IND vs AFG: అఫ్గాన్తో మ్యాచ్.. అశ్విన్కు బదులు శార్దూల్ అయితే బెటర్: మాజీ క్రికెటర్
పేరుకే పసికూన.. మైదానంలోకి దిగితే పెద్ద జట్లకూ చెమటలు పట్టించగల టీమ్ అఫ్గానిస్థాన్. అలాంటి జట్టుతో దిల్లీ మైదానం వేదికగా భారత్ (IND vs AFG) ఇవాళ తలపడనుంది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) భారత్ రెండో మ్యాచ్కు సిద్ధమైంది. దిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్తో టీమ్ఇండియా (IND vs AFG) తలపడనుంది. బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే ఈ మైదానంలో అదనంగా మరొక బ్యాటర్తో బరిలోకి దిగితే బాగుంటుందని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించాడు. అందుకోసం ఒక స్పిన్నర్ను తగ్గించుకుని పేస్ ఆల్రౌండర్ను తీసుకోవాలని పేర్కొన్నాడు. దిల్లీ మైదానం బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని.. స్పిన్నర్ల ప్రభావం చాలా తక్కువని తెలిపాడు. దక్షిణాఫ్రికా - శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ ఇందుకు ఉదాహరణగా వెల్లడించాడు. అయితే, అఫ్గాన్ జట్టులో స్పిన్నర్లే కీలకమని.. వారితో భారత బ్యాటర్లకు సవాల్ తప్పదని వ్యాఖ్యానించాడు.
‘‘హార్దిక్ పాండ్య పూర్తి స్థాయి పేసర్గా అనిపించడం లేదు. అతడిని మూడో ఫాస్ట్ బౌలర్గా పరిగణించలేం. అతడు ఒత్తిడిగా భావిస్తున్నాడు. ఇది ఆసీస్తో మ్యాచ్లో స్పష్టంగా కనిపించింది. ఇక దిల్లీ పిచ్ బ్యాటింగ్కు స్వర్గధామం. మరీ ముఖ్యంగా స్పిన్నర్లకు సహకారం చాలా తక్కువ. కాబట్టి, అఫ్గాన్తో మ్యాచ్కు రవిచంద్రన్ అశ్విన్కు చోటు దక్కడం కష్టమే. భారత్ తన బ్యాటింగ్ ఆర్డర్ను పెంచుకోవాలి. అదే విధంగా పేస్ బౌలింగ్ను కూడా పటిష్ఠం చేసుకోవాలి. అందుకోసం అశ్విన్కు బదులు శార్దూల్ ఠాకూర్ లేదా మహమ్మద్ షమీని తీసుకోవడం ఉత్తమం’’ అని సంజయ్ మంజ్రేకర్ తెలిపాడు.
దిల్లీ మైదానంలో దక్షిణాఫ్రికా- శ్రీలంక మ్యాచ్లో భారీగా పరుగులు నమోదయ్యాయి. తొలుత సౌతాఫ్రికా 428/5 స్కోరు సాధించగా.. అనంతరం లక్ష్య ఛేదనలో 326 పరుగులు చేసింది. దీంతో ఒకే మ్యాచ్లో 750కిపైగా పరుగులు నమోదు కావడం గమనార్హం. దక్షిణాఫ్రికా జట్టులో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు బాదారు. ఆసీస్తో జరిగిన మ్యాచ్లో భారత టాప్ -3 బ్యాటర్లు డకౌట్గా వెనుదిరిగిన సంగతి తెలిసింది. బ్యాటింగ్కు అనుకూలమైన ట్రాక్పై ఈ సారి చెలరేగాలని అభిమానులు ఆశిస్తున్నారు. అఫ్గాన్ను తక్కువగా అంచనా వేస్తే బోల్తా పడక తప్పదు. బలమైన జట్లకు షాకిచ్చే సత్తా ఆ జట్టు సొంతం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
చెన్నై జట్టుకు గాయాలు ఇబ్బందిగా మారాయి. యువ పేసర్ పతిరన గాయం కారణంగా స్వదేశానికి వెళ్లిపోయాడు. -
డోపింగ్ శాంపిల్కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!
డోపింగ్ పరీక్షకు శాంపిల్ ఇవ్వని కారణంగా రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) సస్పెన్షన్ వేటు వేసింది. -
కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్నా.. ఆడతానని అనుకోలేదు: సిరాజ్
ఐపీఎల్ 17వ సీజన్లో సిరాజ్ తొలిసారి అత్యుత్తమ బౌలింగ్తో ప్రత్యర్థిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. బెంగళూరు విజయంలో కీలక పాత్ర పోషించాడు. -
ఒకే సమయంలో వచ్చే ఏడాది ఐపీఎల్ - పీఎస్ఎల్..! కారణమిదేనా?
క్రికెట్ అభిమానులను అలరించడానికి ప్రతి దేశం ఓ లీగ్ను నిర్వహించేందుకు ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే భారత్లో ఐపీఎల్, పాక్లో పీఎస్ఎల్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే, వచ్చే ఏడాది ఈ రెండు ఒకే సమయంలో జరిగే అవకాశం ఉంది. -
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
బెంగళూరు చేతిలో ఓటమితో గుజరాత్ కూడా ప్లేఆఫ్స్ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది. స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. -
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్కు సోషల్ మీడియాలో బాడీ షేమింగ్ ఎదురైంది. అతడూ ఘాటుగానే సమాధానం ఇచ్చాడు. -
బెంగళూరు హ్యాట్రిక్
ఎక్కడైతే ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు రికార్డు నమోదైందో.. ఎక్కడైతే బౌండరీల వరద పారుతుందో.. అక్కడ గుజరాత్ టైటాన్స్ పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు కుదేలై కేవలం 147 పరుగులకే కుప్పకూలింది. -
కప్పులో ఇలాగే ఆడితే..?
హార్దిక్ పాండ్య.. కపిల్ దేవ్ తర్వాత ఆ స్థాయిని అందుకోగల నాణ్యమైన ఆల్రౌండర్గా అంచనాలు పెంచిన ఆటగాడు. వివిధ ఫార్మాట్లలో కొన్ని సంచలన ఇన్నింగ్స్లు.. అప్పుడప్పుడూ బౌలింగ్ మెరుపులతో భవిష్యత్తుపై ఎంతో ఆశలు రేకెత్తించాడీ ఆల్రౌండర్. -
ఐఎస్ఎల్ ఛాంప్ ముంబయి
ముంబయి సిటీ ఎఫ్సీ రెండోసారి ఐఎస్ఎల్ టైటిల్ను గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్పై విజయం సాధించింది. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ జోర్గె పెరెర్యా దియాజ్ (53వ) గోల్తో ముంబయి స్కోరు సమం చేసింది. -
భారత్ ఖాతాలో 43 పతకాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల్లో 43 పతకాలను ఖాయం చేశారు. శనివారం అండర్-22 విభాగంలో ఆకాశ్ గోర్కా (60 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ప్రీత్ మలిక్ (67 కేజీలు) స్వర్ణ పోరుకు అర్హత సాధించారు. -
ధోని నా తండ్రి లాంటోడు..
ధోని తనకు తండ్రి లాంటి వాడని ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్కు ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్బౌలర్ పతిరన అన్నాడు. అతడి చిన్నచిన్న సలహాలు తనకెంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చాయని చెప్పాడు. 2022లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన 21 ఏళ్ల పతిరన.. ఆ తర్వాత చెన్నైకి కీలక బౌలర్గా ఎదిగాడు. -
ఆ హిట్టింగ్కు ఈ స్టేడియాలా?
ప్రస్తుత బ్యాటర్ల పవర్ హిట్టింగ్కు పాత కాలం నాటి స్టేడియాల పరిమాణం సరిపోదని ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ఐపీఎల్-17లో తరుచూ 200పైన స్కోర్లు నమోదవుతున్న నేపథ్యంలో అతడిలా వ్యాఖ్యానించాడు. -
జట్టు ఎంపికలో కృత్రిమ మేధ
ఏ క్రీడలోనైనా ఆటగాళ్ల ఫామ్, ఫిట్నెస్, ప్రత్యర్థిని చూసి సెలక్టర్లు జట్టును ఎంపిక చేస్తారు. కానీ ఇప్పుడా పని కృత్రిమ మేధ (ఏఐ) చేస్తోంది. అవును.. ఇది నిజం. పిచ్ పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు, అందుకు తగ్గట్లు కూర్పు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని మైదానంలో బరిలో దిగే తుది జట్టును ఏఐ నిర్ణయిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారిన ట్రెండ్.. ఎన్నికల వేళా ఐపీఓల సందడి!
-
రోజా కామెంట్స్పై స్పందించిన గెటప్ శ్రీను.. ఏమన్నారంటే?
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న