Mohammad Kaif: అశ్విన్ను ఎంపిక చేయకుండా.. ఆ ముగ్గుర్ని ఎందుకు తీసుకున్నారు?
దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్కు రవిచంద్రన్ అశ్విన్ను ఎంపిక చేయకుండా ముగ్గురు లెగ్ స్పిన్నర్లను ఎందుకు తీసుకున్నారని టీమ్ఇండియా...
(Photo: Mohammad Kaif Instagram)
ఇంటర్నెట్డెస్క్: దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న టీ20 సిరీస్కు రవిచంద్రన్ అశ్విన్ను ఎంపిక చేయకుండా ముగ్గురు లెగ్ స్పిన్నర్లను ఎందుకు తీసుకున్నారని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. అశ్విన్ ఇటీవల జరిగిన భారత టీ20 లీగ్లో రాజస్థాన్ తరఫున మంచి ప్రదర్శన చేశాడని గుర్తుచేశాడు. తాజాగా ఓ క్రీడా ఛానల్తో మాట్లాడిన కైఫ్.. టీమ్ఇండియా జట్టు ఎంపికపై స్పందించాడు. రెండు జట్లూ సరైన ఆటగాళ్లతో ఉన్నా టీమ్ఇండియాలో సమతూకం లోపించిందని చెప్పాడు.
‘ఈ సిరీస్లో టీమ్ఇండియా, దక్షిణాఫ్రికా జట్లు మంచి ఆటగాళ్లనే ఎంపిక చేసుకున్నాయి. కానీ, భారత జట్టు యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ వంటి ముగ్గురు లెగ్ స్పిన్నర్లను ఎంచుకుంది. ఈ ముగ్గుర్నీ ఎక్కడ ఆడిస్తారు? ఇక్కడ అశ్విన్ లాంటి మేటి స్పిన్నర్ లేకపోవడం నన్ను నిరాశకు గురిచేసింది. అతడు గతేడాది టీ20 ప్రపంచకప్లో ఆడాడు. ఇటీవల జరిగిన భారత టీ20 లీగ్లోనూ మంచి ప్రదర్శన చేశాడు. ఆ ముగ్గురు లెగ్ స్పిన్నర్లలో ఒకరిని తప్పించి అశ్విన్ను ఎంపిక చేసి ఉంటే బాగుండేది. తన బౌలింగ్తో వేరియేషన్లు చూపించేవాడు. అలాగే కెప్టెన్కు కూడా అతడిని ఉపయోగించుకునేందుకు వీలుండేది. మరోవైపు బ్యాటింగ్లోనూ పరుగులు సాధిస్తున్నాడు. అలాంటప్పుడు అశ్విన్ను కాకుండా ముగ్గురు లెగ్ స్పిన్నర్లను ఎందుకు తీసుకున్నారో అర్థంకావడం లేదు’ అని కైఫ్ అభిప్రాయపడ్డాడు. కాగా, వచ్చేనెల ఇంగ్లాండ్ పర్యటన ఉండటంతో ఈ సిరీస్లో పలువురు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అశ్విన్ కూడా దక్షిణాఫ్రికాతో టీ20 మ్యాచ్లకు దూరమయ్యాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..