Rahul Dravid : ప్రసిద్ధ్ కృష్ణను ఎందుకు తీసుకున్నామంటే.. వివరించిన రాహుల్ ద్రవిడ్
గాయం కారణంగా ప్రపంచకప్ టోర్నీకి హార్దిక్ పాండ్య దూరమయ్యాడు. అతడి స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకున్నారు. ఇందుకు గల కారణాలను హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) వివరించాడు.
ఇంటర్నెట్ డెస్క్ : ఈ ప్రపంచకప్(ODI World Cup 2023)లో అజేయంగా దూసుకుపోతున్న టీమ్ ఇండియా(Team India).. తనలాగే ఉత్తమ ప్రదర్శన చేస్తున్న దక్షిణాఫ్రికాతో నేడు తలపడనుంది. దీంతో ఈ పోరు(IND vs SA) రసవత్తరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే.. గాయం కారణంగా టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య(Hardik Pandya) ఈ ప్రపంచకప్ టోర్నీ మొత్తానికి దూరమైన విషయం తెలిసిందే. అతడి స్థానంలో జట్టులోకి ప్రసిద్ధ్ కృష్ట(Prasidh Krishna)ను తీసుకున్నారు. దీనిపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) వివరణ ఇచ్చాడు. అతడి ఎంపికకు గల కారణాలను వివరించాడు. టీమ్ఇండియా పేస్ బౌలింగ్ వనరులను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.
‘ఇది మంచి ఆలోచన. మేం ముగ్గురు ఫాస్టబౌలర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్లో ఆడాం. 15 మందితో కూడిన జట్టులో మాకు స్పిన్ బ్యాకప్(అశ్విన్) ఉంది. అలాగే ఆల్రౌండర్(శార్దూల్ ఠాకూర్) బ్యాకప్ ఉంది. అయితే.. ఫాస్ట్ బౌలింగ్ బ్యాకప్ లేదు. ఎవరైనా అనారోగ్యం బారిన పడ్డా, గాయపడ్డా.. అందుకోసం బ్యాకప్ అవసరమని గుర్తించాం. ఇది ఇతర కాంబినేషన్లతో ఆడేందుకు మాకు ఉపయోగపడుతుంది’ అని ద్రవిడ్ వివరించాడు.
అక్టోబర్ 19న పుణెలో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో బౌలింగ్ చేస్తుండగా గాయపడిన హార్దిక్.. ఆ తర్వాత మళ్లీ బరిలో దిగలేదు. సెమీఫైనల్ నాటికి అతడు అందుబాటులోకి వస్తాడని అనుకున్నా.. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో టోర్నీ మొత్తానికి దూరం కాక తప్పలేదు. ఇక ప్రసిద్ధ్ కృష్ణ ఇప్పటి వరకూ 17 వన్డేలు ఆడి 29 వికెట్లు తీశాడు. ఈ ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లోనూ ఆడాడు.
ఇక ప్రస్తుతం టీమ్ఇండియాలో పేస్ త్రయం బుమ్రా, షమి, సిరాజ్ అదరగొడుతుండడంతో.. వీరిలో ఎవరికైనా గాయమైతే తప్ప ప్రసిద్ధ్కి తుది జట్టులో చోటు దక్కకపోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..