భారత్‌×ఆసీస్ మ్యాచ్‌కు అంతరాయం

బ్రిస్బేన్‌ వేదికగా భారత్×ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు‌కు అంతరాయం కలిగింది. వర్షం పడటంతో ఆటగాళ్లు..

Updated : 18 Jan 2021 12:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్రిస్బేన్‌ వేదికగా భారత్×ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఆఖరి టెస్టు‌కు అంతరాయం కలిగింది. వరుణుడు అడ్డంకిగా మారడంతో ఆటగాళ్లు మైదానాన్ని వీడారు. మైదాన సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. నాలుగో రోజు ఆటలో ఇంకా 23 ఓవర్లు మిగిలి ఉన్నాయి. ఛేదన మొదలుపెట్టిన భారత్‌ 4/0తో నిలిచింది. క్రీజులో రోహిత్ (4), గిల్ ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 21/0తో ఆటను ఆరంభించిన ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైంది. సిరాజ్ అయిదు, శార్దూల్ నాలుగు వికెట్లతో సత్తాచాటారు. అయితే తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో భారత్‌కు ఆసీస్‌ 328 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

ఇదీ చదవండి

భారత్ లక్ష్యం 328

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని