Hyderabad Vs Punjab: ఒత్తిడిలోనూ ఏమాత్రం తొణక్కుండా.. మనోడు అదుర్స్
పంజాబ్ కింగ్స్తో పోరులో నెమ్మదిగా ఉన్న ముల్లాన్పుర్ పిచ్పై బంతి బ్యాట్ మీదకు రావట్లేదు. 64కే 4 కీలక వికెట్లు పడిపోయాయి.
ముల్లాన్పుర్: పంజాబ్ కింగ్స్తో పోరులో నెమ్మదిగా ఉన్న ముల్లాన్పుర్ పిచ్పై బంతి బ్యాట్ మీదకు రావట్లేదు. 64కే 4 కీలక వికెట్లు పడిపోయాయి. ఈ స్థితిలో అదిరే ఇన్నింగ్స్తో సన్రైజర్స్ హైదరాబాద్ను నిలబెట్టాడు కాకి నితీశ్ కుమార్రెడ్డి. ఒత్తిడిలోనూ ఏమాత్రం తొణక్కుండా ఎదురుదాడి చేసి ప్రత్యర్థి బౌలర్లను చెదరగొట్టాడీ 20 ఏళ్ల ఈ ఆంధ్ర ఆల్రౌండర్. దేశవాళీ క్రికెట్లోనూ పెద్దగా అనుభవం లేని ఈ విశాఖపట్నం కుర్రాడు.. రబాడ, సామ్ కరన్ లాంటి అంతర్జాతీయ పేసర్లను దీటుగా ఎదుర్కొన్న తీరును మెచ్చుకోవాల్సిందే. ముఖ్యంగా రబాడ బౌలింగ్లో హుక్ షాట్తో కొట్టిన సిక్సర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అతడి మెరుపులతోనే సన్రైజర్స్ భారీ స్కోరు చేసింది.
ఐపీఎల్-17లో రెండో మ్యాచ్ మాత్రమే ఆడుతున్న నితీశ్ను 2023లో రూ.20 లక్షల కనీస ధరతో సన్రైజర్స్ సొంతం చేసుకుంది. తొలి సీజన్లో అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు. రెండే మ్యాచ్లు ఆడాడు. ఈ సీజన్లో అతడిని ఫినిషర్గా ఉపయోగించుకోవాలని ఎస్ఆర్హెచ్ భావించింది. దానికి తగ్గట్టుగానే చెన్నైతో మ్యాచ్లో లోయర్ మిడిలార్డర్లో బరిలోకి దింపింది. ఈ మ్యాచ్లో ఛేదనలో 8 బంతుల్లో 14 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కానీ పంజాబ్పై కాస్త ముందుగా బ్యాటింగ్కు వచ్చి అర్ధసెంచరీతో అదరగొట్టాడు. ఇప్పటిదాకా 17 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన నితీశ్.. 29.96 సగటుతో 566 పరుగులు చేశాడు. బౌలింగ్లో 52 వికెట్లు పడగొట్టాడు. 2020లో కేరళపై రంజీ అరంగేట్రం చేసిన నితీశ్.. ఛేదనలో లోయర్ఆర్డర్లో దిగి 39 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!