Rahul Dravid: 2022లోనేద్రవిడ్కు అసలైన పరీక్ష..!
భారత్లో కిక్రెట్ను ఒక మతంలా ఆరాధిస్తే.. క్రికెటర్లను దేవుళ్లతో సమానంగా పూజిస్తారు.. నిత్యం వారు ఏమి చేసినా సంచలనంగానే ఉంటుంది. కానీ...
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం: భారత్లో కిక్రెట్ను ఒక మతంలా ఆరాధిస్తే.. క్రికెటర్లను దేవుళ్లతో సమానంగా పూజిస్తారు.. నిత్యం వారు ఏమి చేసినా సంచలనంగానే ఉంటుంది. కానీ, ఈ హంగూ ఆర్భాటాలకు దూరంగా ఉంటాడు టీమ్ఇండియా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్. అప్పగించిన బాధ్యతలను క్రమశిక్షణ, అంకితభావంతో శ్రద్ధగా నిర్వహించడమే అతడి ప్రత్యేకత. మైదానంలో ఉన్నప్పుడు మెరుపులూ లేవు.. ప్రత్యర్థులు కవ్విస్తే ఉరుములూ ఉండవు. కానీ, నిశ్శబ్దంగా తన పని తాను పూర్తి చేస్తూ జట్టుకు ‘గోడ’లా నిలబడటమే ఆ దిగ్గజ బ్యాట్స్మన్ నైజం. అది ఆటగాడిగానైనా.. ఇప్పుడు టీమ్ఇండియా కోచ్గానైనా. భారత క్రికెట్కు తన శక్తియుక్తులు ధారపోస్తున్న ద్రవిడ్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ‘ది వాల్’పై ప్రత్యేక కథనం.
నిరూపించుకొనే వచ్చాడు..
ఈ టీమ్ఇండియా మాజీ సారథి ఇప్పటికే వివిధ జట్లకు కోచ్గా పనిచేసి సత్తాచాటాడు. 2012లో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పిన అతడు తర్వాత కోచ్గా మారాడు. ఈ క్రమంలోనే 2014 నుంచి రెండేళ్ల పాటు ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు తొలి సేవలు అందించాడు. ఆపై 2016లో అండర్-19, భారత్- ఎ జట్లకు కోచ్గా వ్యవహరించాడు. దీంతో ఇప్పుడు టీమ్ఇండియాలో సత్తా చాటుతున్న యువ ఆటగాళ్లంతా అతడి కనుసన్నల్లోనే వెలుగులోకి వచ్చారు. అందులో పృథ్వీషా, శుభ్మన్గిల్, రిషభ్ పంత్, మహ్మద్ సిరాజ్ లాంటి ఆటగాళ్లు ఉన్నారు. ద్రవిడ్ శిక్షణలోనే 2016 అండర్-19 ప్రపంచకప్లో టీమ్ఇండియా రన్నరప్గా నిలిచింది. ఇక 2018లో ఏకంగా కప్పు అందుకొని సంచలనం సృష్టించింది. ఆ సమయంలోనే సీనియర్ జట్టుకు కోచ్గా వ్యవహరించాలని బీసీసీఐ కోరినా.. సున్నితంగా తిరస్కరించాడు. అనంతరం 2019 నుంచి జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్గా పని చేసిన వాల్.. చివరికి గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్ఇండియా హెడ్కోచ్ బాధ్యతలు స్వీకరించాడు.
దక్షిణాఫ్రికా అసలైన పరీక్ష..
