ICC Rankings: విరాట్ కోహ్లీ సేమ్ ప్లేస్.. నంబర్వన్లోకి బాబర్ అజామ్
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ప్రపంచకప్లో మూడు అర్ధశతకాలు సాధించిన...
ఇంటర్నెట్ డెస్క్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 ర్యాంకింగ్స్ను విడుదల చేసింది. ప్రపంచకప్లో మూడు అర్ధశతకాలు సాధించిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో టాప్లోకి దూసుకెళ్లాడు. 834 రేటింగ్తో తొలి స్థానం ఆక్రమించాడు. 2018లో తొలిసారి మొదటి స్థానం సాధించిన బాబర్.. ఇప్పుడు మళ్లీ అదే ప్లేస్లోకి రావడం విశేషం. ప్రస్తుతం వన్డేల్లోనూ బాబర్ అజామ్దే ఫస్ట్ ర్యాంక్. టీ20ల్లో రెండో స్థానం డేవిడ్ మలన్ (798), మూడులో ఆరోన్ ఫించ్ (733), నాలుగైదు స్థానాల్లో మహమ్మద్ రిజ్వాన్ (731), విరాట్ కోహ్లీ (714) నిలిచారు. టాప్-10లో భారత్ నుంచి టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ (5వ స్థానం), కేఎల్ రాహుల్ (8వ స్థానం) సంపాదించారు. గతవారం విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్లోనూ వీరిద్దరివి ఇవే ర్యాంకులు. మరోవైపు శ్రీలంకపై అద్భుత శతకం బాదిన జోస్ బట్లర్ (670) ఎనిమిది ర్యాంకులను మెరుగుపరుచుకుని టాప్-10లోకి వచ్చేశాడు. ప్రస్తుతం తొమ్మిదో ర్యాంకులో కొనసాగుతున్నాడు. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా ఆరు నుంచి మూడో స్థానానికి ఎగబాకాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు మారక్రమ్ మూడు స్థానాలు దిగజారి ఆరో స్థానంలోకి చేరాడు. కోహ్లీ, కేఎల్ రాహుల్ ఇదే ఫామ్ను కొనసాగిస్తే మాత్రం టాప్-10 జాబితా నుంచి దిగజారే ప్రమాదముంది.
ఇక టీ20 బౌలర్ల జాబితాలో లంక ఆల్రౌండర్ వహిందు హసరంగ (776 రేటింగ్) మొదటి స్థానం సాధించాడు. గతవారం వరకు నంబర్వన్గా ఉన్న సౌతాఫ్రికా స్పిన్నర్ తాబ్రైజ్ షంసి (770) రెండో స్థానానికి పడిపోయాడు. అదిల్ రషీద్ (730) మూడో స్థానం, రషీద్ ఖాన్ (723)నాలుగు, ముజీబ్ (703) ఐదో స్థానంలో నిలిచారు. తొలి ఐదు స్థానాలు సాధించిన బౌలర్లందరూ స్పిన్నర్లే కావడం విశేషం. కివీస్ బౌలర్ ఆన్రిచ్ నార్జే ఏకంగా పద్దెనిమిది స్థానాలను మెరుగుపరుచుకుని ఏడో ప్లేస్లోకి దూసుకువవచ్చాడు. క్రిస్ జొర్డాన్(తొమ్మిదో స్థానం), ఐష్ సోధీ (పదోవ స్థానం) టాప్-10లోకి వచ్చారు. ఆల్రౌండర్ల జాబితాలో నబీ (271 రేటింగ్), షకిబ్ (271) ఒకే రేటింగ్ సాధించారు. స్వల్ప తేడాతో షకిబ్కే తొలి స్థానం దక్కింది. రెండులో నబీ, మూడులో స్మిత్ (175), నాలుగులో వహిందు హసరంగ (172), జీషన్ (160) ఐదో స్థానంలో నిలిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
T20 jersey: టీ20 ప్రపంచకప్ టోర్నీకి టీమ్ఇండియా జెర్సీల ధరను అడిడాస్ ప్రకటించింది. -
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్య జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. పాక్లో టీమ్ఇండియా పర్యటిస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
టీమ్ఇండియా బ్యాటర్ శివమ్ దూబె (Shivam Dube)పై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చే టీ20 ప్రపంచకప్లో పవర్ఫుల్ హిట్టింగ్తో అలరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు