CSK vs PBKS: ఆ రెండు ఓవర్లే.. మ్యాచ్ను మాకు దూరం చేశాయి: ఎంఎస్ ధోనీ
ఐపీఎల్లో (IPL 2023) చెన్నై సూపర్ కింగ్స్కు మరో ఓటమి ఎదురైంది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సీఎస్కేపై పంజాబ్ కింగ్స్ (CSK vs PBKS) విజయం సాధించింది. ఈ ఓటమిపై ధోనీ స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ను (CSK) ఓడించడం సాధారణ విషయం కాదు. అలాంటి ఫీట్ను మొన్న రాజస్థాన్ తర్వాత తాజాగా పంజాబ్ కింగ్స్ (PBKS) సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో చివరి బంతికి పంజాబ్ లక్ష్య ఛేదన పూర్తి చేసి సంచలనం సృష్టించింది. సీఎస్కే నిర్దేశించిన 201 పరుగుల టార్గెట్ను సరిగ్గా 20 ఓవర్లలోనే ఆరు వికెట్లను కోల్పోయి ఛేదించింది. చివరి బంతికి మూడు పరుగులు అవసరం కాగా.. పతిరాణా వేసిన బంతిని సికందర్ రజా బ్యాక్వర్డ్ స్క్వేర్ దిశగా పంపించి మూడు రన్స్ తీసేశాడు. ఈ మ్యాచ్లో విజయం సాధించి ఉంటే చెన్నై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉండేది. ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత మెరుగయ్యేవి. ఇప్పుడు పంజాబ్ విజయం సాధించడంతో సీఎస్కే నాలుగో స్థానానికే పరిమితమైంది. పంజాబ్ కింగ్స్ ఆరో స్థానం నుంచి ఐదుకు ఎగబాకింది.
మరికొన్ని చేసి ఉంటే..: సీఎస్కే సారథి
తమ ఓటమికి బ్యాటింగ్లో ఇంకొన్ని పరుగులు చేయకపోవడమే కారణమని సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపాడు. ‘‘మేం బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మరికొన్ని పరుగులను అదనంగా చేయాల్సింది. కనీసం మరో 15 పరుగులు చేసి ఉంటే బాగుండేది. మా బ్యాటర్లు స్థిరంగా పరుగులు రాబట్టారు. ఈ పిచ్ మీద 200 పరుగులు మంచి లక్ష్యమే అవుతుంది. అయితే, మా బౌలింగ్ కూడా మెరుగవ్వాల్సిన అవసరం ఉంది. రెండు ఓవర్లు మా ఫలితాన్ని మార్చేశాయి. సమస్య ఎక్కడుందో సమీక్షించుకోవాలి. మా ప్రణాళికలో ఏదైనా పొరపాటు ఉందా? ప్లాన్ను అమలు చేయడంలో లోపాలు ఉన్నాయా? అనేది తెలుసుకుంటాం. పతిరాణా చాలా అద్భుతంగా బౌలింగ్ వేశాడు’’ అని ధోనీ అన్నాడు. దేశ్పాండే వేసిన 16వ ఓవర్లో ఏకంగా 24 పరుగులు... ఆ తర్వాతి ఓవర్లోనే జడేజా 17 పరుగులు సమర్పించాడు. ధోనీ ఈ రెండు ఓవర్ల గురించే వ్యాఖ్యానించాడు. ఇక 19వ ఓవర్లోనూ పాండే మరో 13 పరుగులు ఇచ్చాడు. దీంతో పంజాబ్ బ్యాటర్లు కేవలం 18 బంతుల్లోనే 54 పరుగులను రాబట్టారు.
ఇది ఎంతో ప్రత్యేకం: ధావన్
‘ఈ విజయం ఎంతో ప్రత్యేకమైంది. చెపాక్లో చెన్నైను ఓడించడం అతిపెద్ద విషయం. మా ఆటగాళ్లు అద్భుతమైన పోరాట పటిమను కనబరిచారు. గత మ్యాచ్లో ఘోర ఓటమి తర్వాత పుంజుకుని గెలవడం ఎంతో బాగుంది. మా బౌలర్లు కూడా తమవంతు కృషి చేశారు. ఛేదనలో లియామ్ లివింగ్స్టోన్ టచ్లోకి రావడం ఆనందంగా ఉంది. అందరూ ఉత్తమంగా ఆడటం శుభసూచికం’’ అని పంజాబ్ కెప్టెన్ ధావన్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
-
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!