Asia Cup 2023: కేఎల్ కోసం అతడిని పక్కన పెట్టొచ్చు.. ఇషాన్ తుది జట్టులో ఉండాల్సిందే: గావస్కర్
ఆసియా కప్లోని (Asia Cup 2023) సూపర్ -4 మ్యాచుల్లో ఆడేందుకు కేఎల్ రాహుల్ సిద్ధమైపోతున్నాడు. అయితే, అతడి కోసం ఎవరిని పక్కన పెడతారనేది ఆసక్తికరంగా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్లో (Asia Cup 2023) భారత్ సూపర్ - 4 స్టేజ్కు వెళ్లిపోయింది. అయితే, తుది జట్టు ఎంపికపై మాత్రం తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఫిట్నెస్ నిరూపించుకుని కేఎల్ రాహుల్ (KL Rahul) అందుబాటులోకి వస్తాడు. అలాగే వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) కోసం ప్రకటించే జట్టులోనూ కేఎల్ ఉండే అవకాశాలు ఎక్కువే. దీంతో సూపర్ -4లో రాహుల్ను ఆడించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. అయితే, అతడిని తుది జట్టులోకి తీసుకోవాలంటే ఒకరిని రిజర్వ్కు పరిమితం చేయాల్సి ఉంటుంది. వికెట్ కీపర్గా ఉన్న ఇషాన్ కిషన్ను తప్పించే అవకాశం లేదు. పాక్పై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఎవరిని తప్పించనున్నారనేది కీలకం కానుంది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మాత్రం కేఎల్ రాహుల్ను తీసుకోవాలంటే శ్రేయస్ అయ్యర్ను పక్కన పెట్టాలని సూచించాడు. ఇషాన్ కిషన్ తుది జట్టులో ఉండాల్సిందేనని వ్యాఖ్యానించాడు.
‘‘వికెట్ కీపర్ బ్యాటర్గా ఉన్న ఇషాన్ కిషన్ను తప్పించడం సరైంది కాదు. కేఎల్ రాహుల్ వచ్చినా అతడిని కేవలం బ్యాటర్గానే పరిగణించాలి. నేపాల్తో మ్యాచ్ సందర్భంగా శ్రేయస్ అయ్యర్ ఎలా ఆడతాడో చూద్దామని భావించా. కానీ, శ్రేయస్ బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. మ్యాచ్ పూర్తిగా జరిగి ఉంటే టాప్ -4 బ్యాటర్లు బరిలోకి దిగే అవసరం ఉండేది. ఒకవేళ ఈ మ్యాచ్లోనూ శ్రేయస్ పరుగులు చేయకుండా ఉంటే.. సూపర్ -4 మ్యాచుల్లో కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ వరుసగా నాలుగు, ఐదుస్థానాల్లో బ్యాటింగ్కు దిగొచ్చు.
ఇక్కడ అడుగుపెట్టే నాటికే వరల్డ్ కప్ జట్టుపై ఓ అంచనాకు వచ్చేశాం
పాక్పై 80+ పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ను తప్పించలేరు. క్లిష్టమైన పరిస్థితుల్లో విలువైన పరుగులు సాధించాడు. ఇషాన్ను రిజర్వ్ బెంచ్పై కూర్చోబెట్టడం కూడా సరైన పద్ధతి కాదు. ఎడమచేతివాటం బ్యాటర్ కావడం వల్ల జట్టు కూర్పులోనూ మరింత వైవిధ్యం వచ్చినట్లవుతుంది’’ అని సునీల్ గావస్కర్ తెలిపాడు. ఆసియా కప్లోని తొలి రెండు మ్యాచ్లకు కేఎల్ రాహుల్ దూరమైన సంగతి తెలిసిందే. కేఎల్ ఫిట్నెస్ను ఎన్సీఏ ధ్రువీకరించడంతో మిగతా మ్యాచ్లకు అందుబాటులోకి వచ్చేయనున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
ఎవరా 15..!
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.