Team India: వారి ఆట మాకో పాఠం: యాష్‌

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ ముందు ఎక్కువ అంతరం రావడం ఇబ్బందికరమేనని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. ....

Published : 02 Jun 2021 14:59 IST

చెన్నై: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌ ముందు ఎక్కువ అంతరం రావడం ఇబ్బందికరమేనని టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. ఇంగ్లాండ్‌తో రెండు టెస్టులు ఆడటం న్యూజిలాండ్‌కు ప్రయోజనకరమని తెలిపాడు. వారి ఆటను జాగ్రత్తగా పరిశీలిస్తే కోహ్లీసేనకు అదో పాఠం అవుతుందని పేర్కొన్నాడు. సాధనకు సమయం లేకున్నా ఆస్ట్రేలియాలో మాదిరిగా విజయం సాధిస్తామని వెల్లడించాడు.

‘మా తొలి సాధన శిబిరం ఆరంభమయ్యేందుకు కనీసం మరో వారం పది రోజులు పడుతుంది. ఐపీఎల్‌ వాయిదా పడ్డప్పటి నుంచి ఆటగాళ్లు క్రికెట్‌ ఆడలేదు. ఇది మాకు పెద్ద సవాలే. కానీ ఒక్కసారి ఇంగ్లాండ్‌లో అడుగుపెట్టాక టీమ్‌ఇండియా త్వరగా పరిస్థితులకు అలవాటు పడగలదు. ఆస్ట్రేలియాలో మాదిరిగా ప్రదర్శనలు చేయగలదు’ అని అశ్విన్‌ అన్నాడు.

‘మ్యాచ్‌కు సన్నద్ధమవ్వడం, మ్యాచ్‌ కోసం సాధన చేయడం భిన్నమైనవి. ఐపీఎల్‌ వాయిదా పడ్డాక మేం ఇంగ్లాండ్‌ వెళ్తున్నాం. ఇంగ్లాండుతో ఆడే రెండు టెస్టులు కివీస్‌కు అనుభూతిని ఇస్తాయి. అదే సమయంలో వారి మ్యాచులు చూడటం మాకు విలువైన పాఠాలు అవుతాయి. ప్రపంచంలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగే మ్యాచులు చూడటం, పాత వీడియోలు చూడటం ప్రయోజనకరం’ అని యాష్‌ వెల్లడించాడు.

ప్రస్తుతం భారత జట్టు ముంబయిలో క్వారంటైన్‌ అయిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌ వెళ్లాక మళ్లీ మూడు రోజుల క్వారంటైన్‌లో ఉండి, సాధన మొదలు పెడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని