా సాగర్ ప్రారంభించారు. వెంటనే పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింతా బిడ్డింగ్ వేసినట్లు సిగ్నల్ ఇచ్చారు. ఆ తర్వాత సహచరులతో ప్రీతి జింతా మాట్లాడుతూ ఉండగానే శశాంక్ను పంజాబ్ రూ. 20 లక్షలకు దక్కించుకున్నట్లు ఆక్షనీర్ ప్రకటించారు. పంజాబ్ మినహా.. ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో వేలం ముగిసినట్లు ఆక్షనీర్ తెలిపారు. ఆ వెంటనే వేరే ఆటగాడి వేలానికి వెళ్లిపోయారు. ఈ సమయంలోనే పంజాబ్ కింగ్స్ తాము చేసిన పొరపాటును గ్రహించింది.
అంగీకరించని ఆక్షనీర్..
మరో ప్లేయర్ అనుకుని శశాంక్ను తీసుకున్నట్లు గ్రహించిన పంజాబ్ కింగ్స్ ప్రతినిధులు వెంటనే ఆక్షనీర్ దృష్టికి తీసుకెళ్లారు. నెస్వాడియా, ప్రీతి జింతా కాస్త అసహనం వ్యక్తం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సందర్భంగా వారు ఆక్షనీర్ మల్లికాసాగర్ దృష్టికి తీసుకెళ్లారు.
‘‘ఇది సరైన పేరు కాదా? మీరు ఆ ప్లేయర్ను వద్దనుకుంటున్నారా?’’ అని మల్లికా సాగర్ ప్రశ్నించారు. దానికి సమాధానంగా ‘మేం కోరుకోలేదు’ అని పంజాబ్ పేర్కొంది.
‘‘మేం మాట్లాడుతోంది శశాంక్ సింగ్ గురించి. కానీ, మీరు వద్దని చెప్పేసరికి బిడ్డింగ్ ముగిసింది. కాబట్టి, వరుస క్రమంలోని 236, 237 నంబర్ల ఆటగాళ్లు ఇద్దరూ మీకే’’ అని మల్లికా ప్రతిస్పందించారు. తొలుత వద్దనుకున్న ఆటగాడిని పంజాబ్ కింగ్స్.. చివరికి తమ జట్టులోకి తీసుకోవాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరిన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి కుమారుడు
-
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!