MS Dhoni : అడ్రస్‌ అడిగిన ధోని.. నెట్టింట వీడియో వైరల్‌

టీమ్‌ఇండియాకు రెండు ప్రపంచకప్‌లను అందించిన కెప్టెన్‌ కూల్ మహేంద్రసింగ్‌ ధోనీ (Mahendra Singh Dhoni)కి అభిమానులు ఎక్కువే. అతడు ఏం చేసినా అందరూ ఆసక్తిగా చూస్తారు. తాజాగా ధోనీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

Updated : 12 Aug 2023 12:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌:  టీమిండియా క్రికెటర్లలో మహేంద్రసింగ్‌ ధోనీ (Mahendra Singh Dhoni)కి ఉన్న క్రేజ్‌ వేరు. మైదానంలోనే కాదు. బయట కూడా విపరీతంగా ఆరాధించే అభిమానులు అతడికి ఉన్నారు. అంతమంది అభిమానులను సంపాదించుకోవడానికి అతడి ఆటతీరు మాత్రమే కాదు.. వ్యక్తిత్వం కూడా కారణం. ఇక ధోనీ బయట చాలా సింపుల్‌గా ఉంటాడు. ఇందుకు సంబంధించిన ఓ తాజా వీడియో నెట్టింట వైరలవుతోంది. అసలేం జరిగిందంటే..

ధోనీ తన స్నేహతుడితో కలిసి రాంచీ (Ranchi) వెళ్తూ ఓ వ్యక్తిని అడ్రస్‌ అడిగాడు. అతడి స్నేహితుడు వాహనం నడుపుతుండగా.. ముందు సీటులో కూర్చోన్న మహీ.. బైక్‌పై ఉన్నవారిని అడ్రస్‌ అడిగాడు. బైకర్‌ చెప్పినదానికి ధోనీ సందేహంగా ‘‘మీరు చెప్పేది రాంచీ వైపుగా వచ్చే సర్కిల్‌ గురించే కదా?’ అని అడిగాడు. దానికి ఆ యువకుడు అవునని చెప్పగా.. ‘‘రెండో విగ్రహం దగ్గర ఉన్న సర్కిల్‌ వద్ద టర్న్‌ తీసుకోవాలా ?’’ అని మళ్లీ ధోనీ అనడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఇక ఆ తర్వాత బైకర్స్‌కు సెల్ఫీ ఇచ్చి కరచాలనం చేసి అక్కడ్నుంచి ధోనీ వెళ్లిపోయాడు. దీనికి సంబందించిన వీడియోను ఆ అభిమాని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అభిమానులు ‘ధోని చాలా సింపుల్‌గా ఉండే వ్యక్తి. అతడి సింప్లిసిటీ వేరే సెలబ్రెటీలకు భిన్నంగా ఉంటుంది’ అని కామెంట్లు పెడుతున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని