Rohit Sharma: హిట్మ్యాన్ ఫిట్గా ఉంటే.. టెస్టు పగ్గాలు ఎందుకు అప్పగించకూడదు?: రవిశాస్త్రి
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ ఫిట్గా ఉంటే.. పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అతడికే ఎందుకు అప్పగించకూడదని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. గతేడాది డిసెంబరులో రోహిత్కి టెస్టు...
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు రోహిత్ శర్మ ఫిట్గా ఉంటే.. పూర్తి స్థాయి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు కూడా అతడికే ఎందుకు అప్పగించకూడదని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. గతేడాది డిసెంబరులో రోహిత్కి టెస్టు ఫార్మాట్ వైస్ కెప్టెన్గా బాధ్యతలు అప్పగించారు. అయితే, గాయం కారణంగా అతడు దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం.. విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ బాధ్యతలను వదిలేస్తున్నట్లు ప్రకటించాడు.
‘రోహిత్ శర్మ ఫిట్గా ఉంటే.. టెస్టు ఫార్మాట్కు కూడా అతడినే ఎందుకు పూర్తి స్థాయి కెప్టెన్గా నియమించకూడదు.? ఇప్పటికే వైస్ కెప్టెన్గా ఉన్న అతడిని.. కెప్టెన్గా ఎందుకు ప్రమోట్ చేయకూడదు. రిషభ్ పంత్ కూడా అద్భుతమైన ఆటగాడు. ఒక కోచ్గా అతడి ఆట తీరు పట్ల గర్వపడుతున్నాను. ఆట పట్ల అతడి దృక్పథం చాలా గొప్పగా ఉంటుంది. చాలా మంది అతడు నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకుంటాడని చెబుతుంటారు. అందులో వాస్తవం లేదు. అతడు ఆటను బాగా అర్థం చేసుకుంటాడు. జట్టు విజయం కోసం శాయశక్తులా కష్టపడతాడు. అందుకే కెప్టెన్సీ గురించి చర్చ జరిగినప్పుడు అతడిని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి’ అని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
* రోహిత్కే తొలి ప్రాధాన్యం : షేన్ వార్న్
భారత జట్టు టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే విషయంలో తొలి ప్రాధాన్యం రోహిత్ శర్మకే ఇవ్వాలని ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అన్నాడు. ‘టీమ్ఇండియా టెస్టు కెప్టెన్సీకి ముగింపు పలుకుతూ విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం పట్ల నేనేమీ ఆశ్చర్యపోలేదు. భారత జట్టుకు సారథ్యం వహించడమనేది మామూలు విషయం కాదు. టీమ్ఇండియా కెప్టెన్పై ఎప్పుడూ భారీ అంచనాలు, ఒత్తిళ్లు ఉంటాయి. అయినా కోహ్లీ తన నాయకత్వ పటిమతో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. ఇప్పటికీ అతడిలో చాలా క్రికెట్ మిగిలి ఉంది. మరోవైపు పరిమిత ఓవర్ల క్రికెట్లో గొప్ప రికార్డున్న రోహిత్ శర్మకే.. టెస్టు కెప్టెన్సీ విషయంలో తొలి ప్రాధాన్యం ఇస్తే బాగుంటుంది. యువ ఆటగాడు కేఎల్ రాహుల్కి బాధ్యతలు అప్పగించినా ఫర్వాలేదు. అజింక్య రహానె ఇంకా మెరుగ్గా జట్టుని నడిపించగలడు. కానీ, ప్రస్తుతం అతడు ఫామ్లేమితో సతమతమవుతున్నాడు. ఒకవేళ అతడు మునుపటి ఫామ్ను అందుకుంటే.. నిస్సందేహంగా అతడికి టెస్టు కెప్టెన్సీ అప్పగించవచ్చు’ అని షేన్ వార్న్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..