ద్రవిడ్ గతేడాది చివర్లో టీమ్ఇండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. 2021 టీ20 ప్రపంచకప్తో రవిశాస్త్రి పదవీకాలం పూర్తవడంతో తర్వాత స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టీ20, టెస్టు సిరీస్లకు ద్రవిడ్ తొలిసారి జాతీయ జట్టు బాధ్యతలు తీసుకున్నాడు. ఈ క్రమంలోనే భారత్ అటు పొట్టి సిరీస్ను, ఇటు టెస్టు సిరీస్ను కైవసం చేసుకొని రాణించింది. దీంతో కోచ్గా ద్రవిడ్ తొలి అడుగు బలంగానే వేశాడు. ఇక ఇప్పుడు టీమ్ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనలో ఉండగా.. ఇక్కడే అసలు పరీక్ష ఎదురుకానుంది. సెంచూరియన్లో జరిగిన తొలి టెస్టులో భారత్ చరిత్ర తిరగరాస్తూ అక్కడ తొలిసారి టెస్టు విజయం రుచిచూసింది. ఇక జోహానెస్బర్గ్లో జరిగిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పట్టుదలగా ఆడి విజయం సాధించడంతో సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా మారింది. దీంతో మూడో టెస్టు రసవత్తరంగా మారింది. అయితే, టీమ్ఇండియా ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే తొలిసారి సఫారీల గడ్డపై టెస్టు సిరీస్ సాధించి చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. ఇది జరగాలంటే కోహ్లీసేన విశేషంగా రాణించాలి. అది నిజమైతే కోచ్గా ద్రవిడ్ తొలి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసినట్లే.
ముందుంది మెగా ఈవెంట్..
టీమ్ఇండియా ఈ దక్షిణాఫ్రికా పర్యటనను విజయవంతంగా పూర్తి చేస్తే ద్రవిడ్ కీర్తి ప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి. ఎందుకంటే భారత్ 2018-19 ఆస్ట్రేలియా పర్యటన వరకూ దాని సొంత గడ్డపై టెస్టు సిరీస్ గెలిచింది లేదు. కానీ, మాజీ కోచ్ రవిశాస్త్రి పర్యవేక్షణలో అక్కడ వరుసగా రెండు సిరీస్లు కైవసం చేసుకొని సంచలనం సృష్టించింది. దీంతో శాస్త్రి కెరీర్లో ఈ రెండు సిరీస్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాగే దక్షిణాఫ్రికా గడ్డపైనా భారత్ ఇప్పటివరకు టెస్టు సిరీస్ సాధించింది లేదు. దీంతో టెస్టు హోదా కలిగిన జట్లలో ఈ ఒక్క దేశంలోనే భారత్ సిరీస్ గెలవలేదు. ఈ మూడో టెస్టులో గెలుపొందితే.. శాస్త్రి లాగే ద్రవిడ్కు సైతం ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే సిరీస్గా మిగిలిపోతుంది. మరోవైపు గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో వాయిదా పడిన చివరి టెస్టును సైతం భారత్ ఈ ఏడాది సొంతం చేసుకుంటే ద్రవిడ్ కెరీర్లో మరో కలికితురాయి చేరినట్లు అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే భారత్ ఆ సిరీస్లో 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. దీంతో ఐదో టెస్టును కూడా గెలుపొందితే 3-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకుంటుంది. దీంతో ద్రవిడ్ ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్ గెలిచిన భారత కెప్టెన్గా, కోచ్గా కొత్త ఘనత సాధిస్తాడు. వీటికి తోడు భారత్ ఈ ఏడాది ఐసీసీ 2022 టీ20 ప్రపంచకప్ కూడా ఆడుతుంది. ఆస్ట్రేలియాలో జరిగే ఆ మెగా ఈవెంట్ను కూడా సాధిస్తే ద్రవిడ్కు తిరుగుండదు. దీంతో ఈ ఏడాది అతడికి సవాళ్లతో కూడుకున్నదిగా మారింది. ఏదేమైనా ఇప్పటికే యవకులను మ్యాచ్ విన్నర్లుగా తీర్చిదిద్దిన ‘ది వాల్’ రాబోయే రోజుల్లో టీమ్ఇండియాను మరింత బలోపేతం చేస్తాడని ఆశిద్దాం. హ్యాపీ బర్త్డే రాహుల్ ద్రవిడ్..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!