Kuldeep Yadav: వసీమ్ అక్రమ్ కావాలనుకున్నా.. షేన్వార్న్లా మారిపోయా: కుల్దీప్
అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) వరల్డ్ కప్లో రాణిస్తున్నాడు. ఎడమచేతివాటం లెగ్ స్పిన్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తోన్న కుల్దీప్ తొలుత పేసర్గా మారాల్సింది. కానీ, అతడి కోచ్ సలహా మేరకు స్పిన్నర్ అవతారం ఎత్తాడు.
ఇంటర్నెట్ డెస్క్: అనుకోకుండా వన్డే ప్రపంచకప్ 2023 (ODI World Cup 2023) టోర్నీ ఆడుతున్నవారిలో కుల్దీప్ యాదవ్ ఒకడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని మరీ భారత జట్టులోకి వచ్చాడు. ప్రధాన స్పిన్ బౌలర్గా మారిపోయాడు. ఐదు మ్యాచుల్లో 8 వికెట్లు తీసి అదరగొట్టేస్తున్నాడు. చైనామన్ తరహా బౌలింగ్తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్న కుల్దీప్ తొలుత పేసర్ అవుదామని భావించాడట. చివరికి స్పిన్నర్గా కెరీర్ను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇలా మారడానికిగల కారణాలను కూడా వెల్లడించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ షేర్ చేసింది.
‘‘నేను పాక్ దిగ్గజం వసీమ్ అక్రమ్ బౌలింగ్ను ఇష్టపడతా. నాకు ఐడల్ కూడా అతడు. నేను కూడా అక్రమ్లా పేసర్ అవ్వాలనుకున్నా. అయితే, నా కోచ్ సలహాతో స్పిన్నర్గా మారిపోయా. ‘ఎవరూ మణికట్టు లెఫ్ట్ఆర్మ్ బౌలర్లు లేరు. నువ్వు అలా ప్రయత్నించు. విజయవంతమవుతావు’ అని కోచ్ చెప్పడంతో ప్రయత్నించా. స్పిన్ కేటగిరీలో నాకు రోల్ మోడల్ షేన్ వార్న్. అతడిని అనుకరించేవాడిని కూడా. ఎప్పుడైనా బౌలింగ్కు సంబంధించి ఎలాంటి అనుమానం ఉన్నా వెంటనే వార్న్ పాత వీడియోలను చూసేవాడిని. అతడితో కొంతసమయం మాట్లాడటం కూడా అదృష్టమే. టీవీల్లో వార్న్ బౌలింగ్ చూస్తూ పెరిగినవాడిని. బ్యాటర్లను ఎలా బోల్తా కొట్టిస్తాడు? అతడి ప్రణాళికలు ఏంటనేది ఆసక్తికరంగా ఉంటాయి. మానసికంగానూ దృఢమైన వ్యక్తి. 2019లో నేను సిడ్నీ టెస్టు ఆడుతున్న సమయంలో బౌలింగ్కు సంబంధించిన సూచనలు చేశాడు. ఎప్పటికీ వార్న్ సూచనలను, సలహాలను మరిచిపోలేను’’ అని కుల్దీప్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భళి భళిరా బెంగళూరు
ఎనిమిది మ్యాచ్ల్లో ఒకే ఒక్క గెలుపు. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం. రన్రేటూ మైనసుల్లో. అప్పటికి కనీసం నాలుగు విజయాలు సాధించిన జట్లు ఆరున్నాయి. ఇక ఈ ఐపీఎల్లో బెంగళూరు కథ ముగిసినట్లేనని క్రికెట్ ప్రపంచం తీర్మానించింది. -
నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: కోహ్లి
తాను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదని.. తన ప్రదర్శనే ప్రామాణికమని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు. ఐపీఎల్లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నా.. అతడి స్ట్రైక్రేట్పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించాడు. -
రోహిత్ దారెటు?
ముంబయి ఇండియన్స్తో రోహిత్ ఇన్నింగ్స్ ముగిసినట్లేనా! వచ్చే సీజన్కు అతడు ఆ జట్టుతో ఉండడా? హిట్మ్యాన్ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో ఈ ఊహాగానాలకు తెరలేస్తే.. తాజాగా ముంబయి కోచ్ బౌచర్ వ్యాఖ్యలతో అవి కేవలం ఊహాగానాలే కావని తేలిపోయింది. -
25న న్యూయార్క్కు భారత క్రికెటర్లు
సహాయ సిబ్బందితో పాటు భారత జట్టులోని చాలా మంది ఆటగాళ్లు టీ20 ప్రపంచకప్ కోసం ఈ నెల 25న న్యూయార్క్ బయల్దేరనున్నారు. మిగతా ఆటగాళ్లు ఐపీఎల్ ఫైనల్ (మే 26) తర్వాత వెళ్తారు. -
నా బ్యాటింగ్ అంత గొప్పగా లేదు: రోహిత్
ప్రస్తుత ఐపీఎల్లో తన బ్యాటింగ్ ఆశించిన ప్రమాణాల మేర లేదని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. కానీ దాని గురించి అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. -
రెండో స్థానంలో అర్జున్
తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ ఇరిగేశి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. అతడు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. శనివారం నాలుగో రౌండ్లో మాన్యుయెల్ పెట్రోసియన్ (ఆర్మేనియా)పై అతడు నెగ్గాడు. -
సిఫ్త్కౌర్, నీరజ్ గెలుపు
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్-4లో సిఫ్త్కౌర్, నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచారు. మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీపొజిషన్స్ తుది పోరులో సిఫ్త్ 461.3 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. -
పర్వీన్ స్థానంలో జైస్మిన్
బాక్సర్ పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించిన నేపథ్యంలో.. కోల్పోయిన ఒలింపిక్ బెర్తు తిరిగి దక్కించుకునే ప్రయత్నాన్ని భారత బాక్సింగ్ సమాఖ్య ఆరంభించింది. -
తుదిపోరుకు సాత్విక్ ద్వయం
థాయ్లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి జోడీ అదిరే ప్రదర్శన చేస్తోంది. దూకుడైన ఆటతో ఈ భారత జంట ఫైనల్కు దూసుకెళ్లింది. శనివారం పురుషుల డబుల్స్ సెమీస్లో సాత్విక్ ద్వయం 21-11, 21-12తో లూ మింగ్-తాంగ్ కైయ్ వీయ్ (చైనీస్ తైపీ) జోడీని చిత్తు చేసింది. -
నిఖత్ పసిడి పంచ్
ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణా అమ్మాయి నిఖత్ జరీన్ సత్తా చాటింది. పారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్ను కొనసాగిస్తూ స్వర్ణం కైవసం చేసుకుంది. శనివారం 52 కేజీల తుదిపోరులో ఆమె 5-0తో ఉర్క్బయెవా (కజకిస్థాన్)ను చిత్తు చేసింది. -
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు
చెన్నైతో జరిగిన కీలక పోరులో బెంగళూరు 27 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. 218 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన చెన్నై 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులకు పరిమితం అయింది.