U19 World CUP: యువ భారత్ జోరు.. పసికూన బేజారు
అండర్-19 ప్రపంచకప్లో యువ భారత్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే క్వార్టర్స్ చేరిన భారత జట్టు పసికూన ఉగాండాతో జరిగిన మ్యాచ్లో 326 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
ఇంటర్నెట్డెస్క్: కెప్టెన్తో సహా కీలక ఆటగాళ్లు కొవిడ్ బారిన పడినా అండర్-19 ప్రపంచకప్లో యువ భారత్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే క్వార్టర్స్ బెర్త్ ఖారురు చేసుకున్న భారత జట్టు లీగ్ దశలోని చివరి మ్యాచ్లో పసికూన ఉగాండాను బెంబేలెత్తించింది. మొదట బ్యాటింగ్తో, తర్వాత బౌలింగ్తో ఉగాండాను ఉక్కిరి బిక్కిరి చేసి 326 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత కుర్రాళ్లు కనీవినీ ఎరుగని రీతిలో 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేశారు. రాజ్ బవా (162 నాటౌట్, 108 బంతుల్లో 14×4, 8×6), రఘువంశీ (144; 120 బంతుల్లో 22×4, 4×6) ఆకాశమే హద్దుగా సెంచరీలతో వీరవిహారం చేశారు. ఈ జోడీ 206 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. అనంతరం 406 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఉగాండా జట్టు పూర్తిగా తేలిపోయింది. ఆ జట్టు 19.4 ఓవర్లలో 79 పరుగులకే చాపచుట్టేసింది. కెప్టెన్ పాస్కల్ మురింగి (34) టాప్ స్కోరర్. మిగతవారు భారత బౌలర్ల దెబ్బకు విలవిలలాడారు. ఉగాండా ఇన్నింగ్స్లో నలుగురు ఆటగాళ్లు డకౌట్ అయ్యారు. ఒక్కరు 11 పరుగులు, ముగ్గురు తలో 5 పరుగుల చొప్పున చేశారు. భారత కెప్టెన్ నిషాంత్ సింధు 4 వికెట్లు తీయగా, రాజ్వర్ధన్ హంగారేర్కర్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ గెలుపుతో భారత్ గ్రూప్- బిలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఇక గ్రూప్-ఎలో ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, గ్రూప్-బిలో భారత్తో పాటు దక్షిణాఫ్రికా, గ్రూప్-సిలో పాకిస్థాన్తో పాటు అఫ్గానిస్థాన్, గ్రూప్-డిలో శ్రీలంకతో పాటు ఆస్త్రేలియా జట్లు క్వార్టర్స్ బెర్త్ ఖరారు చేసుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
-
పాలు ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? పూర్తి సమాచారం ఇదిగో!
-
చైనాలో ఎలాన్ మస్క్ ఆకస్మిక పర్యటన!
-
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా