IPL 2023 Final: ‘నేను గుజరాత్ బిడ్డను.. అయినా నా మనసు చెన్నై గెలవాలనుకుంటోంది’
చెన్నై సూపర్ కింగ్స్ (CSK), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య ఆదివారం జరిగే ఐపీఎల్ ఫైనల్ (IPL 2023 Final)లో ఏ జట్టు విజేతగా నిలుస్తుందనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-16 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. ఆదివారమే ఫైనల్. ఈ టైటిల్ పోరు (IPL Final 2023)లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తలపడనున్నాయి. రెండూ బలమైన జట్లే కావడంతో ఫైనల్ రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. చెన్నైని ఓడించి గుజరాత్ వరుసగా రెండో ఏడాది టైటిల్ ఎగరేసుకుపోతుందా? లేక ధోనీ (MS Dhoni) తన వ్యూహాలతో సీఎస్కేకు ఐదో కప్ను అందిస్తాడా? అనే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) ఏ జట్టు ఛాంపియన్గా నిలుస్తుందనే దానిపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. గుజరాత్, చెన్నై జట్లలో ఏ జట్టుని ఎంపిక చేసుకోవాలనే విషయంలో చాలా గందరగోళానికి గురయ్యానని పేర్కొన్నాడు. కొన్ని కారణాల వల్ల ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ తనకు ఎమోషనల్ అని పఠాన్ చెప్పాడు. ఆటగాడిగా ధోనీకిదే ఆఖరి ఐపీఎల్ అని వార్తలు వస్తున్నందున ఈ సీజన్లో చెన్నై విజేతగా నిలవాలని కోరుకుంటున్నట్లు ఇర్ఫాన్ పఠాన్ చెప్పాడు.
‘‘నాణ్యతాపరంగా, బౌలింగ్ విభాగంలో చెన్నై సూపర్ కింగ్స్ కంటే గుజరాత్ టైటాన్స్ చాలా ముందుంది. ఒక్కో ఆటగాడిపరంగా చూసుకున్న గుజరాత్దే పైచేయి. కానీ.. సీఎస్కే, గుజరాత్ మధ్య ఇది ఎమోషనల్ మ్యాచ్ అవుతుంది. నేను గుజరాతి బిడ్డగా గుజరాత్ గెలవాలనుకుంటున్నా. కానీ, నా మనసు మాత్రం ధోనీ వైపు మొగ్గు చూపుతోంది. అతను వచ్చే ఏడాది ఆడతాడా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత లేదు. ధోనీ ఫ్యాక్టర్ కారణంగా నా హృదయం సీఎస్కేకు మద్దతు ఇస్తోంది’ అని ఇర్ఫాన్ పఠాన్ వివరించాడు. అహ్మదాబాద్ వేదికగా ఆదివారం (మే 28) సాయంత్రం 7.30 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభంకానుంది. అయితే, సాయంత్రం 4 గంటల నుంచే ముగింపు వేడుకులను అట్టహాసంగా నిర్వహించేందుకు ఐపీఎల్ నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..