Prithvi Shaw: నెల రోజుల వ్యవధి.. చాలా కష్టపడ్డా.. ఫలితం సాధించా: పృథ్వీ షా
దిల్లీ చేతిలో ఓటమితో పంజాబ్ కింగ్స్ (PBKS vs DC) ప్లేఆఫ్స్ అవకాశాలకు గండి పడింది. ఇక తన చివరి మ్యాచ్లోనూ (రాజస్థాన్తో) గెలిచినా ప్రయోజనం శూన్యం. దాదాపు ఇంటిముఖం పట్టినట్లే.
ఇంటర్నెట్ డెస్క్: దిల్లీ క్యాపిటల్స్ యువ బ్యాటర్ పృథ్వీ షా (54: 38 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్) ఈ సీజన్లో తొలిసారి అర్ధశతకంతో రాణించాడు. దీంతో పంజాబ్ కింగ్స్పై దిల్లీ 213/2 స్కోరు చేసింది. దాదాపు నెల రోజుల తర్వాత దిల్లీ తరఫున పృథ్వీ బరిలోకి దిగాడు. ఆరంభంలో వరుసగా ఆడిన మ్యాచుల్లో విఫలమై విమర్శలపాలయ్యాడు. ఈ మ్యాచ్కు ముందు చివరిసారిగా ఏప్రిల్ 20న కోల్కతాతో ఆడాడు. ఆ తర్వాత ఇప్పుడే తుది జట్టులోకి వచ్చాడు. ఈ క్రమంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని హాఫ్ సెంచరీ బాదాడు. మరోవైపు పంజాబ్ చివరి వరకు పోరాడినా 198/8కే పరిమితమై ఓటమిపాలైంది. ఈ క్రమంలో తన ప్రదర్శనపై పృథ్వీ షా సంతోషం వ్యక్తం చేశాడు. మరో బ్యాటర్ రోసోవ్ (82*: 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్లు) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అతడికే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు వచ్చింది.
‘‘చాలా రోజుల తర్వాత మంచి ఇన్నింగ్స్ ఆడటం ఆనందంగా ఉంది. ఇలా ఆడాలంటే కొన్నిసార్లు తీవ్రంగా శ్రమించాలి. ఈ మ్యాచ్ కోసం చాలా కష్టపడ్డా. పిచ్ బాగుంది. ఆరంభంలో కాస్త పేస్కు అనుకూలంగా అనిపించినా.. బ్యాటింగ్కు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. తేమ ప్రభావం మ్యాచ్ ప్రారంభం నుంచే ఉంది. ఫీల్డర్ల మధ్య ఖాళీలను గుర్తించి ఆడగలితే సులువుగానే పరుగులు రాబట్టవచ్చు’’ అని షా తెలిపాడు.
ఫీల్డింగ్ బాగోలేదు: డేవిడ్ వార్నర్
‘‘విజయం సాధించడం ఆనందంగా ఉన్నప్పటికీ.. మా ఫీల్డింగ్ సరిగా లేదనిపించింది. క్యాచ్లను చేజార్చాం. పృథ్వీ షా ఇంపాక్ట్ చూపాడు. రిలీ రోసోవ్ అద్భుతంగా ఆడాడు. మా సొంత మైదానాల్లో నిలకడగా ఆడాల్సిన అవసరం ఉంది. చివరి మ్యాచ్ చెన్నైతో దిల్లీ వేదికగానే ఆడతాం’’ అని వార్నర్ చెప్పాడు.
నిరుత్సాహపరిచింది: ధావన్
‘‘కీలక సమయంలో ఓటమిని చవిచూడటం నిరుత్సాహానికి గురి చేసింది. తొలుత బౌలింగ్లో కాస్త వెనుకబడ్డాం. కొన్ని వికెట్లను తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి తేవాల్సింది. కానీ, అలా జరగలేదు. చివరి ఓవర్ను స్పిన్నర్తో వేయించడం కూడా మిస్ఫైర్ అయింది. ఆ ఓవర్లో ఏకంగా 23 పరుగులు వచ్చాయి. ఓ రెండు ఓవర్లు మాత్రం భారీగా పరుగులు సమర్పించడంతో దిల్లీ పెద్ద స్కోరు చేసేసింది. ఇక లక్ష్య ఛేదన సమయంలో తొలి ఓవర్లోని ఆరు బంతులను వృథా చేసేశాం. నేను కూడా ఎదుర్కొన్న మొదటి బంతికే పెవిలియన్కు చేరా. అయితే, మా బ్యాటర్ లియాన్ లివింగ్స్టోన్ పోరాటం అద్భుతం. చివర్లో నోబాల్ పడినప్పుడు కాస్త ఆశలు చిగురించాయి. దురదృష్టవశాత్తూ విజయం సాధించలేకపోయాం’’ అని పంజాబ్ కెప్టెన్ ధావన్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
T20 jersey: టీ20 ప్రపంచకప్ టోర్నీకి టీమ్ఇండియా జెర్సీల ధరను అడిడాస్ ప్రకటించింది. -
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్య జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. పాక్లో టీమ్ఇండియా పర్యటిస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
టీమ్ఇండియా బ్యాటర్ శివమ్ దూబె (Shivam Dube)పై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చే టీ20 ప్రపంచకప్లో పవర్ఫుల్ హిట్టింగ్తో అలరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి