NZ vs IND: న్యూజిలాండ్‌ X భారత్‌ తొలి టీ20 వర్షార్పణం

తొలి టీ20 మ్యాచ్‌లో వరుణుడు విజయం సాధించాడు. న్యూజిలాండ్‌ను ఢీకొట్టేందుకు వెళ్లిన యువ భారత్‌కు నిరాశను మిగిలిస్తూ తొలి టీ20 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. టాస్‌ వేయకుండానే రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకొన్నారు.

Updated : 18 Nov 2022 13:59 IST

ఇంటర్నెట్ డెస్క్‌: న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన భారత్‌కు కలిసిరాలేదు. తమ సత్తాను చాటేందుకు ఇదొక మంచి అవకాశంగా భావించిన టీమ్‌ఇండియా యువ క్రికెటర్లకు నిరాశే ఎదురైంది. మూడు టీ20ల సిరీస్‌లో వెల్లింగ్టన్‌ వేదికగా జరగాల్సిన తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది. కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్‌ అయినా నిర్వహించేందుకు వీలుపడుతుందేమోనని భావించినా.. వర్షం ఆగకపోవడంతో టాస్‌ వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేస్తూ అంపైర్లు నిర్ణయం తీసుకొన్నారు. ఇక రెండో టీ20 మ్యాచ్‌ మౌంట్‌ మాంగనుయ్‌ వేదికగా నవంబర్ 20న జరగనుంది. 

ఇవాళ వర్షం పడుతుండటంతో భారత్‌, న్యూజిలాండ్‌ ఆటగాళ్లు నెట్‌ ప్రాక్టీస్‌ కూడా చేయలేకపోయారు. దీంతో స్టేడియం లోపలే  ఇరు జట్ల ప్లేయర్లు ‘ఫుట్‌వాలీ’ ఆడారు. ఈ వీడియోను బీసీసీఐ తన సోషల్‌ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని