IPL 2021:మిగిలిన మ్యాచ్‌ల్లో గెలిచి ప్లే ఆఫ్స్‌కి వెళ్తాం: శుభమన్ గిల్‌

ఐపీఎల్‌-14 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో గెలుపొంది ప్లే ఆఫ్స్‌కి అర్హత సాధిస్తామని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు శుభమన్ గిల్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19న ఐపీఎల్ పున:ప్రారంభం కానుంది. ఆటగాళ్లు, సిబ్బంది కరోనా

Published : 08 Sep 2021 01:17 IST

(photo:Shubman Gill Twitter)

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్‌-14 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌ల్లో గెలుపొంది ప్లే ఆఫ్స్‌కి అర్హత సాధిస్తామని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు శుభమన్ గిల్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19న ఐపీఎల్ పున:ప్రారంభం కానుంది. ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారినపడటంతో మే మొదటివారంలో ఈ మెగా టోర్నీ వాయిదా పడింది. ఐపీఎల్‌ వాయిదా పడే నాటికి ఏడు మ్యాచులు ఆడిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌.. కేవలం రెండింటిలో మాత్రమే విజయం సాధించి ఏడో స్థానంలో నిలిచింది.

‘టాప్-4లో నిలిచేందుకు మేం ఇంకా పోటీలో ఉన్నాం. ఏ జట్టు అర్హత సాధించినా..తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. మేం మిగిలిన మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తామని ఆశిస్తున్నా. మేం అర్హత సాధించామని నిర్ధారించుకోండి. ఆపై మేము ఎక్కడికి వెళ్తామో చూద్దాం. ఇంతకుముందు సీజన్లలో అనుసరించిన వ్యూహాలను అమలు చేసి, ప్రతి మ్యాచ్‌ని ఆస్వాదిస్తే సీజన్‌ మెరుగైన స్థానంతో ముగించడం లేదా ప్లే ఆఫ్స్‌కి అర్హత సాధించే అవకాశం ఉంది’ అని శుభమన్‌ గిల్ చెప్పుకొచ్చాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని