Team India: బుమ్రా లేకపోతే.. మిగతా బౌలర్లు బాధ్యత తీసుకోవాలి!
టీ20 ఫార్మాట్లో డెత్ ఓవర్లు చాలా కీలకమని టీమ్ఇండియా మాజీ సెలెక్టర్ సబా కరీం వ్యాఖ్యానించాడు. ఆరంభ ఓవర్లలో బాగానే వేస్తున్నప్పటికీ.. చివర్లో భారత బౌలర్లు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం ఆషామాషీ వ్యవహారం కాదని.. అయితే బుమ్రా లేని లోటును మిగతా బౌలర్లు పూడ్చాలని టీమ్ఇండియా మాజీ సెలెక్టర్ సబా కరీం సూచించాడు. వెన్నునొప్పి కారణంగా దక్షిణాఫ్రికాతో సిరీస్కు దూరమైన బుమ్రా.. వచ్చే నెల ఆసీస్ వేదికగా ప్రారంభమయ్యే టీ20 ప్రపంచకప్నకూ దూరమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో బుమ్రాకి బదులు దక్షిణాఫ్రికాతో మిగతా టీ20లకు హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ను బీసీసీఐ ఎంపిక చేసింది. బుమ్రా గైర్హాజరీతో డెత్ బౌలింగ్ బలహీనంగా ఉంటుందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. ఈ క్రమంలో మాజీ సెలెక్టర్ సబా కరీం కీలక సూచనలు చేశాడు. మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, భువనేశ్వర్ వంటి బౌలర్లు భారత్కు ఉన్నారని, అయితే మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.
‘‘కొత్త బంతితో బౌలింగ్ చేసేందుకు భారత్ వద్ద చాలా ఆప్షన్లు ఉన్నాయి. ఇప్పటికే భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా వేస్తున్నాడని తెలుసు. తాజాగా అర్ష్దీప్ సింగ్ కూడా నిరూపించుకొన్నాడు. అలాగే షమీ కూడా సీనియర్ పేసర్. అయితే టీమ్ఇండియాకు సమస్య డెత్ ఓవర్లు. తీవ్ర ఒత్తిడి సమయంలోనూ బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న బౌలర్లను గుర్తించాలి. ఒకవేళ బుమ్రా దూరమైతే ఇతర బౌలర్లు బాధ్యత వహించి అత్యుత్తమంగా రాణించాలి. అయితే అంత సులువైన వ్యవహారం మాత్రం కాదు’’ అని సబా కరీం వెల్లడించాడు.
డెత్ ఓవర్లలో భువీ వద్దు: డానిష్ కనేరియా
పవర్ప్లేలో అద్భుతంగా బౌలింగ్ వేసే భారత సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ చివరి ఓవర్లలో మాత్రం తేలిపోతున్నాడు. ఈ క్రమంలో పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా భువీకి డెత్ ఓవర్లలో బౌలింగ్ ఇవ్వొద్దని పేర్కొన్నాడు. ‘ఆసీస్ పిచ్లపై స్వింగ్ కష్టం. హార్డ్ ట్రాక్స్ మీదనే మ్యాచ్లను ఆడాల్సి ఉంటుంది. అందుకే భువనేశ్వర్ కుమార్ డెత్ ఓవర్లలో సరైన ఎంపిక కాదు’’ అని కనేరియా తెలిపాడు. గత ఆసియా కప్ నుంచి మొన్న ఆసీస్తో సిరీస్ వరకు భువనేశ్వర్ కుమార్ డెత్ ఓవర్లలో భారీగా పరుగులు సమర్పించుకొని విమర్శలపాలైన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!