IPL: కొట్టింది 129.. అడ్డుకుంది 128
ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ ఎంత విజయవంతమైన జట్టో అందరికీ తెలిసిందే. ఈ టోర్నీలో ఎవరికీ సాధ్యంకాని రీతిలో ఇప్పటివరకు ఐదుసార్లు టైటిల్ సాధించింది...
మూడో కప్పును అందించింది ఒక్క పరుగే..
ఇంటర్నెట్డెస్క్: ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ ఎంత విజయవంతమైన జట్టో అందరికీ తెలిసిందే. ఈ టోర్నీలో ఎవరికీ సాధ్యంకాని రీతిలో ఇప్పటివరకూ ఐదుసార్లు టైటిల్ సాధించింది. రోహిత్ కెప్టెన్సీకి, ఆటగాళ్ల అంకితభావానికి ఈ ఫలితాలే నిదర్శనం. ఒత్తిడిలోనూ ప్రత్యర్థిని చిత్తు చేయగల ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. అందువల్లే ఐపీఎల్ ఫైనల్స్లో రెండుసార్లు ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. ముంబయి మూడో సారి కప్పు సాధించి నేటికి నాలుగేళ్లు గడిచాయి. ఈ సందర్భంగా ఆ మ్యాచ్ విశేషాలు ఒకసారి నెమరువేసుకుందాం.
కళ తప్పిన బ్యాటింగ్..
2017 మే 21న ముంబయి ఇండియన్స్, రైజింగ్ పుణె జట్టుతో తలపడి ఒకే ఒక్క పరుగుతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆ జట్టు ఏ మాత్రం ఆకట్టుకోలేదు. పుణె బౌలర్ల ధాటికి బ్యాట్స్మెన్ మొత్తం చేతులెత్తేశారు. ఆది నుంచి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. రోహిత్(24; 22 బంతుల్లో 4x4), కృనాల్ పాండ్య(47; 38 బంతుల్లో 3x4, 2x6) కాస్త పోరాడటంతో ఆ మాత్రం స్కోరైనా సాధించింది. క్రిస్టియన్, జంపా, ఉనద్కత్ తలా రెండు వికెట్లు తీసి రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్ను కళ తప్పేలా చేశారు. దాంతో ఆ జట్టు 129/8 స్కోరుకే పరిమితమైంది.
వెన్ను విరిచిన బౌలింగ్..
ఇక ముంబయి నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పుణె ఆధిపత్యం చలాయించినా చివరికి చతికిలపడింది. 16.2 ఓవర్లకు 98/3తో పటిష్ట స్థితిలో నిలిచి తర్వాత ఓటమిపాలైంది. ఓపెనర్ అజింక్య రహానె(44; 38 బంతుల్లో 5x4), వన్డౌన్ బ్యాట్స్మన్ స్టీవ్స్మిత్(51; 50 బంతుల్లో 2x4, 2x6) నిలకడగా ఆడి మ్యాచ్ను గెలిపించేలా కనిపించారు. అయితే, ముంబయి బౌలర్లు చివరి క్షణాల్లో కట్టుదిట్టంగా బంతులేసి పుణె విజయాన్ని అడ్డుకున్నారు. ఆఖర్లో ధోనీ(10), మనోజ్ తివారి(7) క్రిస్టియన్(4) విఫలమయ్యారు. ఇక జాన్సన్ వేసిన చివరి ఓవర్లో 11 పరుగులు అవసరమైన వేళ మనోజ్ తొలి బంతిని బౌండరీ బాదాడు. దాంతో మళ్లీ ఆశలు చిగురించాయి. కానీ, తర్వాతి రెండు బంతుల్లో అతడితో పాటు స్మిత్ కూడా ఔటయ్యాడు. చివరి బంతికి నాలుగు పరుగులు అవసరమైన వేళ క్రిస్టియన్, వాషింగ్టన్ రెండు పరుగులే తీసి 128/6కే పరిమితమయ్యారు.
కాగా, ముంబయి 2019లోనూ ఇలాగే చెన్నైతో తలపడిన ఫైనల్స్లో ఒక్క పరుగుతోనే విజయం సాధించింది. తొలుత రోహిత్ టీమ్ 149/8 స్కోర్ చేయగా ఆపై ధోనీసేన 148/7కే పరిమితమైంది. ఈ రెండు మ్యాచ్లు హైదరాబాద్లోని రాజీవ్గాంధీ స్టేడియంలో జరగడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..