KL Rahul: లఖ్నవూ వేదిక.. ఇప్పటికీ ఆ బాధ అలానే ఉంది: కేఎల్ రాహుల్
వరుసగా ఐదు విజయాలు సాధించి ఊపు మీదున్న టీమ్ఇండియా (IND vs ENG) మరో కీలక పోరులో ఇంగ్లాండ్తో తలపడేందుకు సిద్ధమైంది. లఖ్నవూ స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023)లో ఇంగ్లాండ్తో లఖ్నవూ వేదికగా భారత్ (IND vs ENG) తలపడనుంది. లఖ్నవూలోని ఏకనా స్టేడియంతో టీమ్ఇండియా ఆటగాడు కేఎల్ రాహుల్కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023)లో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు సారథిగా రాహుల్ వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అలానే ఈ స్టేడియంలో చేదు అనుభవమూ రాహుల్ ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ లీగ్ మధ్యలోనే గాయపడటంతో దాదాపు ఐదు నెలలు ఆటకు దూరం కావాల్సి వచ్చింది. ఇంగ్లాండ్తో మ్యాచ్కు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కేఎల్ రాహుల్ (KL Rahul) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు వాటన్నింటినీ పక్కన పెట్టేసి ఫ్రెష్గా ఆడాలని ఈ మిడిలార్డర్ బ్యాటర్ భావిస్తున్నాడు.
‘‘ఇప్పటికీ ఆ బాధ అలానే ఉంది. ఇదే మైదానంలో ఆడుతూ గాయపడ్డా. దీంతో ఐదు నెలలపాటు క్రికెట్కు దూరం కావాల్సి వచ్చింది. అదే నాకు చాలా కఠినమైన సమయం. ఎవరైనా సరే గాయపడి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత పునరాగమనం చేయాలంటే చాలా కష్టం. మీరు ఎవరిని అడిగినా ఇదే మాట చెబుతారు. దాని కోసం తీవ్రంగా శ్రమించాల్సిన అవసరం ఉంది. ఓర్పుతో ఉండాలి. అదంత సులువేం కాదు. క్రికెట్లో ఎత్తుపల్లాలు సర్వసాధారణం. ఒక్కోసారి వంద చేయొచ్చు. మరోసారి చేయలేకపోవచ్చు. సక్సెస్ లేదా వైఫల్యాలను నేర్పుగా హ్యాండిల్ చేయాలి. గాయాలపాలైన తర్వాత అది మరింత కష్టంగా మారుతుంది. ఫిజియో చేయించుకున్నా సరే నొప్పి మాత్రం వస్తూనే ఉంటుంది. దానిని అధిగమించాలంటే శారీరకంగా, మానసికంగా దృఢంగా మారాలి.
ఈసారి వరల్డ్ కప్లో అద్భుత విజయాలతో కొనసాగుతున్నాం. లఖ్నవూ స్టేడియానికి వచ్చినప్పుడు మరోసారి గత జ్ఞాపకాలు మదిలో మెదిలాయి. ఆడుతూ జారిపడటంతో గాయపడ్డాను. నేను దానిని మరిచిపోదామని భావిస్తున్నా. కానీ, అభిమానులు గుర్తు చేస్తున్నారు. అయితే, నేను దానిని పక్కనపెట్టేసి తాజాగా బరిలోకి దిగుతున్నా. భారీ ఇన్నింగ్స్ లేదా ఇతర అద్భుత ఫలితంతో వాటన్నింటినీ మరిచిపోతా’’ అని కేఎల్ రాహుల్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.