మహీ ఆడితే డబ్బు సమకూరుస్తా!
టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ వచ్చే ఏడాది జరిగే ‘100 బంతులు’ టోర్నీ ఆడతానంటే ఎక్కడో ఓ చోట డబ్బు సమకూరుస్తానని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్వార్న్ అన్నాడు. అతడో అద్భుతమైన క్రికెటర్, కెప్టెన్ అని ప్రశంసించాడు. అత్యుత్తమ నాయకులు ఉండే జట్లే మ్యాచులు గెలుస్తాయని...
‘వంద బంతుల’ కోసం షేన్వార్న్ ప్రతిపాదన
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ వచ్చే ఏడాది జరిగే ‘100 బంతులు’ టోర్నీ ఆడతానంటే ఎక్కడో ఓ చోట డబ్బు సమకూరుస్తానని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్వార్న్ అన్నాడు. అతడో అద్భుతమైన క్రికెటర్, కెప్టెన్ అని ప్రశంసించాడు. అత్యుత్తమ నాయకులు ఉండే జట్లే మ్యాచులు గెలుస్తాయని వెల్లడించాడు.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ సెమీస్లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన తర్వాత మహీ మైదానంలో కనిపించలేదు. అతడి వీడ్కోలుపై అనేక ఊహాగానాలు వచ్చాయి. ఐపీఎల్-2020లో రాణిస్తే ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్కు పోటీలో ఉంటాడని అంతా భావించారు. కరోనా వైరస్ ముప్పుతో రెండు టోర్నీలూ వాయిదా పడటంతో కొన్నాళ్లు సందడి కనిపించలేదు. సెప్టెంబర్ 19న యూఏఈ వేదికగా ఐపీఎల్ మళ్లీ జరుగుతుందని ప్రకటించగానే అందరి దృష్టి అతడిపై నెలకొంది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆగస్టు 15 సాయంత్రం ధోనీ వీడ్కోలు ప్రకటించేశాడు.
‘వచ్చే ఏడాది జరిగే ‘ది హండ్రెడ్’లో లండన్ స్పిరిట్కు మహీని తీసుకొస్తే అద్భుతమే. లార్డ్స్లో ఆడేందుకు ఆసక్తిగా ఉన్నాడో లేదో ఒకసారి మాట్లాడతాను. ఒకవేళ అంగీకరిస్తే ఎక్కడో ఓ చోట డబ్బు సమకూరుస్తా’ అని ఇంగ్లాండ్-పాక్ మ్యాచుకు కామెంటరీ చేస్తూ షేన్వార్న్ వ్యాఖ్యానించాడు. టీ20కి పోటీగా ఇంగ్లాండ్ వంద బంతుల టోర్నీని తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదే టోర్నీ ఆరంభం కావాల్సి ఉండగా కరోనా వైరస్ ముప్పుతో 2021కి వాయిదా వేశారు. ఒకవేళ ఇష్టపడితే ఐపీఎల్ ఆడుతున్న మహీకి బీసీసీఐ అనుమతి ఇస్తుందో లేదో చూడాల్సి ఉంది.
‘టీ20ల్లో అత్యుత్తమ నాయకులు ఉన్న జట్లు సాధారణంగా ఫైనల్కు వస్తుంటాయి. పొట్టి క్రికెట్లో ఇదే కీలకం. చెన్నై సూపర్కింగ్స్ మూడుసార్లు ఐపీఎల్ గెలిచిన సంగతి తెలిసిందే. మహీ అద్భుతమైన క్రికెటర్. అతడే ముందుండి కొన్ని మ్యాచులు గెలిపించాడు. నాయకత్వం పరంగా తిరుగులేదు. ప్రత్యర్థి జట్లకు గట్టిపోటీనిస్తాడు. చరిత్రలో గొప్ప వికెట్కీపర్ బ్యాట్స్మన్గా నిలిచిపోతాడు. అతడెంతో ప్రశాంతంగా ఉంటాడు. ఆడేది టీమ్ఇండియా లేదా చెన్నై అయినా జట్టు అత్యుత్తమ ఆటతీరును బయటకి తీసుకొస్తాడు. అందుకే తన జట్టు ఆటగాళ్లందరూ ఎంఎస్డీని గౌరవిస్తారు’ అని వార్న్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!