Team India: షాక్‌!శుభ్‌మన్‌కు గాయం

టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఇంగ్లాండ్‌తో అయిదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు దూరమయ్యే అవకాశముంది. అతడి కాలికి గాయమైందని సమాచారం....

Published : 01 Jul 2021 10:04 IST

ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు అనుమానమే

దిల్లీ: టీమ్‌ఇండియా యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఇంగ్లాండ్‌తో అయిదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు దూరమయ్యే అవకాశముంది. అతడి కాలికి గాయమైందని సమాచారం. గాయం తీవ్రమైంది కావడంతో అతడికి శస్త్రచికిత్స చేయించాల్సి రావచ్చని బీసీసీఐ అధికారి చెప్పాడు. ప్రస్తుతం ఫిజియో నితిన్‌ పటేల్‌ పర్యవేక్షణలో అతడు ఫిట్‌నెస్‌ మెరుగుపరుచుకునే పనిలో ఉన్నాడు. శుభ్‌మన్‌ కోలుకుని తిరిగి సిరీస్‌ ఆడే అవకాశాలు తక్కువగా ఉండటంతో.. కేఎల్‌ రాహుల్, మయాంక్‌ అగర్వాల్‌లో ఒకరు అతడి స్థానాన్ని భర్తీ చేసే వీలుంది. మరోవైపు గిల్‌ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్‌ జట్టులో రావొచ్చని తెలుస్తోంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని