Punjab X Mumbai: అశుతోష్ అదరగొట్టినా.. ముంబయిదే విజయం
పంజాబ్తో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయి 9 పరుగుల తేడాతో గెలుపొందింది. 193 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన పంజాబ్ 19.1 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌట్ అయింది.
ముల్లన్పుర్: ఐపీఎల్ 2024లో ముంబయి థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. పంజాబ్తో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయి 9 పరుగుల తేడాతో గెలుపొందింది. 193 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన పంజాబ్ 19.1 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌట్ అయింది. అశుతోష్ శర్మ (61; 28 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్లు) సిక్సర్లతో విరుచుకుపడి పంజాబ్ను గెలిపించినంత పనిచేశాడు. శశాంక్ సింగ్ (41; 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లు) చెలరేగి ఆడాడు. జస్ప్రీత్ బుమ్రా (3/21), గెరాల్డ్ కొయెట్జీ (3/32) పంజాబ్ను దెబ్బకొట్టారు. ఆకాశ్ మధ్వాల్, హార్దిక్ పాండ్య, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ పడగొట్టారు.
లక్ష్యఛేదనలో బుమ్రా, కొయెట్జీ దెబ్బకు పంజాబ్ 14 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. సామ్ కరన్ (6), ప్రభ్సిమ్రన్ సింగ్ (0), రిలీ రొసోవ్ (1), లివింగ్స్టన్ (1) వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. హర్ప్రీత్ సింగ్ భాటియా (13) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ దూకుడుగా ఆడి పంజాబ్ శిబిరంలో ఆశలు రేపారు. అయితే 111 పరుగుల వద్ద ఏడో వికెట్గా శశాంక్ వెనుదిరిగినప్పటికీ అశుతోష్ పట్టువదలకుండా పోరాడాడు. దీంతో పంజాబ్ లక్ష్యం 18 బంతుల్లో 25 పరుగులుగా మారింది. ఈ తరుణంలో 17.1 ఓవర్ల వద్ద కొయెట్జీ బౌలింగ్లో అశుతోష్ ఔట్ అయ్యాడు. ఈ ఓవర్లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. ఇక 19వ ఓవర్లో హార్దిక్ పాండ్య.. హర్ప్రీత్ బ్రార్ (21)ను ఔట్ చేశాడు. ఐదో బంతికి రబాడ సిక్స్ కొట్టడంతో ఈ ఓవర్లో మొత్తం 11 పరుగులు వచ్చాయి. దీంతో పంజాబ్ విజయ సమీకరణం 6 బంతుల్లో 12 పరుగులుగా మారింది. ఈ సమయంలో ఇరు జట్లలోనూ ఉత్కంఠ తారా స్థాయికి చేరింది. 20 ఓవర్ను మధ్వాల్ వేశాడు. తొలి బంతి వైడ్ పడింది. రెండో బంతికి రెండు పరుగులు తీసే క్రమంలో రబాడ రనౌట్ అయ్యాడు. అంతే ఇక ముంబయి శిబిరంలో ఆనందం వెల్లువెత్తింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. వన్డౌన్లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (78: 53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లు) దుమ్మురేపాడు. రోహిత్శర్మ (36: 25 బంతుల్లో 3 సిక్స్లు, 2 ఫోర్లు), తిలక్ వర్మ (34: 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) చెలరేగారు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, సామ్ కరన్ 2, రబాడ ఒక వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పంత్కు ఓటు.. సంజుకు చోటు
రిషబ్ పంత్ పోరాటం ఫలించింది.. శాంసన్ నిరీక్షణకు తెరపడింది.. యువకెరటం యశస్వి జైస్వాల్ కోరిక తీరనుంది..! వెస్టిండీస్-అమెరికా ఆతిథ్యమిచ్చే టీ20 ప్రపంచకప్ కోసం వీరంతా విమానమెక్కనున్నారు. -
కప్పు కొట్టే జట్టేనా..?
టీ20 ఫార్మాట్ అంటే కుర్రాళ్లదే.. చాలామంది సిద్ధాంతం ఇదే. రెండేళ్ల కిందట బీసీసీఐ ప్రణాళిక ఇలానే సాగింది. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో టీమ్ఇండియా ఘోర పరాజయం చవిచూడటంతో... స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో భారమే అనుకున్న జట్టు మేనేజ్మెంట్ వారిద్దరిని పక్కనబెట్టింది. -
లఖ్నవూ సిక్సర్
ముంబయి ప్లేఆఫ్స్ ఆశలు ఇక కనుమరుగైనట్లే! స్లో పిచ్పై ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేయడం.. ఆపై కుదురుగా ఆడి లక్ష్యాన్ని ఛేదించడం అలవాటుగా మార్చుకున్న లఖ్నవూ సూపర్ జెయింట్స్.. ఈసారి ముంబయిని దెబ్బతీసింది. -
భారత అమ్మాయిలదే రెండో టీ20
బంగ్లాదేశ్లో భారత అమ్మాయిల జోరు కొనసాగుతోంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. -
చైనా చేతిలో భారత్ ఓటమి
ఉబెర్కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఇప్పటికే క్వార్టర్ఫైనల్స్ చేరిన భారత అమ్మాయిల జట్టు.. చివరి గ్రూప్ మ్యాచ్లో చిత్తుగా ఓడింది. -
బట్లర్ సారథ్యంలో ఇంగ్లాండ్..
లండన్: 2022 టీ20 ప్రపంచకప్ను దేశానికి అందించిన జోస్ బట్లర్ సారథ్యంలో మరోసారి ఇంగ్లాండ్ అదృష్టం పరీక్షించుకోనుంది. -
పృథ్వీషాకి సమన్లు
యువ బ్యాటర్ పృథ్వీషాకి ముంబయి సెషన్స్ కోర్టు సమన్లు జారీ చేసింది. సామాజిక మాధ్యమ ప్రభావశీలి స్వప్న గిల్ దాఖలు చేసిన రివ్యూ పిటీషన్ను విచారించిన న్యాయస్థానం ఈ ఉత్తర్వులు వెలువరించింది.