IND vs PAK: సచిన్ వికెట్ కోసం రెండు ఫ్రేమ్లు కట్ చేశారు: పాక్ మాజీ స్పిన్నర్
టీమ్ఇండియా ఛాంపియన్గా నిలిచిన వన్డే ప్రపంచకప్ 2011 (ODI World Cup) మెగా టోర్నీలో సచిన్ కీలక ఇన్నింగ్స్లు ఆడిన సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా పాక్పై మరింత చెలరేగే సచిన్ (Sachin) ఎల్బీ విషయంలో దాయాది దేశం మాజీ స్పిన్పర్ ఇప్పటికీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ - పాకిస్థాన్ (IND vs PAK) జట్ల మధ్య మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఫ్యాన్స్ ఎంత ఉత్సాహంగా ఉంటారో.. ఇరు జట్ల ఆటగాళ్లు కూడా అంతే ఒత్తిడికి గురవుతుంటారు. వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) టోర్నీల్లో పాక్పై భారత్దే ఆధిక్యం. ధోనీ సారథ్యంలో 2011 ప్రపంచకప్ను టీమ్ఇండియా (Team India) నెగ్గిన విషయం తెలిసిందే. సెమీస్లో పాక్ను ఓడించి మరీ ఫైనల్కు దూసుకెళ్లింది. అయితే, ఆ మ్యాచ్ సందర్భంగా క్రికెట్ దిగ్గజం సచిన్ ఎల్బీపై నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. పాక్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇప్పటికీ ఆ నిర్ణయం సరైంది కాదనే వాదిస్తున్నాడు.
‘‘భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ 2011 మెగా టోర్నీలో ఆడాను. సచిన్ తెందూల్కర్ వికెట్పై వివాదాస్పదమైన నిర్ణయం గుర్తుండే ఉంటుంది. నేను ఇప్పటికీ దానిని ఔట్గానే భావిస్తా. గతంలో అంపైర్ ఇయాన్ గౌల్డ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. థర్డ్ అంపైర్ సమీక్ష సందర్భంగా చివరి రెండు ఫ్రేమ్లను కట్ చేసి బంతి స్టంప్స్ను తాకకుండా పక్కకు వెళ్లినట్లు చూపించారు. నేను సంధించిన ఆ బంతి నేరుగా మిడిల్ స్టంప్నే తాకేది’’ అని అజ్మల్ వ్యాఖ్యానించాడు.
వన్డే ప్రపంచకప్ 2011 సెమీస్లో భారత్ తొలుత 260/9 స్కోరు చేసింది. ఈ మ్యాచ్లో సచిన్ 85 పరుగులు చేశాడు. ఛేదనలో పాక్ 231 పరుగులకే ఆలౌటైంది. అయితే, సచిన్ 23 పరుగుల వద్ద ఉన్నప్పుడు సయీద్ అజ్మల్ వేసిన బంతిని ఆడబోయి మిస్ కావడంతో ప్యాడ్లను తాకింది. బౌలర్ అప్పీలు చేయడంతో అంపైర్ ఇయాన్ గౌల్డ్ ఔట్గా ప్రకటించాడు. ఔట్పై సమీక్ష తీసుకొనేందుకు నాన్స్ట్రైకర్లో ఉన్న గౌతమ్ గంభీర్తో సచిన్ తెందూల్కర్ చర్చించాడు. గంభీర్ కూడా కాస్త అనుమానంగా ఉన్నప్పటికీ.. సచిన్ మాత్రం నమ్మకంతో డీఆర్ఎస్కు వెళ్లాడు. సమీక్షలో బంతి వికెట్లను తాకడం లేదని తేలడంతో సచిన్ నాటౌట్గా తన ఇన్నింగ్స్ను కొనసాగించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!