Mithali Raj: ‘మిథాలీ భారత మహిళా క్రికెట్కు మూల స్తంభం.. ఎంతో మందికి రోల్ మోడల్’
భారత మహిళా క్రికెట్ వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ఆమె సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటన చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళా క్రికెట్ వన్డే, టెస్టు జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ఆమె సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటన చేశారు. 23 ఏళ్లపాటు భారత మహిళా క్రికెట్కు సేవలందించిన మిథాలీ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆమె సెకండ్ ఇన్నింగ్స్ బాగుండాలని ఆకాంక్షిస్తూ బీసీసీఐ, ఐసీసీతోపాటు పలువురు క్రీడాకారులు ట్వీట్లు చేస్తున్నారు.
- ‘భారత క్రికెట్కు మీరు అందించిన సేవలు అసాధారణమైనవి. కెరీర్లో అద్భుతంగా రాణించారు. మీరు గొప్ప వారసత్వాన్ని మిగిల్చారు. మీ రెండవ ఇన్నింగ్స్ విజయవంతంగా సాగాలని కోరుకుంటున్నాం’
- బీసీసీఐ
- ‘అద్భుతమైన కెరీర్ ముగిసింది! భారత క్రికెట్కు అపారమైన సహకారం అందించిన మిథాలీ రాజ్కు ధన్యవాదాలు. మీ నాయకత్వం జాతీయ మహిళా జట్టుకు ఎంతో కీర్తిని తెచ్చిపెట్టింది. మీ తదుపరి ఇన్నింగ్స్కు బాగుండాలని కాంక్షిస్తున్నా’
- బీసీసీఐ సెక్రటరీ జై షా
- ‘కెరీర్ ముగింపు వరకు మిథాలీ తన సహచర క్రికెటర్ల కంటే ఎక్కువ కాలం ఫామ్లో ఉంది. ఆమె భారత క్రికెట్కు ఎంతో సేవ చేసింది. మిథాలీ రాజ్ మీ సెకండ్ ఇన్నింగ్స్ బాగుండాలి’
- వసీం జాఫర్
- ‘అద్భుతమైన కెరీర్ని పూర్తి చేసుకున్న మిథాలీ రాజ్కు శుభాకాంక్షలు. మీరు ఎంతో మందికి రోల్ మోడల్,స్ఫూర్తి. మీ సెకండ్ ఇన్నింగ్స్లో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను’
- అనిల్ కుంబ్లే
- ‘భారతదేశం కోసం ఆడాలని చాలా కొద్దిమంది మాత్రమే కలలుగంటారు. 23 సంవత్సరాల పాటు దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం. మీరు భారతదేశంలో మహిళల క్రికెట్కు మూలస్తంభంగా ఉన్నారు. చాలా మంది యువ మహిళా క్రికెటర్ల జీవితాలను తీర్చిదిద్దారు. మీ అద్భుతమైన కెరీర్కు అభినందనలు’
- వీవీఎస్ లక్ష్మణ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.