SA vs IND: ఐదు సెషన్లలోనే మ్యాచ్ ముగింపు.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డు
దక్షిణాఫ్రికా, భారత్ (SA vs IND) మధ్య జరిగిన రెండో టెస్టు ఐదు సెషన్లలోనే ముగిసింది. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డు నమోదైంది.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో భారత్ (Team India) 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్ను రోహిత్ సేన 1-1 తేడాతో సమం చేసింది. తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికాను 55 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. అనంతరం బ్యాటింగ్ చేసి 153 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్లో సఫారీలు 176 పరుగులు చేయగా.. 79 పరుగుల లక్ష్యాన్ని భారత్ 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పిచ్ పేసర్లకు స్వర్గధామంలా మారడంతో మ్యాచ్ ఐదు సెషన్లలోనే ముగిసింది. ఈ క్రమంలోనే టెస్టు క్రికెట్లో ఓ అరుదైన రికార్డు నమోదైంది. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అతి తక్కువ (642) బంతుల్లో ముగిసిన టెస్టుగా ఈ మ్యాచ్ రికార్డుల్లోకెక్కింది. అంతకుముందు 1932లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ 656 బంతుల్లో ముగిసింది. ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ అయింది.
కేప్టౌన్లో తొలిసారి.. మొదటి కెప్టెన్గా రోహిత్ రికార్డు
కేప్టౌన్లో జరిగిన టెస్టుల్లో భారత్ విజయం సాధించడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు ఈ స్టేడియంలో టీమ్ఇండియా ఆరు మ్యాచ్లు ఆడి నాలుగింటిలో ఓడి రెండు మ్యాచ్లు డ్రా చేసుకుంది. ఈ మైదానంలో విజయం సాధించిన తొలి ఆసియా కెప్టెన్గా రోహిత్ శర్మ (Rohit Sharma) రికార్డు సృష్టించాడు. అంతేకాదు దక్షిణాఫ్రికాలో ధోనీ తర్వాత టెస్టు సిరీస్ను డ్రా చేసుకున్న రెండో భారత కెప్టెన్గా నిలిచాడు.
టెస్టుల్లో మళ్లీ అగ్రస్థానం
దక్షిణాఫ్రికాపై రెండో టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం సాధించడంతో డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి దూసుకొచ్చింది. సఫారీలతో రెండు టెస్టు ప్రారంభానికి ముందు భారత్ ఆరో స్థానంలో ఉంది. ప్రస్తుతం భారత్ టాప్లో ఉండగా.. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఒక్క సిరీస్నూ చేజార్చుకోలేదు
దక్షిణాఫ్రికా టూర్లో మూడేసి టీ20లు, వన్డేలు, రెండు టెస్టులు ఆడిన భారత్ ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. పొట్టి సిరీస్ను 1-1 తేడాతో సమం చేసిన టీమ్ఇండియా.. వన్డే సిరీస్ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిన రోహిత్ సేన.. రెండో టెస్టులో ఘన విజయం అందుకుని సిరీస్ను సమం చేసింది.
అతి తక్కువ బంతుల్లో ముగిసిన టెస్టులు
- 642 - దక్షిణాఫ్రికా vs భారత్ (కేప్టౌన్) 2024
- 656 - ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా (మెల్బోర్న్) 1932
- 672 - వెస్టిండీస్ vs ఇంగ్లాండ్ (బ్రిడ్జ్టౌన్) 1935
- 788 - ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా (మాంచెస్టర్) 1888
- 792 - ఇంగ్లాండ్ vs ఆస్ట్రేలియా (లార్డ్స్) 1888
భారత్పై రెండు ఇన్నింగ్స్లు కలిపి అత్యల్ప స్కోర్లు చేసిన జట్లు
- 193 - ఇంగ్లాండ్ (అహ్మదాబాద్) 2021
- 212 - అఫ్గానిస్థాన్ (బెంగళూరు) 2018
- 229 - న్యూజిలాండ్ (ముంబయి) 2021
- 230 - ఇంగ్లాండ్ (లీడ్స్) 1986
- 231 - దక్షిణాఫ్రికా (కేప్టౌన్) 2024
భారత్ ఆడిన టెస్టులు రెండు రోజుల్లో ముగిసిన సందర్భాలు
- అఫ్గానిస్థాన్తో (బెంగళూరు) 2018
- ఇంగ్లాండ్తో (అహ్మదాబాద్) 2021
- దక్షిణాఫ్రికాతో (కేప్టౌన్) 2024
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!