Shubman Gill: కొత్త కింగ్ గిల్
జోరుమీదున్న భారత యువ సంచలనం శుభ్మన్ గిల్ మరో అరుదైన ఘనత అందుకున్నాడు.
బౌలర్లలో సిరాజ్ మేటి
వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి
దుబాయ్: జోరుమీదున్న భారత యువ సంచలనం శుభ్మన్ గిల్ మరో అరుదైన ఘనత అందుకున్నాడు. వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ జాబితాలో బాబర్ అజామ్ (824- పాకిస్థాన్)ను వెనక్కి నెట్టిన గిల్ 830 పాయింట్లతో నంబర్వన్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. సచిన్ తెందుల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లి తర్వాత ఈ ఘనత సాధించిన భారత బ్యాటర్గా రికార్డు సృష్టించాడు. ప్రస్తుత ర్యాంకింగ్స్లో కోహ్లి (770), రోహిత్ (739) వరుసగా 4, 6 స్థానాల్లో నిలిచారు. బౌలింగ్ ర్యాంకింగ్స్లో సిరాజ్ (709) నంబర్వన్ స్థానాన్ని తిరిగి సొంతం చేసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ (661), బుమ్రా (654), మహ్మద్ షమి (635) వరుసగా 4, 8, 10 ర్యాంకుల్లో నిలిచారు. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో షకిబుల్ హసన్ (బంగ్లాదేశ్) నంబర్వన్గా కొనసాగుతున్నాడు. రవీంద్ర జడేజా పదో స్థానంలో ఉన్నాడు. టీమ్ ర్యాంకింగ్స్లో టెస్టు, వన్డే, టీ20ల్లో భారత్ నం.1 జట్టుగా కొనసాగుతోంది.
నయా సంచలనం
దిగ్గజం సచిన్ రికార్డులను తిరగరాస్తూ కోహ్లి దూసుకెళ్తున్నాడు. కానీ 35 ఏళ్ల కోహ్లి తర్వాత భారత క్రికెట్లో ఎవరు? అనే ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు శుభ్మన్ గిల్ నిలుస్తున్నాడు. అంచనాలను అందుకుంటూ, నిలకడైన ఆటతీరుతో సాగిపోతున్నాడు. ముఖ్యంగా వన్డేల్లో అదరగొడుతున్నాడు. అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో ఈ ర్యాంకు సాధించిన భారత బ్యాటర్లలో ధోని (31 ఇన్నింగ్స్) తర్వాత అతని (41 ఇన్నింగ్స్)ది రెండో స్థానం. 2019 జనవరిలోనే వన్డేల్లో అరంగేట్రం చేసినా అతను 2020 డిసెంబర్ వరకు మూడు మ్యాచ్ల్లోనే ఆడగలిగాడు. జట్టులో పోటీనే అందుకు కారణం. కానీ తిరిగి నిరుడు జులైలో జట్టులోకి వచ్చిన శుభ్మన్ తగ్గేదేలేదంటూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఆరు సెంచరీలు బాదాడు. ఈ ఏడాది జనవరిలో ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాండ్పై ద్విశతకం కూడా అందుకున్నాడు. ఇప్పుడు ప్రపంచకప్లోనూ జోరు కొనసాగిస్తున్నాడు. డెంగీ జ్వరం కారణంగా తొలి రెండు మ్యాచ్లకు దూరమయ్యాడు. తిరిగొచ్చి రెండు అర్ధశతకాలు (బంగ్లాపై 53, శ్రీలంకపై 92) చేశాడు. ఓవరాల్గా ఇప్పటివరకూ 41 మ్యాచ్ల్లో 61.02 సగటుతో అతను 2136 పరుగులు సాధించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
తక్కువ స్ట్రైక్ రేట్ విషయంలో విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలను కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. -
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం