IPL 2021: మేం ఏం చేయాలో అప్పుడు తెలుస్తుంది: రోహిత్ శర్మ
ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు కాకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ రెచ్చిపోయింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రన్రేట్ని కూడా మెరుగుపరుచుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు కాకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ రెచ్చిపోయింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రన్రేట్ని కూడా మెరుగుపరుచుకుంది. కౌల్టర్నైల్ (4/14), నీషమ్ (3/12), బుమ్రా (2/12) సూపర్ బౌలింగ్తో ప్రత్యర్థిని హడలెత్తించారు. దీంతో రాజస్థాన్ 9 వికెట్లకు 90 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ ( 50 నాటౌట్; 25 బంతుల్లో 5×4, 3×6) చెలరేగి ఆడటంతో.. ముంబయి ఈ స్వల్ప లక్ష్యాన్ని మరో 70 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా ఛేదించింది. ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్స్కి చేరాలంటే సన్రైజర్స్ జట్టుతో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాలి. అంతేకాదు రాజస్థాన్ రాయల్స్.. కోల్కతా నైట్రైడర్స్ని ఓడించాలి. అప్పుడే ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్స్కి చేరే అవకాశం ఉంటుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, రాజస్థాన్ సారథి సంజు శాంసన్ మాట్లాడారు.
మేం ఏం చేయాలో అప్పుడు తెలుస్తుంది: రోహిత్ శర్మ
‘మేము ఈ స్థితికి వచ్చిన తర్వాత మా శక్తిమేరకు రాణించాలి. ఈ రెండు పాయింట్లు మాకు చాలా కీలకమైనవి. రాజస్థాన్ని 90 పరుగులకే కట్టడి చేయడంతో మ్యాచ్ని త్వరగా ముగించే అవకాశం వచ్చింది. ఆటలో పైచేయి సాధించడం ముఖ్యం. మేము బయటకు వచ్చి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలి. రన్ రేట్ను మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో మేం బాగా ఆడాం. ఇషాన్ కిషన్ కొన్ని మ్యాచ్ల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చాడు. అతడి విషయంలో రిస్క్ తీసుకుకోవడానికి సిద్ధంగా ఉన్నా. అతని సామర్థ్యం మాకు తెలుసు. అతను కొంత సమయం గడపాలని మేము కోరుకున్నాము. అతడు కూడా సరిగ్గా అదే చేశాడు. నీషమ్ దృఢమైన వ్యక్తి. జట్టు వాతావరణాన్ని సందడిగా ఉంచుతాడు. బౌలర్లందరూ కలిసికట్టుగా రాణించారు. ఈ టోర్నమెంట్లో ప్రతి జట్టు ఏ జట్టునైనా ఓడించగలదని భావిస్తున్నా. మేం సన్రైజర్స్ హైదరాబాద్తో ఆడటానికి కంటే ముందే కోల్కతా నైట్రైడర్స్.. రాజస్థాన్తో తలపడుతుంది. ఆ మ్యాచ్ ఫలితాన్ని బట్టి మేం ఏం చేయాలో తెలుస్తుంది’ అని రోహిత్ శర్మ అన్నాడు.
షార్జా పిచ్పై మొదట బ్యాటింగ్ చేయడం కష్టం: సంజు శాంసన్
‘ఈ పిచ్పై బ్యాటింగ్ చేయడం కొంచెం సవాలుతో కూడుకున్న పని. ఇటువంటి పిచ్పై మొదటి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైన పని. అబుదాబి పిచ్పై ఆడటానికి, షార్జా పిచ్పై ఆడటానికి మధ్య భారీ వ్యత్యాసం ఉంది. అబుదాబి అత్యుత్తమ బ్యాటింగ్ వికెట్లలో ఒకటి. షార్జా పిచ్కు అలవాటు పడటం చాలా కష్టం. బ్యాటర్లను ఎక్కువగా నిందించలేం. మొదటి ఇన్నింగ్స్ కంటే రెండో ఇన్నింగ్స్లో వికెట్ కొంచెం మెరుగ్గా ఉంది. ముంబయి ఆటగాళ్లు బాగా బ్యాటింగ్ చేశారు. మేము కొంత సమయం తీసుకున్న తర్వాత తదుపరి మ్యాచ్ గురించి ఆలోచించాలి. వచ్చే మ్యాచ్లో మేము మెరుగైన ఆటను ఆడాలనుకుంటున్నాం. కోల్కతా నైట్రైడర్స్ బలంగా వస్తారని మాకు తెలుసు. పవర్ప్లేలో వారు రన్ రేట్ పెంచాలనుకుంటారు’ అని శాంసన్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!