IND vs ENG: ‘బెస్ట్ ఫీల్డర్’ మెడల్.. మిరుమిట్లు గొలిపేలా ప్రకటించిన కోచ్
ఇంగ్లాండ్ను కట్టడి చేయడంలో భారత (IND vs ENG) బౌలర్ల శ్రమ ఎంత ఉందో.. ఫీల్డర్లూ అదేస్థాయిలో కష్టపడ్డారు. సింగిల్స్ తీసే అవకాశం కూడా ఇవ్వకుండా కట్టుదిట్టమైన ఫీల్డింగ్తో అదరగొట్టారు.
ఇంటర్నెట్ డెస్క్: డ్రెస్సింగ్ రూమ్ను మరింత ఉత్సాహంగా మారుస్తూ.. మైదానంలో అత్యుత్తమ ఫీల్డింగ్ను ప్రదర్శించే ఆటగాళ్లకు పతకాలను భారత మేనేజ్మెంట్ (Team India) ఇస్తోంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ, శార్దూల్, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఈ పతకాలను సాధించారు. తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లోనూ కేఎల్కే దక్కింది. ఈ సందర్భంగా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం గణాంకాలను చూసి మాత్రమే కాదు.. మైదానంలో వ్యవహరించిన తీరును కూడా పరిగణనలోకి తీసుకుని ‘బెస్ట్ ఫీల్డర్’ ఎవరనేది ప్రకటిస్తున్నట్లు కోచ్ దిలీప్ వెల్లడించారు. ఇంగ్లాండ్తో మ్యాచ్లో ముగ్గురి మధ్య తీవ్ర పోటీ ఎదురైందని.. చివరికి ఒకరిని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, మహమ్మద్ సిరాజ్ తీవ్రంగా పోటీ పడ్డారని.. రాహుల్ ‘బెస్ట్ ఫీల్డర్’ పతకాన్ని దక్కించుకున్నట్లు దిలీప్ తెలిపారు. ఈ సారి ఎల్ఈడీ లైట్లతో విజేత పేరును ప్రకటించడం విశేషం.
‘‘ఈ మెడల్ అనేది కేవలం గణాంకాల గురించి కాదు. అలాగే ఒక మంచి క్యాచ్ పట్టడమో.. కొన్ని పరుగులను కాపాడటమో చేస్తేనే సరిపోదు. మైదానంలో ఎవరు అలాంటి స్ఫూర్తిని తీసుకువచ్చారనేది కీలకం. మ్యాచ్లో వారు చేసే బాధ్యత ఎంతమేర ప్రభావం చూపిందనేది కూడా ముఖ్యమే. అలాంటివన్నీ లెక్కలోకి వస్తాయి. వారే విజేతలుగా నిలుస్తారు. అలాంటి వారిలో ఇంగ్లాండ్తో మ్యాచ్లో కేఎల్ రాహుల్ మంచి కంట్రిబ్యూషన్ ఇచ్చాడు. అతడే ఈసారి బెస్ట్ ఫీల్డర్ విన్నర్. బౌండరీ లైన్ వద్ద కొన్నింటిని వదిలేసినప్పటికీ సిరాజ్ కూడా శ్రమించిన తీరు బాగుంది. ఇషాన్ కిషన్ కూడా మైదానంలో చురుగ్గా ఉన్నాడు’’ అని దిలీప్ వెల్లడించారు. దీంతో మెగా టోర్నీలో రెండోసారి ఈ మెడల్ కేఎల్ రాహుల్ సొంతమైంది. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లోనూ బెస్ట్ ఫీల్డర్గా ఎంపికయ్యాడు. ఇక ఇంగ్లాండ్తో మ్యాచ్లో ఒకే ఒక్క క్యాచ్ మాత్రమే వచ్చింది. దానిని కేఎల్ రాహుల్ అందుకున్నాడు. సబ్స్టిట్యూట్గా వచ్చిన ఇషాన్ కూడా మెరుపు ఫీల్డింగ్తో ఆకట్టుకున్నాడు. తేమ ప్రభావంతో బంతి బౌలర్ చేజారకుండా ఉండేందుకు విరాట్, జడేజాతో సహా ప్రతి ఫీల్డర్ ఎంతో కృషి చేశారని దిలీప్ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓడితే ‘నాకౌట్’ కష్టాలు తప్పవు.. ‘ఉప్పల్’లో వరుణుడు ఏం చేసేనో?
హైదరాబాద్ అభిమానులను అలరించేందుకు ఐపీఎల్ మ్యాచ్ వచ్చేస్తోంది. లఖ్నవూతో ఉప్పల్ వేదికగా మ్యాచ్ జరగనుంది. -
ఈ నిర్ణయం థర్డ్ అంపైర్కూ కష్టమే.. సంజూ ఔట్తోనే ఓడిపోయాం: సంగక్కర
సంజూ శాంసన్ ఇచ్చిన క్యాచ్ను దిల్లీ ఫీల్డర్ షై హోప్ అద్భుతంగా పట్టాడు. కానీ, బౌండరీ లైన్కు అతడి పాదం తాకిందనే ఆరోపణలు వచ్చాయి. థర్డ్ అంపైర్ మాత్రం ఔట్గా ఇవ్వడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. -
అందుకే వేగంగా బంతులేస్తా.. ఫెరీరాను తొలి బంతికే ఔట్ చేయడంపై కుల్దీప్
దిల్లీ మళ్లీ విజయం సాధించి ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. రాజస్థాన్ను ఓడించడంలో ఆ జట్టు బౌలర్ కుల్దీప్ కీలక పాత్ర పోషించాడు. -
సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. ఫీల్డర్ రెండుసార్లు రోప్ను తాకాడన్న సిద్ధూ!
క్యాచ్ల విషయంలో రిప్లేలో స్పష్టంగా కనిపిస్తున్నా.. నిర్ణయాలు తీసుకోవడంలో మాత్రం అంపైర్లు పొరపాటు చేయడం సరైంది కాదనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. -
క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
ఔట్పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అంపైర్తో వాగ్వాదం చేసిన సంజూ శాంసన్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ చర్యలు తీసుకుంది. ఇలా ప్రవర్తించడం సరైంది కాదంటూ భారీ జరిమానా విధించింది. -
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత్లోకి గూగుల్ వ్యాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
-
పల్నాడు జిల్లాలో వైకాపా దౌర్జన్యం.. తెదేపా కార్యకర్తలపై రాళ్ల దాడి
-
ఓటీటీలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
రైతులెవరూ అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం: మంత్రి తుమ్మల
-
ఓడితే ‘నాకౌట్’ కష్టాలు తప్పవు.. ‘ఉప్పల్’లో వరుణుడు ఏం చేసేనో?
-
‘ఆ 20 నిమిషాలు నా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు’: పూంఛ్ ఉగ్రదాడిపై ప్రత్యక్షసాక్షి