IPL 2021: ప్రతి మ్యాచ్ను ఫైనల్లాగే ఆడతాం: రషీద్ ఖాన్
త్వరలో పునఃప్రారంభం కానున్న ఐపీఎల్ మలి అంచెలో.. ప్రతి మ్యాచ్ను ఫైనల్లాగే ఆడతామని సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) ఆటగాడు రషీద్ ఖాన్ అన్నాడు. మిగతా మ్యాచుల్లో గెలిచి..
ఇంటర్నెట్ డెస్క్: త్వరలో పునఃప్రారంభం కానున్న ఐపీఎల్లో.. ప్రతి మ్యాచ్ను ఫైనల్లాగే ఆడతామని సన్రైజర్స్ హైదరాబాద్(ఎస్ఆర్హెచ్) ఆటగాడు రషీద్ ఖాన్ అన్నాడు. మిగతా మ్యాచుల్లో గెలిచి కచ్చితంగా ప్లేఆఫ్స్ చేరతామని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘ఈ సీజన్ మొదటి దశలో మేం నిరాశపరిచాం. త్వరలో ప్రారంభం కానున్న మిగతా సీజన్లో పుంజుకుంటాం. ప్రతి మ్యాచ్ను ఫైనల్లాగే భావించి బరిలోకి దిగుతాం. చివరి ఓవర్లలో బ్యాట్తో రాణించి.. 20-25 పరుగులు చేయడం చాలా కీలకం. జట్టు విజయంలో అవి చాలా కీలకం. అందుకే, గత కొద్దికాలంగా బ్యాటింగ్పై దృష్టి పెట్టాను. నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తూ రకరకాల షాట్లు నేర్చుకున్నాను. చాలా రోజులుగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుండటంతో పిచ్ను బాగా అర్ధం చేసుకోగలిగాం. బంతులు ఎక్కడ వేయాలి? ఎలా వేయాలి? అనే విషయాలపై స్ఫష్టత వచ్చింది. పరిస్థితులను బట్టి బౌలింగ్ చేస్తే వికెట్లు రాబట్టవచ్చు’ అని రషీద్ ఖాన్ పేర్కొన్నాడు.
ఇప్పటి వరకు సన్రైజర్స్ ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం ఒకే మ్యాచులో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. వరుస ఓటముల నేఫథ్యంలో జట్టుకు నాయకత్వం వహిస్తున్న డేవిడ్ వార్నర్ని తొలగించిన యాజమాన్యం.. కేన్ విలియమ్సన్కు పగ్గాలప్పగించింది. అయినా సన్రైజర్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..