MS Dhoni : అడ్రస్ అడిగిన ధోని.. నెట్టింట వీడియో వైరల్
టీమ్ఇండియాకు రెండు ప్రపంచకప్లను అందించిన కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ (Mahendra Singh Dhoni)కి అభిమానులు ఎక్కువే. అతడు ఏం చేసినా అందరూ ఆసక్తిగా చూస్తారు. తాజాగా ధోనీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా క్రికెటర్లలో మహేంద్రసింగ్ ధోనీ (Mahendra Singh Dhoni)కి ఉన్న క్రేజ్ వేరు. మైదానంలోనే కాదు. బయట కూడా విపరీతంగా ఆరాధించే అభిమానులు అతడికి ఉన్నారు. అంతమంది అభిమానులను సంపాదించుకోవడానికి అతడి ఆటతీరు మాత్రమే కాదు.. వ్యక్తిత్వం కూడా కారణం. ఇక ధోనీ బయట చాలా సింపుల్గా ఉంటాడు. ఇందుకు సంబంధించిన ఓ తాజా వీడియో నెట్టింట వైరలవుతోంది. అసలేం జరిగిందంటే..
ధోనీ తన స్నేహతుడితో కలిసి రాంచీ (Ranchi) వెళ్తూ ఓ వ్యక్తిని అడ్రస్ అడిగాడు. అతడి స్నేహితుడు వాహనం నడుపుతుండగా.. ముందు సీటులో కూర్చోన్న మహీ.. బైక్పై ఉన్నవారిని అడ్రస్ అడిగాడు. బైకర్ చెప్పినదానికి ధోనీ సందేహంగా ‘‘మీరు చెప్పేది రాంచీ వైపుగా వచ్చే సర్కిల్ గురించే కదా?’ అని అడిగాడు. దానికి ఆ యువకుడు అవునని చెప్పగా.. ‘‘రెండో విగ్రహం దగ్గర ఉన్న సర్కిల్ వద్ద టర్న్ తీసుకోవాలా ?’’ అని మళ్లీ ధోనీ అనడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఇక ఆ తర్వాత బైకర్స్కు సెల్ఫీ ఇచ్చి కరచాలనం చేసి అక్కడ్నుంచి ధోనీ వెళ్లిపోయాడు. దీనికి సంబందించిన వీడియోను ఆ అభిమాని సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అభిమానులు ‘ధోని చాలా సింపుల్గా ఉండే వ్యక్తి. అతడి సింప్లిసిటీ వేరే సెలబ్రెటీలకు భిన్నంగా ఉంటుంది’ అని కామెంట్లు పెడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వామ్మో.. అతడికి బౌలింగ్ చేయాలని ఎప్పుడూ కోరుకోను: పాట్ కమిన్స్
హైదరాబాద్ అద్భుతం చేసింది. ఐపీఎల్ 2024 సీజన్ ప్లేఆఫ్స్కు రెండో స్థానంతో దూసుకెళ్లింది. సొంతమైదానం ఉప్పల్ వేదికగా జరిగిన చివరి లీగ్లో పంజాబ్పై విజయం సాధించింది. -
దంచికొట్టి..దర్జాగా
అదే దూకుడు.. అదే దంచుడు. లక్ష్యం ఏమో 215. అయినా తమ ముందు అది చిన్నదే అంటూ.. సన్రైజర్స్ మరోసారి రెచ్చిపోయింది. -
సీఎస్కేను ఆపగలనని నమ్మా
చెన్నై సూపర్ కింగ్స్ని చివరి ఓవర్లో 17 పరుగులు చేయకుండా ఆపగలనని నమ్మానని.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేసర్ యశ్ దయాళ్ తెలిపాడు. -
ఒక్క బంతీ పడకుండానే..
ఐపీఎల్-17లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ వర్షార్పణం అయింది. -
ఛాంప్స్ సాత్విక్-చిరాగ్
భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అదరగొట్టారు. -
లీగ్ దశ ముగిసె..
పరుగుల వరద పారిన మ్యాచ్లు.. ఉత్కంఠభరితంగా ముగిసిన సమరాలు.. రికార్డుల మీద రికార్డులు! దాదాపు రెండు నెలలుగా అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-17లో లీగ్ దశ ముగిసింది. -
ప్రసారదారుపై మండిపడ్డ రోహిత్
క్రికెటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తోందటూ ఐపీఎల్ ప్రసారదారుపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ మండిపడ్డాడు. -
ధోని ఆఖరి మ్యాచ్ ఆడాడని అనుకోవట్లేదు
దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోని తన కెరీర్లో చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడినట్లు తాను భావించట్లేదని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. -
‘లక్ష్య’ దీప్తి రికార్డు
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి జీవాంజి దీప్తి (తెలంగాణ) సత్తాచాటింది. -
అర్జున్ గేమ్ డ్రా
షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. -
మను ఆధిపత్యం
ఒలింపిక్ సెలక్షన్ ట్రయల్స్లో స్టార్ షూటర్ మను బాకర్ ఆధిపత్యం ప్రదర్శించింది. -
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు
స్టార్ స్పోర్ట్స్పై రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మైదానంలో ఆటగాళ్ల సంభాషణలు రికార్డు చేయడంపై మండిపడ్డాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఒక్కోసారి ‘వన్ పర్సెంట్’ ఛాన్స్ ఉన్నా చాలు..: విరాట్ కోహ్లీ
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
-
ప్రారంభమైన ‘టెట్’ ఎగ్జామ్.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM